వైసీపీ నేతల అరెస్టులను జనం పట్టించుకోవడం లేదు.. కాగడా పెట్టి వెతికినా సానుభూతి కానరావడం లేదు!వైసీపీ ఆశలపై ఆ పార్టీ సానుభూతి పరుడు, జగన్ కు వీరాభిమాని అయిన ప్రొఫెసర్ నాగేశ్వర్ నీళ్లు చల్లేశారు. ప్రొఫెసర్
నాగేశ్వర్ వైసీపీకీ, జగన్ కు సానుభూతి పరుడన్న విషయం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. ఆయన తన వీడియోలు, విశ్లేషణల ద్వారా జగన్ కు గట్టి మద్దతుదారుగా గుర్తింపు పొందారు. తాను తటస్థ విశ్లేషకుడిననీ ఎటువైపూ మొగ్గు లేదని చాటుకోవడానికి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎన్నడూ ప్రయత్నించిన దాఖలాలు
లేవు. అటువంటి కరుడుగట్టిన జగన్ మద్దతుదారు.. తాజాగా తన విశ్లేషణలో జగన్ పార్టీ గాలి తీసేశారు. ఇప్పుడు వైసీపీ తమ నేతలపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్టులు చేస్తున్నదంటూ ఊరూ వాడా ఏకం చేసేలా గగ్గోలుపెడుతున్నారు. ఈ అక్రమ అరెస్టులతో తమ పార్టీపై ప్రజా సానుభూతి వెల్లువెత్తుతందని గంపెడాశతో ఉన్నారు. సరిగ్గా ఈ సమయంలో ఈ అరెస్టులను ప్రజలు అసలు పట్టించుకోవడం లేదనీ, కాగడా పెట్టి వెతికినా ప్రజలలో వైసీపీ పట్ల కానీ అరెస్టైన ఆ పార్టీ నేతల పట్ల కానీ సానుభూతి కనిపించడం లేదని కుండబద్దలు కొట్టేశారు.
ఆయన ఏమన్నారంటే జనం మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి చేయడాన్ని జనం కళ్లారా చూశారనీ, అటువంటి జోగి రమేష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చస్తే జనానికి సానుభూతి కలుగుతుందని వైసీపీ ఎలా భావిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రశ్నించారు.
అదే విధంగా వల్లభనేని వంశీ విషయంలోనూ ప్రజలలో సానుభూతి కనిపించడం లేదని అన్నారు. నారా భువనేశ్వరిపై వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, అటువంటి వంశీపై కేసులు పెడితే తప్పేమిటని జనం భావిస్తున్నారే తప్ప అయ్యే వంశీ అరెస్టైయ్యారా, కేసుల్లో ఇరుక్కున్నారా అని సానుభూతి చూపడం లేదన్నారు. వైసీపీ ఇప్పుడు తన సొంత తప్పులకు మూల్యం చెల్లిస్తోందని, అధికారంలో ఉండగా చేసిన అరాచకాలకు ఫలితం అనుభవిస్తోందని ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్కొన్నారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అరెస్టైన తరువాత కూడా ప్రజలలో ఇసుమంతైనా సానుభూతి కనిపించడం లేదు సరికదా.. తగిన శాస్తి జరిగిందన్న భావనే వ్యక్తమౌతోందని నాగేశ్వర్ అభిప్రాయపడ్డారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-sympathy-on-ycp-25-199536.html
Publish Date:Jan 10, 2026
జగన్ ఇలా నేర ప్రవృత్తి ఉన్న వారిని ప్రోత్సహించడం, వారికి మద్దతుగా నిలవడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ యువకుడు రప్పా రప్పా అంటూ ఫ్లెక్సీలు కట్టి తన ర్యాలీలో పాల్గొన్నపుడే జగన్ వారించాల్సింది. కానీ అలా చేయలేదు సరికదా? రప్పా రప్పా అంటూ గంగమ్మ జతరలో పొట్టేలు నరికినట్టు నరుకుతామనడంలో తప్పేంటని మీడియానే ఎదురు ప్రశ్నించారు. దీంతో వైసీపీయులు బరితెగించేశారు. ఆయనకేం ఎన్ని కేసులున్నా వాయిదాల మీద వాయిదాలు కోరుతూ బెయిలు మీద బయట తిరగగలరు. ఆ స్థాయి ఇన్ ఫ్లుయెన్స్, ఆర్థిక దన్ను ఆయనకు ఉంది.
ఇక్కడే కవిత రాజకీయ అడుగులు బీఆర్ఎస్ ఉనికిని ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఎందుకంటే.. ఆమె ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీల లక్ష్యమేంటంటే.. తెలంగాణ ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాల అధ్యయనం.
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరాలు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జరుగుతున్న వివాదాలను ప్రస్తావించారు. కొందరు వివాదాలు సృష్టించడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇరు రాష్ట్రాల మధ్యా జలవివాదాలు ఉండకూడదన్న లక్ష్యంతోనే నాడు కాంగ్రెస్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పచ్చ జెండా ఊపిందన్న రేవంత్ రెడ్డి, రాజకీయాలకు అతీతంగా నీటి వివాదాలను ఇరు రాష్ట్రాలూ పరిష్కరించుకోవాలన్నారు.
వాస్తవాలకు ఎలాంటి ముసుగులూ తగిలించకుండా ఉన్నది ఉన్నట్లు, కుండబద్దలు కొట్టినట్లుగా సమాజం తీరు తెన్నులను, రాజకీయ నాయకుల మధ్య నెక్సస్ ను, అధికారులు బాధ్యతారాహిత్యం, జవాబుదారీతనం లేని తనాన్ని కళ్లకు కట్టిన వాస్తవ ‘వేదిక’ తెలుగువన్ యూట్యూబ్ చానెల్ లో గురువారం ప్రసారమైంది.
ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరైన ప్రతిపక్ష నేత కేసీఆర్ వద్దకు సీఎం స్వయంగా వెళ్లి అభివాదం చేయడం, క్షేమ సమాచారాలు తెలుసుకోవడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం ఒక సంచలనం, ఒక ప్రభంజనం. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలలలో అధికారంలోకి వచ్చి నభూతో నభవిష్యత్ అన్న రికార్డు సృష్ఠించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలకు పైగా ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించారు.
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.