Publish Date:Aug 27, 2022
పిల్లలకి పాకడం రావడం ఆలస్యం ఇల్లంతా తిరిగేస్తుంటారు. వారికి అదో ఆట. ఇల్లంతా కలియ తిరగ డానికి ప్రయత్నిస్తుంటా. కానీ అంత శుభ్రంగా ఉందీ లేనిదీ తల్లిదండ్రులకు తెలుసు కాబట్టి పిల్లల్ని అలా ఇల్లంతా పాకనీయరు. ఓ క్షణం తర్వాత ఎత్తుకుంటారు. కానీ కొత్తగా నేర్చిన ఆట ఎప్పుడూ పసం దుగానే ఉంటుంది.. పిల్లలకీ అంతే. మాటలు రావు గనుక చేత్తులతో ఎత్తుకున్నవారి మొహాన్ని కొడుతూ కిందకి వదలమంటారు. తల్లిందండ్రులకు, ఇంట్లో పెద్దవారికి అదో ఆనందం. దానికి అంతే ఉండదు.
కానీ ఇలా అమితోత్సాహంతో పిల్లలు మేడ మెట్లు ఎక్కడానికీ ప్రయత్నిస్తుంటారు. ఇది ప్రమాదకరం. అందుకే వెనకాలే తిరుగుతూ మెట్ల వేపు వెళ్లకుండా జాగ్రత్తపడుతుంటారు, జాగ్రత్తపడాలి. నడక వస్తే పట్టుకోవడం మరీకష్టం. ఇంట్లో పిల్లలతో పాటు కుక్కపిల్లనీ అంతే ప్రేమగా చూసుకునేవారు చాలా మందే ఉన్నారు. అది కూడా అలా పాకుతూనో, నడకనేర్చి రెండు అడుగులు వేసే పిల్లలతోనో తిరుగు తూనే ఉంటుంది. దానికి పెద్దవాళ్ల తర్వా త ఇంట్లో హఠాత్తుగా ఈ రాజు, రాకుమారి ఎవరా అని ఆశ్చర్యం.
మెల్లగా ఇంట్లోవారు పిల్లనో, పిల్లాడినో ఎలా చూస్తున్నారన్నది కుక్కపిల్లా గమనిస్తుంది. అదీ అంతే జాగ్ర త్తలు తీసుకుంటుంది. వేగంగా వెళు తుంటే అడ్డుకోవడం, మెట్లు ఎక్కబోతే వారించడమే చేస్తుంది. పిల్ల లు కోపగించి దాన్ని కొడతారు. దానికి దెబ్బే తగలదు కానీ, అడ్డుకోవడం మాత్రం మానదు. పడతారన్న భయం తల్లిదండ్రులకు ఎలా ఉంటుందో తోడుగా తిరిగే కుక్కపిల్లకీ ఉంటుందేమో!
మీరు చూస్తున్న ఫోటోలో సీన్ అదే. ఆ పసికూన మెట్లెక్కడానికి విశ్వయత్నం చేస్తోంది. ససెమీరా అంగీ కరించని కుక్క అడ్డుకుంటోంది. పిల్లడు ఎక్కి పడితే తల్లిదండ్రులు ఓదార్చి ముద్దెడతారు. కానీ తన్ను లు మాత్రం తనకు తప్పవుకదా! అదీ కారణం కావచ్చు.. అందుకునే అడ్డుకుంటోంది! ఇది ఎక్కడదని కాదు.. ప్రతీ ప్రాంతంలో దాదాపు కుక్కలున్న ప్రతీ ఇంట్లో సీన్ ఇలానే ఉంటుంది. కుక్కలు యజమాని భక్తులు. తిండిపెట్టి పెంచుతున్నారు గనుక, దెబ్బలు తినకూడదుగదా! అందుకునే ఈ రక్షణకు పూనుకుంటుంది!
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-i-dont-allow-you-25-142754.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.