Publish Date:Mar 22, 2024
చేస్తే చీపురుపల్లి నుంచి పోటీ చేయి, లేకుంటే పార్టీ కోసం పని చేయి.. ఇదీ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన సంకేతం. వచ్చే లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితా శుక్రవారం (మార్చి 22) విడుదల చేసిన చంద్రబాబు ఈ జాబితాలో గంటా పోటీ చేయాలని భావిస్తున్న భీమిలీ నియోజకవర్గానికీ, అలాగే గంటాను తాను పోటీ చేయమని చెబుతున్న చీపురుపల్లి నియోజకవర్గానికీ అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచారు.
తద్వారా చంద్రబాబు తన ఉద్దేశమేమిటన్నది స్పష్టంగా చాటారు. చీపురుపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న మంత్రి, ఆ పార్టీ సీనియర్, కీలక నేత బొత్స సత్యాన్నారాయణపై గంటాను పోటీకి నిలబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన నియోజకవర్గ ఇప్పటికే విస్పష్టంగా గంటాకు తెలియజేశారు. అయితే గంటా మాత్రం తాను విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తాననీ, చీపురుపల్లిలో అయితే విజయావకాశాలపై నమ్మకం లేదనీ అంటున్నారు. అయితే చంద్రబాబు మాత్రం సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయి, గంటా అయితే అక్కడ కచ్చితంగా విజయం సాధిస్తారని అంటున్నారు. ఈ విషయంలో గంటా ఇంకా ఏమీ తేల్చుకోకపోవడంతో తాజాగా విడుదల చేసిన జాబితాలో భీమిలి, చీపురుపల్లి నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచిన చంద్రబాబు నాయుడు ఇక బంతిని గంటా కోర్టులోనే వేశారు.
ఒక వేళ చీపురుపల్లి నుంచి పోటీకి గంటా సంసిద్ధత వ్యక్తం చేయకుంటే ఆయన సేవలను పూర్తిగా పార్టీకి వినియోగించుకుంటామని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. భీమిలీ, చీపురుపల్లి మాత్రమే కాకుండా చంద్రబాబు మూడో జాబితాలో ఇంకా ఎచ్చర్ల, ధర్మవరం కూడా పెండింగ్ లో ఉంచారు. ఆ నియోజకవర్గాల నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కళావెంకటరావు, పరిటాల శ్రీరామ్ లు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఈ రెండు స్థానాలూ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే అవకాశం ఉందని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/now-ball-is-in-ganta-court-25-172569.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.