Publish Date:May 21, 2022
ఎన్నికల ముందు జగన్ గొప్పగా ప్రచారం చేసుకున్న నవరత్నాలు వాస్తవానికి నకిలీ రాళ్లన్న విమర్శలు సాక్షాత్తూ లబ్ధిదారుల నుంచే వినవస్తున్నాయి. నవరత్నాల హామీలు గుప్పించిన జగన్ తీరా అధికారం లోకి వచ్చికా వాటిలో ఒక్కో దానిలోనూ కోత పెడుతూ, లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ మోసం చేస్తున్నా రన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ కోవలోకే ఇప్పుడు అమ్మ ఒడి పథకం కూడా చేరింది. ఈ పథకంతో లబ్ధిదారులకు ఉపయోగం లేకుండా చేసే కుట్ర జగన్ రెడ్డి సర్కార్ చేస్తోంది. మొన్నటికి మొన్నామధ్య పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో అమ్మఒడి కింద తల్లుల ఖాతాల్లో వేయాల్సిన 15 వేల నుంచి ఒక వేయి రూపాయలకు కోత వేసింది. ఇప్పుడు తాజాగా మరో ఎత్తుగడతో మరో వెయ్యి రూపాయలను అమ్మవడి నుంచి కోత పెట్టేందుకు స్కూళ్లలో మౌలిక వసతుల కల్పన పేరుతో మరో సాకు చెబుతోంది.
కుటుంబంలో స్కూలు వెళ్లే చిన్నారులున్న ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో ఏటా 15 వేల రూపాయలు వేస్తానని అప్పట్లో వైఎస్ జగన్ గొప్పగా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే ఆ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందంటూ ఝలక్ ఇచ్చింది. రెండో సంవత్సరం వచ్చేసరికి స్కూళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో పథకం నుంచి వెయ్యి రూపాయలు లాగేసుకుంది.
ఇప్పుడు మరో వెయ్యికి ఎసరు పెట్టి, 13 వేలే వేస్తామని చెప్పడంతో లబ్ధిదారుల్లో నిరాశ నెలకొంది. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో లాగేసుకోవడం అంటే ఇదే అని వారు అసంతృప్తికి గురవుతున్నారు. వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అమ్మ ఒడి పథకం అమలు చేయాల్సి ఉంది. అయినా.. మధ్యలోనే తూట్లు పొడవడం ఏంటనే ప్రశ్నలు జనం నుంచి వస్తున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/not-navaratnaalu-fake-stones-25-136247.html
తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరమైన మలుపులతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి.
పవన్ కళ్యాణ్పై తెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
చివరి గింజ ధాన్యం కొంటామన్న కాంగ్రెస్ సర్కార్ అప్పులు చేయడంలో రేవంత్ ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని విమర్శించిన కేటీఆర్.. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం 4 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందన్నారు.
లంగాణ ప్రజల దశాబ్దాల కల సాకారమైన రోజున ఇక్కడి సెంటిమెంట్ను దెబ్బతీసేలా మాట్లాడటం సరికాదన్నారు. గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు అన్నం తినలేదని పవన్ కల్యాణే స్వయంగా చెప్పారనీ.. అలాంటి వ్యక్తి మళ్లీ ఇప్పుడు తెలంగాణకు తాను వ్యతిరేకం కాదంటూ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ అన్నారు.
జగన్ ఎప్పుడెప్పుడు అధికారం నుంచి దిగిపోతారా అని దేవుళ్లకు పూజలు చేశారు, శాపనార్థాలు పెట్టారు. జగన్ అధికారంలో ఉంటే తమ అమరావతి కలలు ఎప్పటికీ ఫలించవని ఆవేదన చెందారు. అలాంటిది, ఇప్పుడు అదే అమరావతికి చెందిన రైతులు తాడేపల్లిలోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనతో సుదీర్ఘంగా భేటీ అయ్యారనే వార్త పొలిటికల్ సర్కిల్స్ నే కాకుండా సామాన్య ప్రజలను కూడా విస్మయానికి గురి చేసింది.
దశాబ్దాలుగా కోలీవుడ్ లో సంపాదించుకున్న తన స్టార్ డమ్ ను, ఫ్యాన్ ఫాలోయింగ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకోవడంలో విజయ్ సఫలమయ్యారు. వీటన్నింటికీ తోడు తమిళనాట కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజ నేతల మరణాల తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యం విజయ్ కు అనుకూలంగా మారింది.
ఈ విజయం కేవలం ఒక పదవి మాత్రమే కాదని, తన దశాబ్దాల కఠిన శ్రమకు, అంకితభావానికి దక్కిన అసలైన ఫలితమని ప్రకటించారు.
గతంలో మాతో పెట్టుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, ఇప్పుడు పెట్టుకుంటే మూతిపళ్ళు రాలుతాయని కవిత హెచ్చరించారు. అంతేకాకుండా, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజధాని కట్టుకోవడం చేతకానివాళ్ళు, తెలంగాణ నవనిర్మాణం చేస్తారా అంటూ ఆమె ఎద్దేవా చేశారు.
అరవ శ్రీధర్పై ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగి లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో జనసేన నాయకత్వం దీనిపై త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు జనసేన సభకు నో చెప్పారు. వేలాది మంది అభిమానులు, వందలాది మంది ముఖ్య నాయకులు హాజరయ్యే ఇటువంటి కీలక సభకు చివరి నిమిషంలో పర్మిషన్ నిరాకరించడంపై జనసేన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి కోలుకోకముందే.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలు భారీ షాక్ ఇచ్చారు. ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత.. భవిష్యత్తు కార్యాచరణను చర్చించేందుకు ఏర్పాటు చేసిన కీలక సమావేశానికి పార్టీకి ఉన్న 80 మంది ఎమ్మెల్యేలలో ఏకంగా 60 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుర్కొంటున్న ఈ రాజకీయ ఒత్తిడి, ప్రత్యర్థుల వ్యూహాలపై సీనియర్ రాజకీయ విశ్లేషకుడు భరద్వాజ తో తెలుగువ్ న్యూస్ చానల్ ప్రత్యేక ఇంటర్వూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ను మానసికంగా, రాజకీయంగా దెబ్బతీసి కూటమి స్పిరిట్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ వ్యూహాత్మక దాడులు జరుగుతున్నాయని ఆయన అన్నారు.
తెలుగువన్ వేదికగా జరిగిన ప్రత్యేక విశ్లేషణా కార్యక్రమంలో రవిశంకర్ కంఠంనేని, డోలేంద్ర ప్రసాద్.. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగ రక్షకుడిగా ఉండాల్సిన స్థానంలో కూర్చున్న ఒక న్యాయమూర్తి, పౌరులను ముఖ్యంగా దేశ యువతను పారసైట్లు, కాక్రోచ్లు అనడం అత్యంత దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు.