Publish Date:Oct 27, 2023
మంత్రులు, ఎమ్మెల్యేలు సామాజిక సాధికార యాత్ర పేరుతో ప్రత్యేక బస్సులు వేసుకొని యాత్రకు బయలుదేరారు. మంత్రులకు చేసే పనేం లేదన్న విషయం తెలిసిందే. ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అన్ని నిర్ణయాలూ సీఎం జగన్ తీసుకుంటారు. జగన్ తీసుకుంటారనే కంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శా సజ్జల రామకృష్ణారెడ్డే చూసుకుంటారంటే సరిగ్గా సరిపోతుంది. ఆయా శాఖలకు సంబంధించి కార్యక్రమాలపై మీడియా సమావేశాలను కూడా సజ్జలే అడ్రస్ చేస్తారు. దీంతో పని లేని మంత్రులకు ఏదో పని చెప్పాలికదా అన్నట్లుగా సీఎం జగన్ ప్రభుత్వ ఘనతలను ప్రజలకు చాటండంటూ బస్సు యాత్ర పేరిట వారిని జనంలోకి పంపించేశారు. ఇక ఎమ్మెల్యేల సంగతి చప్పనవసరం లేదు. వారికీ వారి వారి నియోజకవర్గాలలో ఎటూ పనిలేదు. అన్నీ వాలంటీర్లే చూసుకుంటారు. సో వారినీ జనం మీదకు తోలేశారు సీఎం జగన్.
బస్సు యాత్ర పేరిట జనంలోకి వెళ్లి వారు చేయాల్సిందేమిటయ్యా అంటే మా ప్రభుత్వం ఇది చేసింది.. అది చేసింది. మా ప్రభుత్వ హయాంలో ఇంత అభివృద్ధి జరిగింది. అంత అభివృద్ధి జరిగింది అని చెప్పుకోవడం కాదు. ఎందుకంటే అదేం జరగలేదన్న విషయం ప్రజలకే కాదు.. బస్సు యాత్ర పేరిట జనంలోకి వస్తున్న మంత్రులూ, ఎమ్మెల్యేలకు కూడా స్పష్టంగా తెలుసు. అందుకే వారు ఈ బస్సు యాత్ర పేరిట ఒకే మంత్రం జపిస్తున్నారు. ఆ మంత్రుం ఏమిటంటే..విపక్షాలపై విమర్శలతో విరుచుకుపడటం. ఆ విమర్శలను జనం పట్టించుకుంటున్నారా? లేదా అన్నది వారికి అనవసరం. మీడియాలో వచ్చి అది సీఎం జగన్ కంట పడితే చాలు. వారి లక్ష్యం నెరవేరిందని సంబరపడిపోతారు.
జనం ఛీత్కారాలు, తిరుగుబాట్లు వారికేం కొత్త కాదు. గతంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలోనే వారికి జనం ఛీత్కారాలు అనుభవేకవైద్యం అయ్యాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలోనూ ఎక్కడా ఈ ఐదేళ్లలో ఇది చేశాం అని చెప్పుకోవడానికి ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు. వైసీపీ నేతలు, మంత్రులూ ఏదైనా కార్యక్రమం పెట్టుకుని జనంలోకి వచ్చినా.. వారికి ఎదురౌతున్నది ప్రజా తిరస్కారం మాత్రమే. సమస్యలపై నిలదీతలు, హామీలను విస్మరించారంటూ జనం ఆగ్రహం ఇవే వారికి ఎదురౌతున్నది. అయితే ఈ సారి బస్సు యాత్రలో వారికి గొప్ప ఉపశమనం కలిగింది. అదేమిటంటే వారి యాత్రను జనం అస్సలు పట్టించుకోలేదు. ఎక్కడికి వెళ్ళినా పట్టుమని వంద మంది కూడా రాని పరిస్థితి. ముఖ్యమంత్రి సభలకు అయితే నయానో భయానో, బెదరించో, బామాలో జన సమీకరణ చేసేవి పార్టీ శ్రేణులు. విషయం తెలిసి కూడా చేతి చమురు వదుల్చుకుని బస్సు యాత్రలకు కూడా జనసమీకరణ కోసం కష్టపడటం ఎందుకనుకున్నారో ఏమో కార్యకర్తలు కూడా కాడి వదిలేవారు. దీంతో వైసీపీ బస్సు యాత్రలు ఎవరికీ పట్టని కార్యక్రమంగా మారిపోయాయి.
తొలి రోజు మూడు ప్రాంతాల నంచీ ఏకకాలంలో ప్రారంభమైన బస్సు యాత్రలలో ఇదే పరిస్థితి సాక్షాత్కరించింది. ఖాళీ కుర్చీలను ఉద్దేవించి చేసిన ప్రసంగాలలో కూడా నేతలు చంద్రబాబునాయుడిని, జనసేనానిని విమర్శించడానికే పరిమితమైపోయారు తప్ప.. మరో మాట వారి నోటి వెంట రాలేదు. ఇంతకీ ఈ యాత్రలో వైసీపీ వారికి కలిగిన ఉపశమనం ఏమిటంటారా.. జనం పట్టించుకోకపోవడంతో గడపగడపకూలోలా వారికి నిరసన సెగలు తగలలేదు. మొత్తంగా వైసీపీ ఆర్భాటంగా ప్రారంభించిన ఈ యాత్రను ప్రజలే కాదు, వైసీపీ శ్రేణులు కూడా పట్టించుకోలేదన్నదే పరిశీలకులు విశ్లేషణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/not-only-people-ycp-cadre-also-ignored-bus-yatra-39-164074.html
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.