Publish Date:Oct 18, 2022
ప్రశ్నించినా, ఎదిరించినా తమ పార్టీ అధినేత జగన్ సహించలేరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. అందుకూ విశాఖ భూ బకాసరుల బండారం బయటపడుతుందన్న భయంతోనే జనసేన అధినేత విశాఖలో జనవాణి కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకున్నారని అన్నారు.
రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం తప్పదాలను ఎత్తి చూపినందుకే గతంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టారని అన్నారు. నిన్నటి వరకూ తెలుగుదేశం కార్యకర్తలను సీఐడీ పోలీసులు అర్ధరాత్రి తీసుకెళ్లి చితక బాదుతున్నారని, ఇప్పుడు ఆ వంతు జనసైనికులకు వచ్చిందని రఘురామరాజు అన్నారు.
వారు ఒకింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ తన సూచనను తేలిగ్గా తీసుకోవద్దని ఆయన జనసేనను కోరారు. వాతావరణ కేంద్రం తుపాను హెచ్చరిక ఎలా జారీ చేస్తుందో.. అలా తాను ఈ సీఐడీ దాడుల హెచ్చరిక జారీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం సంక్షోభంలో ఉందన్న రఘురామకృష్ణం రాజు తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలోని ఇతర రాజకీయ పార్టీలూ రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రం, రాష్ట్రపతిలకు వివరించి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలని కోరాలని సూచించారు. విశాఖ గర్జన్ పేరుతో విశాఖను రెండు రోజుల పాటు పోలీసు వలయంలో దిగ్బంధనం చేసి..విశాఖ వాసులకు ప్రభుత్వం నరకం చూపిందన్నారు.
విశాఖ విమానాశ్రయం వద్ద పోలీసులే విధ్వంసం సృష్టించి జనసైనికులు, ప్రజలను తరిమి కొట్టారని రఘురామ ఆరోపించారు. విశాఖలో పోలీస్ యాక్ట్ అమలులో ఉందని చెబుతున్న పోలీసులు విశాఖ గర్జనను ఎలా జరగనిచ్చారని ఆయన ప్రశ్నించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-it-is-janasenas-caders-turn-39-145621.html
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు
ఖమ్మంలో బీఆర్ఎస్కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.