2015లో మొదలైన ఓటుకు నోటు కేసు తెలంగాణ రాజకీయాలనే మలుపు తిప్పిందంటే అతిశయోక్తి కాదేమో. ఆనాడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ వివాదంలో కీలకంగా ఉన్న ఇద్దరు నేతలకు గొప్ప పదవులను కట్టబెట్టింది. ఇది నిజంగా ఒక విచిత్ర రాజకీయ పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇక వివరాల్లోకి అంటే.. 2015 కి వెళ్తే.. నాడు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు రూ. 50 లక్షలు ఇస్తూ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఆ ఎన్నికల్లోతెలుగుదేశం అభ్యర్థిగా నిలిచింది మరెవరో కాదు.. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి. అప్పట్లో ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పట్లో స్టీఫెన్ సన్ నివాసంలో రేవంత్ ఉన్న దృశ్యాలు, ఆడియో టేపులు.. బ్రీఫ్డ్ మీ వంటి పోన్ సంభాషణలు పెను ప్రకంపనలు పుట్టించాయి.
ఈ ప్రకంపనలు ఎంత మేలు చేశాయంటే.. రేవంత్ రెడ్డి ఆ కేసు విషయంలో అరెస్టు కాగా.. అది ఆయనలో ఎలాగైనా సరే కేసీఆర్ పీచమణచాలన్న కృతనిశ్చయం వచ్చేలా చేసింది. దానికి తోడు ఆయన తన కుమార్తె వివాహ సమయంలో ఈ అరెస్టు కావడంతో ఆ కసి రెట్టింపు అయ్యింది. కేసీఆర్ నీ అంతు నా చేతుల ద్వారానే జరుగుతుంది చూసుకో! అంటూ ఆయన జైలు నుంచి విడుదలైన టైంలో చేసిన ప్రసంగాలు, పిడికిలి బిగించి చేసిన సంజ్ఞలు తెలంగాణ రాజకీయాల్లోనే ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచాయి. ఆ తర్వాత కాలంలో.. ఆ కసీ క్రోధమే రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
ఈ కేసు రేవంత్, వేం నరేందర్ రెడ్డి.. ఇద్దరినీ ఒకరికొకరు నమ్మకమైన స్నేహితులుగా మార్చేసింది. ఇరువురూ తమ కష్టనష్టాల్లో పాల్పంచుకున్నారు. ఒకరి శ్రేయస్సే మరొకరిగా భావించచారు. ఇప్పుడు చూస్తే వారి మధ్య ఆ గాఢానుబంధం.. రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే ఒక ప్రత్యేక స్నేహ అధ్యాయాన్ని లిఖించింది. దీంతో పాటు ఈ కేసు ద్వారా జరిగిన మరో విషయమేంటంటే.. ఏమిటంటే చంద్రబాబు హైదరాబాద్ రాజధానిగా పదేళ్లు ఉండటానికి హక్కున్నా దాన్ని వదులుకుని అమరావతి వెళ్లిపోయారు. అక్కడే ఉంటూ ప్రజలకు అత్యంత దగ్గరగా మసులుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు.
ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే.. చెడు జరిగిందని.. ఇక అక్కడితో అయిపోయిందని భావించకూడదు. ఒక చెడు మరో మంచికే అని భావించి ముందడుగు వేయాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/note-for-vore-case-25-215097.html
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్తో పునాదులు పడ్డాయి. అక్కడి నుంచి ఈ పార్టీ అంచలంచలుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గతంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాసన రుచి చూపడంతో.. ఇప్పుడు వరుసగా మూడు పర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్రస్తుతం అప్రతిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
న్ని ఎన్నికలలో విచిత్రాలు జరగవు. ప్రతిసారీ ఒకటే జరిగితే, దాన్ని విచిత్రం అనరు కదా? ఎన్నికలు జరిగి నిండా రెండేళ్లు కాకముందే నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటి పలుకు వినపడుతున్నది. కొందరు ప్రముఖులు పక్కదారులు చూస్తున్నారని, పక్క పార్టీతో బేరసారాలు జరుపుతున్నారని కూడా వినపడుతున్నది.
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.