Publish Date:Jul 19, 2025
వైసీపీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీ ఆదివారం ( జులై 20) సత్తెన పల్లి పోలీసుల విచారణకు హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసు నిబంధనలను ఉల్లంఘించి మరీ జన సమీకరణ చేశారనే ఆరోపణలపై విడదల రజినిపై సత్తెనపల్లి పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసుకు సంబంధించే పోలీసులు రజనీకి నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల మేరకు ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉంది.
జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా ఆయన కారు కింద పడి ఒక వ్యక్తి మరణించిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా నిబంధనలను ఉల్లంఘించి పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడం ద్వారా ప్రజల ఆస్తులకు నష్టం కూడా వాటిల్లిందని పేర్కొంటూ.. నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసులు మొత్తం 113 మంది వైసీపీ నాయకులపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలా నోటీసులు అందుకున్న వారిలో పలువురు ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. ఇప్పుడు విడదల రజనీ వంతు వచ్చింది. ముందుముందు మరింత మందిని పోలీసులు విచారించే అవకాశం ఉంది. వరుస కేసులు అరెస్టులతో వైసీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రభయాందోళనలకు గురౌతున్నారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డి అరెస్టు జరిగింది. ఇప్పుడిక విడదల రజని వంతు వచ్చిందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది.
విడదల రజనీపై జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా నిబంధనల ఉల్లంఘన కేసు మాత్రమే కాకుండా పలు అవినీతి కేసులు కూడా ఉన్నాయి. పల్నాడు జిల్లా యడ్లపాడులో స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2 కోట్ల 20 లక్షల రూపాయలు వసూలు చేశారనే కేసులో ఇప్పటికే విడదల రజిని మరిదిని పోలీసులు అరెస్టు చేశారు. ఆరోపణలపై ఇప్పటికే ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు ఈ కేసులో విడదల రజని, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువా, రజిని పీఏ రామకృష్ణలు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో రెంటపాళ్ల కేసులో రజనీని అరెస్టు చేయడం అంటూ జరిగితే.. వరుస పీటీవారెంట్లతో ఆమె సుదీర్ఘకాలం కటకటాల వెనుకే ఉండేలా పోలీసులు వ్యూహాత్మకంగా సాగుతున్నారని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-it-is-vidadala-rajini-turn-25-202312.html
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్పందించారు.
ఏపీ మెగా డీఎస్సీ కీ విడుదలైంది. 16,347 టీచర్ల నియామకాల కోసం జూన్ 6 నుంచి జూలై 2 వరకు పరీక్షలు నిర్వహించారు.
వరుసగా నాలుగు సెంచురీలు. ఆపై మొన్నటికి మొన్నపద్మ అవార్డు. ఆపై తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఎన్టీఆర్ అవార్డు.
ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఈ నెల 5న విచారణకు హాజరుకాకుండా ఆయన విదేశాలకు వెళ్లిపోతారనే అనుమానాల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని రకాల పాఠశాలల ఆవరణలోకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు తప్ప ఏ ఇతర అనధికారిక వ్యక్తులను అనుమతించరాదని నిర్ణయించింది.
కాళేశ్వరంపై పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించారు. నివేదికలోని ముఖ్య అంశాలను అధ్యయనం చేసి పూర్తి సారాంశాన్ని తయారు చేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది.
వైఎస్ఆర్ కడప జమ్మలమడుగు మండలం, గూడెంచెరువు గ్రామంలో ఉల్సాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికెళ్లి వితంతు పెన్షన్ను ముఖ్యమంత్రి చంద్రబాబు అందించారు
సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్లోని తన నివాసంలో మంత్రి ఉత్తమ్, సీఎస్ రామకృష్ణ సమావేశం అయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను ముఖ్యమంత్రికి సీఎస్ అందించారు. ప్రస్తుతం నివేదికలోని కీలక అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం అందుతోంది.
వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేసేసి.. రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వ్యవసాయమే వ్యాపకంగా బతుకుతున్నానని ఎంతగా చెప్పుకున్నా.. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో చేసిన అక్రమాలు, అన్యాయాలు, కబ్జాలు ఆయనను ఇప్పటికీ వెన్నాడుతూనే ఉన్నాయి.
తెలంగాణలో సంచలన సృష్టించిన గొర్రెల పంపిణీ స్కామ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సంచలన ప్రకటన చేసింది. గొర్రెల పంపిణీ పథకంలో వెయ్యి కోట్లకుపైగా అక్రమాలు జరిగినట్లు అధికారిక ప్రకటన చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రజలలో మమేకం అయ్యే విషయంలో అన్నిహద్దలూ చెరిపేస్తున్నారు. గతానికి భిన్నంగా ఆయన క్షేత్ర స్థాయిలో జనంతో మమేకం అవుతూ, వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ వాటి పరిస్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రస్తుతం జర్నలిజం విలువలు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతిన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదను కాపాడుకోవడానికి తప్పులు కప్పిపుచ్చుకనేందుకు పనిచేస్తున్నాయిని పేర్కొన్నారు.
ఏపీలో పెట్టుబడి దారుల సందేహాలన్నీ దాదాపు నివృత్తి అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై నమ్మకం, విశ్వాసంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సుకత చూపుతున్న పెట్టుబడి దారులకు ఇంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే పరిస్థితి ఏమిటన్న సందేహం ఉండేది.