వైసీపీకి నేతలే కాదు.. క్యాడరూ దూరమే!.. ఇది జగన్ స్వయంకృతమే!

Publish Date:Sep 30, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో  వైసీపీ ఉనికి మాత్రంగా కూడా మిగిలే అవకాశాలు లేకుండా ఆ పార్టీ అధినేత అడుగులు పడుతున్నాయా? నాయకులు, కార్యకర్తలు పార్టీని వదిలి పారిపోయే పరిస్థితులను స్వయంగా సృష్టిస్తున్నారా అంటే పరిశీలకులు ఔననే సమాధానమే ఇస్తున్నారు. పిడిక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా జగన్ తన తప్పిదాలను, తన వైఫల్యాలను తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు, ఆ పార్టీకీ ఆపాదించి చేతులు దులిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. బూమరాంగ్ అవుతున్నాయి. వైసీపీ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్నాయి. తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో  కల్తీ నెయ్యి వినియోగం బయటపడిన క్షణం నుంచీ జగన్ వ్యూహాలన్నీ భస్మాసుర హస్తాన్ని తలపింప చేసేలాగే ఉన్నాయి. ఈ వివాదం నుంచి బయటపడటం కోసం ఆయన ఎంచుకున్న ఎదురు దాడి వ్యూహం వైసీపీనీ, జగన్ ను నిండా ముంచేసింది. 

తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం విషయం వెల్లడి కాగానే జగన్ కల్తీ జరిగితే జరిగింది.. కానీ దానికి బహిర్గతం చేయడం ఏమిటి? అంటూ ఎదురుదాడికి దిగారు. కల్తీ అబద్ధమని గట్టిగా చెప్పలేకపోయారు.  జనసేనాని పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత దీక్ష అనగానే దానికి కౌంటర్ గా తాను ప్రాయశ్చిత పూజలు అంటూ ప్రకటన చేశారు. తిరుమల వెంకన్న స్వామిని దర్శించుకుని ప్రాయశ్చిత పూజలు నిర్వహిస్తానని ప్రకటించి.. ఇందుకు షెడ్యూల్ కూడా ప్రకటించేశారు. అయితే తిరుమల వేంకటేశ్వరుడిపై విశ్వాసం ఉందన్న డిక్లరేష్ ఇవ్వడానికి మాత్రం ససేమిరా అన్నారు. తన తిరుమల పర్యటనను సైతం రద్దు చేసేసుకున్నారు. దీంతో వైసీపీ నేతలు, కార్యకర్తల  పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. జగన్ తన తీరుతో తమ రాజకీయ భవిష్యత్ కు సమాధి కట్టేశారని వైసీపీ నేతలు వాపోతున్నారు. ఇక పార్టీ క్యాడర్ మనో ధైర్యమైతే పాతాళానికి పడిపోయింది. 

జగన్ తన పర్యటనను తానే స్వయంగా రద్దు చేసుకుని ప్రభుత్వం అడ్డుకుందని ప్రజలను నమ్మించడానికి చేసిన ప్రయత్నాలు వృధా అయ్యాయి. ప్రజల దాకా ఎందుకు తన తిరుమల పర్యటనకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ ఆయన చేసిన ఆరోపణలను సొంత పార్టీ నేతలూ, కార్యకర్తలే నమ్మడం లేదు. నిజంగానే ఒక వేళ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే పార్టీకి అంత కంటే కావలసిందేముందని, ఎందుకు అనుమతి ఇవ్వరంటూ జగన్ తిరుమల పర్యటనకు బయలు దేరి ఉండాల్సిందనీ శ్రేణులు అంటున్నాయి. అప్పుడు పోలీసులు అడ్డుకుని ఉంటే.. ప్రజలలో మంచి మైలేజ్ వచ్చి ఉండేది కదా అంటున్నారు.  అలా కాకుండా అసలు జగన్ తన తాడేపల్లి ప్యాలెస్ గేటు దాటకుండానే ప్రభుత్వం అడ్డుకుందంటూ చేతులెత్తేయడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు.  

అయినా ఓ వైపు ప్రభుత్వం జగన్ తిరుమల పర్యటనపై ఎలాంటి ఆంక్షలూ లేవని విస్పష్టంగా ప్రకటించిన తరువాత కూడా పోలీస్ యాక్ట్ 30 ప్రకారం ఎవరో వైసీపీ కార్యకర్తకు ఇచ్చిన నోటీసును తనకు ఆపాదించుకుని జగన్ పిరికిపందలా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని అంటున్నారు. అలా రద్దు చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి లేకపోవడం ఏ మాత్రం కారణం కాదని వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకనే జగన్ తన తిరుమల పర్యటన రద్దు చేసుకున్నారని ఆ శ్రేణులు నమ్ముతున్నాయి. జగన్ డిక్లరేషన్ ఇవ్వరు అంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటున్నాయి.  డిక్లరేషన్ ఇవ్వలేని జగన్ కు తిరుమలలో ప్రాయశ్చిత పూజలు నిర్వహించే అధికారం ఎక్కడిదని వైసీపీ శ్రేణులే అంటున్నాయి. మొత్తంగా ఓటమి తరువాత జగన్ పార్టీని నేతలు వీడుతూ వస్తున్నారు. ఇప్పుడు డిక్లరేషన్ ను నిరాకరించి పార్టీ  కార్యకర్తలూ పారిపోయే పరిస్థితి జగన్ స్వయంగా తెచ్చుకున్నారు. 

By
en-us Political News

  
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.