Publish Date:Oct 22, 2019
ఈ రోజు ఆర్టీసీ సమ్మె పద్ధెనిమిది వ రోజుకు చేరింది. అయినా ప్రభుత్వం ఎలాంటి చర్చలకు పిలవలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు సమ్మెను ఉధృతం చేశారు. ఇవాళ కూడా డిపో ముందు కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్షం పడుతున్నా లెక్క చేయకుండా డిపో ముందే కూర్చున్నారు కార్మికులు. ఈ రోజు కూడా ఆర్టీసీ కార్మికులు ఉదయం ఐదింటి నుంచే బస్ డిపో ఎదురుగా ఆందోళన నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచే కార్మికులందరూ కూడా రోడ్డుపై బైఠాయించి డిపో ముందు అంటే జెఏసి యొక్క రోజువారి ప్రణాళిక ప్రకారం నిన్న మొత్తం కుటుంబ సభ్యులతో ఆందోళన నిర్వహించిన పరిస్థితి ఉంది. తాత్కాలిక డ్రైవర్ లు, ప్రైవేటు డ్రైవర్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా డూటీలో రావద్దని, తమ పొట్ట కొట్టొద్దని చెప్పి వాళ్లని బ్రతిమిలాడిన ఆర్టీసీ జేఏసీ వారిని సమ్మెకు సహకరించాలని వేడుకుంది. రోజువారి కార్యక్రమాల్లో కూడా ఈ రోజు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఈ రోజు ఆందోళన చేస్తున్న పరిస్థితి అక్కడ నెలకొంది.
ఈ సమ్మెను అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తుంది కాని ఈ ప్రభుత్వం చర్చలకు మాత్రం పిలవటం లేదని, దయచేసి మేము కోరుకునేది ఒకటేనని తమ న్యాయమైన డిమాండ్లు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఖాళీగా ఉన్న పోస్టులు మొత్తం భర్తిచేయాలని డ్రైవర్, కండక్టర్ లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ఆర్టీసీలో కొన్ని నిధులు బడ్జెట్ లో కేటాయించాలని ఇవే వారి యొక్క ముఖ్యమైన డిమాండ్ లు అని ఆర్టీసీ నాయకుడు తెలియజేశారు. ఇప్పటి వరకు కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఆరు డిమాండ్లతో మేము చర్చ పెడితే కనీసం ఒక్క డిమాండ్ కూడా వినలేదని, కనీసం చర్చలలో మీతో అవసరం లేదు మాకు మేము వేరే రకంగా బస్సులు తిప్పుకుంటాం, తాత్కాలిక డ్రైవర్, కండక్టర్ తో బస్సులు తిప్పుకుంటామని అనే వైఖరిలో ప్రభుత్వం ఉందని ఆర్టీసీ జేఏసీ వెల్లడిస్తోంది. భగవంతుడి దయ వల్ల ఈ రోజు తాత్కాలిక డ్రైవర్లు, కండెక్టర్ లు కూడా తమకు సహకరిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.ఇక ఇప్పటి దాకా తాత్కాలిక డ్రైవర్లు పై భరోసా ఉన్న ప్రభుత్వం ఇక సమ్మె పై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అనేది వేచి చూడాలి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-solution-in-sight-as-tsrtc-strike-enters-18th-day-25-90428.html
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.