దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ లోని ఆయన సమాధి వద్ద శుక్రవారం ఉదయం సీఎం జగన్, వైఎస్సార్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల ఇతర కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. ప్రతి ఏటా ఇలా వైఎస్సార్ కు జయంతి రోజున, వర్ధంతి రోజున ఇలా నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయమే. ప్రతి ఏటా నిర్వహించే ఈ కార్యక్రమాన్ని వైఎస్ కుటుంబం మొత్తం ఒక్కటై నిర్వహిస్తుంది.
ఇడుపులపాయలో గత ఏడాది నిర్వహించిన వైఎస్సార్ జయంతి కార్యక్రమంలో వైఎస్ జగన్, వైఎస్ షర్మిల విడివిడిగా పాల్గొన్నారు. ఈ సారి మాత్రం ఒకేసారి పాల్గొన్నా.. ఇద్దరూ వైఎస్సార్ సమాధి వద్ద కాస్త దూరం దూరంగానే కూర్చోవడం గమనార్మం. వైఎస్ షర్మిల, ఆమె కొడుకు దగ్గర దగ్గరగా కూర్చుంటే.. జగన్ మాత్రం మరికాస్త దూరంలో కూర్చోవడాన్ని అందరూ గమనించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అన్నా చెల్లెలు మాట్లాడుకుంటారేమో, ఒకవేళ మాట్లాడుకుంటే ఏమి మాట్లాడుకుంటారో అనే ఉత్కంఠ అక్కడ ఉన్నవారిలో కనిపించింది.
అయితే.. కాస్త దూరంగానే కూర్చున్నా.. ఒకేసారి తండ్రి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నా జగన్- షర్మిల ఒక్క మాట కూడా మాట్లాడుకోకపోవడంతో విస్తుపోవడం అందరి వంతు అయింది. అంటే ఎంతో అన్యోన్యంగా ఉండే అన్నా చెల్లెలు జగన్- షర్మిల మధ్య అంతలా సంబంధాలు చెడిపోయాయనేది ఈ సంఘటనతో చెప్పకనే చెప్పినట్లయిందంటున్నారు.
అన్న జగన్ తో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో షర్మిల వేరు కుంపటి పెట్టుకుని తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పేరుతో జనం మధ్యలోకి వెళ్తున్నారు. మరో పక్కన జగన్ రోజు రోజుకూ జనానికి దూరమైపోతున్నారు. జగన్ జైలులో ఉండగా ‘అన్న వదిలిన బాణాన్ని’ అంటూ షర్మిల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే. అన్న కోసం చెల్లెలు షర్మిల అంతలా కష్టపడితే.. ఇప్పుడు ఆమెకు జరిగిందేంటో.. కుటుంబంలో ఎందుకు ఇంతలా విభేదాలు వచ్చాయో వారే స్వయంగా పెదవి విప్పితే తప్ప తెలిసే అవకాశం లేదు.
ముక్తాయింపు ఏంటంటే.. వైసీపీ ఏర్పాటైనప్పటి నుంచీ ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ తల్లి వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేయడం. మంగళగిరిలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అంటే.. ముందు నుంచీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నట్లు అటు చెల్లిని బయటికి గెంటేసిన జగన్ తల్లికి కూడా నామం పెట్టారా? అందుకే ఆమె వైసీపీ పదవికి రాజీనామా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-words-between-jagan-and-sharmila-39-139331.html
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.
పాలనాపరమైన కఠిన నిర్ణయాలే కాకుండా.. రాష్ట్ర ఆర్థిక, సాంకేతిక వృద్ధి కోసం విజయ్ ప్రభుత్వం వెట్రి తమిళగం విజన్ పేరుతో వియయ్ కార్యాచరణ ప్రకటించారు. ఈ విజన్ కింద 50 వేల కోట్ల రాష్ట్ర పెట్టుబడి నిధి ఏర్పాటుకు ప్రతిపాదించడమే కాకుండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రిక్ వాహనాలు, సెమీకండక్టర్ల రంగాలలో ప్రభుత్వం నేరుగా కో ఇన్వెస్టర్ గా భాగస్వామ్యం వహించేలా నిర్ణయించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ విషయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నవన్నీ డ్రామాలేనని కేంద్ర మంత్రి పెమ్మసాని విమర్శించారు. 2015లోనే నాటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు, అప్పటి కేంద్ర మంత్రిఅశోక్ గజపతిరాజు చొరవతో భోగాపురం ఎయిర్పోర్టుకు రూపకల్పన చేసిందనీ, 2 వేల 200 ఎకరాల భూసేకరణ కూడా పూర్తి చేసిందని స్పష్టం చేశారు.
గత తప్పిదాల కారణంగా వైసీపీ నేతలు ఒకరి వెంట ఒకరు అన్నట్లుగా కేసుల ఉచ్చుల్లో చిక్కుతున్నారు. ఇక తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెడుతుండటంతో వైసీపీ నేతలలో నిరాశ నిస్ఫృహలు అలుముకుంటున్నాయి.
భోగాపురం విషయంలో వైసీపీ అధినేత జగన్.. ఒకే సమయంలో క్రెడిట్ చోరీకీ, విమానాశ్రయం సాకారం కావడం పట్ల విమర్శలకు పాల్పడటం అపహాస్యం పాలౌతోంది.
దీంతో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ ముఖ్యమంత్రి విజయ్ కావేరి వివాదంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు. కావేరి జలాలు తమిళనాడుకు అత్యంత కీలకమనీ, ఇతర రాష్ట్రాల వ్యూహాలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఏకాభిప్రాయ సాధన అవసరమని అన్నారు.