నాన్ స్టిక్ వంటపాత్రలు ఎంత చేటు చేస్తాయో తెలుసా?

Publish Date:Feb 28, 2025

Advertisement

 

ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం సర్వసాధారణమైపోయింది. ఈ పాత్రలు వంటను సులభతరం చేస్తాయి, వంట చేసేటప్పుడు పదార్థాలు మాడిపోవడం, వంటపాత్రలకు అతుక్కుపోవడం వంటి సమస్యలు ఉండవు. అయితే నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రమాదాలు కూడా ఉంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుంటే..

విషపూరిత రసాయనాల ప్రమాదం..


నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడానికి పాలిటెట్రాఫ్లోరోఎథిలిన్ (PTFE) అనే రసాయనాన్ని ఉపయోగిస్తారు. ఇది ఆహారం అంటుకోకుండా నిరోధించే సింథటిక్ పదార్థం. అయితే ఈ పాత్రను వేడెక్కినప్పుడు, అది రసాయనికంగా విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. విషపూరిత పొగలను విడుదల చేస్తుంది. ఈ పొగలను పీల్చడం వల్ల తలనొప్పి, తలతిరుగుడు,  ఫ్లూ లాంటి లక్షణాలు వస్తాయి.  ఈ పొగ వాతావరణంలో ఎక్కువ సేపు ఉండటం వల్ల ఆరోగద్య సమస్యలు కూడా వస్తాయి.


పెర్ఫ్లోరోక్టానోయిక్ యాసిడ్ (PFOA) ప్రమాదాలు..


నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేసే ప్రక్రియలో PFOA అనే రసాయనాన్ని కూడా ఉపయోగిస్తారు. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం.  PFOA  వల్ల క్యాన్సర్, థైరాయిడ్ రుగ్మతలు, కాలేయం దెబ్బతినడం,  రోగనిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి. ఇప్పుడు చాలా కంపెనీలు PFOA లేని ఉత్పత్తులను తయారు చేస్తున్నప్పటికీ కొన్నింటిలో ఈ రసాయనం ఉండే అవకాశం ఉంది.

హానికరమైన పదార్థాల విడుదల..

నాన్-స్టిక్ వంట సామాగ్రిని చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసినప్పుడు, దాని పూత విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది. ఈ చిన్న కణాలు ఆహారంలోకి కలిసిపోతాయి. ఈ కణాలు శరీరంలోకి వెళ్లిన తర్వాత విషపూరితంగా మారవచ్చు. దీనివల్ల జీర్ణవ్యవస్థ, కాలేయం,  మూత్రపిండాలు దెబ్బతింటాయి .

దీర్ఘకాలిక వాడకం..

నాన్-స్టిక్ వంట సామాగ్రిని ఎక్కువ కాలం ఉపయోగించడం వల్ల శరీరంలో రసాయనాలు పేరుకుపోతాయి. ఈ రసాయనాలు శరీరంలో నెమ్మదిగా పేరుకుపోయి దీర్ఘకాలంలో తీవ్రమైన వ్యాధులకు కారణమవుతాయి. ముఖ్యంగా, ఇది హార్మోన్ల అసమతుల్యత,  సంతానోత్పత్తి సమస్యలను కలిగిస్తుంది.

పర్యావరణంపై ప్రభావం..

నాన్-స్టిక్ వంట సామాగ్రిని తయారు చేయడం,  తరువాత పాడైపోయిన నాన్ స్టిక్ పాత్రలను  నాశనం చేసే ప్రక్రియ కూడా పర్యావరణానికి హాని కలిగిస్తుంది. ఈ పాత్రలలో ఉపయోగించే రసాయనాలు ప్రకృతిలో త్వరగా కరగవు,  పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి . దీనివల్ల మనుషులకే కాదు, జంతువులు, మొక్కలు కూడా నష్టపోతాయి.


                                  *రూపశ్రీ.


గమనిక:


ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

By
en-us Political News

  
Avoid These Pulses During the Rainy Season,Stay Away from These Pulses,Dont Eat These Pulses During the Monsoon
ఈ రోజుల్లో క్యాన్సర్, మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధులు చాలా మందిని ప్రభావితం చేస్తున్నాయి. అయితే మన రోజువారీ ఆహారపు అలవాట్లలో చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వర్షాకాలంలో చాలా మంది పకోరాలు, సమోసాల వంటి వేయించిన ఆహారాల కంటే మొక్కజొన్నను ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు.
రక్తంలో క్లాట్స్ ఏర్పడకుండా ఉండేందుకు, రక్త ప్రసరణను మెరుగుపరచేందుకు, బరువు నియంత్రణకు తోడ్పడే వంటింటి సహజ చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు..
నేటికాలంలో ఉపవాసం కేవలం దేవుడు, సంప్రదాయం, మతానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు..  ఫిట్‌నెస్ ప్రపంచంలో కూడా ఉపవాసం  బాగా ప్రాచుర్యం పొందింది. 16:8 డైట్ వంటి పద్ధతుల నుండి రోజుకు ఒకసారి..
మెనోపాజ్ (Menopause) వచ్చిన తర్వాత మళ్లీ బ్లీడింగ్ రావడం సాధారణ విషయం కాదు. చాలా మంది మహిళలు దీనిని చిన్న సమస్యగా భావించి నిర్లక్ష్యం చేస్తుంటారు...
టీ లో చాలా రకాలు ఉన్నాయి. వాటిలో బ్లాక్ టీ మాత్రమే కాకుండా.. గ్రీన్ టీ తో పాటు కుంకుమ పువ్వు టీ, కార్శీరీ ఖవ్వా టీ, జాస్మిన్ టీ.. ఇలా చాలా రకాలు ఉన్నాయి...
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి అన్ని విటమిన్లు , ఖనిజాలు సరైన మోతాదులో అవసరం. శరీరానికి అత్యంత ముఖ్యమైన విటమిన్లలో  విటమిన్ బి12 ఒకటి, ఇది ఎర్ర రక్త కణాల ఏర్పాటులో, సరైన నాడీ పనితీరులో..
థైరాయిడ్ సమస్యలు ప్రస్తుతం చాలా మందిలో కనిపిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో ఒకటి. అయితే, థైరాయిడ్ రావడానికి మన ఆహారపు అలవాట్లు కూడా ఒక కారణమా..
భారతీయుల భోజనంలో అన్నం చాలా ప్రధానమైనది. అన్నం తినడం వల్ల వచ్చే సాటిసిఫాక్షన్ వేరే ఏ విధంగా రాదని చాలామంది అంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో మూడు పూటలా అన్నం తినాలన్నా చక్కగా తినేస్తారు. కానీ ప్రస్తుతం డయాబెటిస్, అధిక బరువు వంటి సమస్యలతో అన్నం అంటే దూరం జరిగే వారు చాలామంది ఉన్నారు. ..
బ్రెయిన్ స్ట్రోక్ అంటే ఏమిటి? స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు, TIA హెచ్చరికలు, గోల్డెన్ పీరియడ్‌లో చికిత్స, నివారణ మార్గాలను ప్రముఖ న్యూరాలజిస్ట్ డా. అనిరుధ్ దేశ్‌ముఖ్ ఈ వీడియోలో వివరించారు...
పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. పెరుగులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటుంది. అలాగే కాల్షియం,  ప్రోటీన్ కూడా ఉంటుంది.  భారతీయులు భోజనం చివర పెరుగుతో తింటే తప్ప వారికి తృప్తి ఉండదు. వేసవి కాలంలో పెరుగును ఇష్టంగా తింటారు.
శరీరంలో వేడి, పాదాల్లో మంట, కళ్లలో మంట, నోటి పూత, గ్యాస్, అసిడిటీ ఎందుకు వస్తాయి? పిత్త దోషం లక్షణాలు, కారణాలు, ఆహారం, ఆయుర్వేద చిట్కాలను డా. చి. మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.