సజ్జల బాధ..ఓదార్పు ఏది?

Publish Date:Jan 22, 2024

Advertisement

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న వైసీపీలో జగన్ తరువాత ఆ స్థాయిలో పెత్తనం, పెత్తందారి తనం చేసేవారెవరైనా ఉన్నారంటే అది సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే.  పార్టీలో కానీ, ప్రభుత్వంలో కానీ ఏ కీలక నిర్ణయాన్ని ప్రకటించాలన్నీ, ప్రధాన  విధానాలను వివరించాలన్నా, నియోజకవర్గ ఇన్ చార్జ్ లను ఉంచాలా, మార్చేయాలా? ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఎవరికి నిరాకరించాలి వంటి ప్రతి విషయంలోనూ, ప్రతి నిర్ణయంలోనూ కీలకంగా వ్యవహరించేది సజ్జల మాత్రమేనని అందరికీ తెలిసిందే.  

అటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ షర్మిల కాంగ్రెస్ ఏపీ పగ్గాలు చేపట్టిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు తనను చాలా చాలా బాధపెట్టాయని దాదాపు కన్నీరు పెట్టుకున్నంత పని చేశారు. తననే కాదు.. సాక్షాత్తూ షర్మిల సోదరుడు జగన్ ను, పార్టీ నేతలు, కార్యకర్తలనూ కూడా షర్మిల వ్యాఖ్యలు బాధించాయని ఆయన చెబుతున్నారు. మీడియా ముందుకు వచ్చిన ప్రతి సారి ప్రతిపక్షాలను, ప్రతిపక్ష నేతలనూ తూర్పారపట్టడం, జగన్ సర్కార్ తప్పిదాలను సమర్ధించడం తప్ప మరో మాట మాట్లాడని సజ్జల తొలి సారిగా షర్మిల వ్యాఖ్యలు బాధించాయంటూ తెగబాధపడిపోయారు.  

ఇంత కాలం వైసీపీ నేతలు వాడిన బాష, ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై చేసిన దూష ణలను ఒక్క సారి కూడా మీడియా ముందుకు వచ్చి ఖండిచని సజ్జల..  షర్మిల  వైఎస్ జగన్ సర్కార్ తప్పిదాలను, ఆర్థిక అరాచకత్వాన్ని, జగన్ హయాంలో రాష్ట్రంలో కనిపించని ప్రగతిని, సరిగ్గా పంపిణీ కాని సంక్షేమాన్ని ప్రశ్నించడం తనను తీవ్రంగా బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రషర్మిల వాడిన భాష సరికాదంటూ సూక్తులు చెప్పారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం, జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం వైఎస్ కుటుంబానికి ద్రోహం చేయడంగా అభివర్ణించారు. అసలు ఆమె కాంగ్రెస్ గూటికి చేరడమే తప్పన్నారు. కాంగ్రెస్ పార్టీ   వైఎస్‌ కుటుంబానికి  ఎంతో ద్రోహం చేసిందని చెప్పారు. 

అదే సమయంలో వైసీపీ విజయం కోసం, అన్న జగన్ ను ముఖ్యమంత్రి చేయడం కోసం ఒక చెల్లెలుగా షర్మిల పడిన శ్రమ, చేసిన త్యాగం గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ అధికార పగ్గాలు చేపట్టిన తరువాత.. తాను ఆ స్థానంలో కూర్చోవడానికి శ్రమపడి, చెమట చిందించి, కాళ్లు అరిగేలా నడిచి, గొంతు చిరిగేలా ప్రచారం చేసిన షర్మిలను రాష్ట్రం నుంచి తరిమేదాకా ఊరుకోని జగన్ ద్రోహం గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.  అంతెందుకు షర్మిల తెలంగాణలో వైఎస్సార్టీపీ పేరిట సొంత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సమయంలో ఆమె రాజకీయాలతో కానీ, ఆమె పార్టీతో కానీ వైసీపీకి కానీ జగన్ కు కానీ ఎటువంటి సంబంధం లేదని మీడియా సమావేశం పెట్టి మరీ వైఎస్ కుటుంబంలో ఆమె ఏకాకి అని తానే స్వయంగా చాటిన విషయం పాపం సజ్జలకు గుర్తు రాలేదు.  

ఇక తెలంగాణలో పార్టీ నడపడానికి అవసరమైన ఆర్థిక వనరులు షర్మిలకు అందకుండా చేసిన విషయమూ గుర్తు రాలేదు. ఇప్పడు సొంత చెల్లి తన రాజకీయ భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని తన నిర్ణయం తాను తీసుకుంటే మాత్రం ఎక్కడలేని బాధా సజ్జలలో తన్నుకొచ్చేసోతోందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.  ఇక షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తరువాత చేసిన తొలి ప్రసంగంలో   జగన్ మణిపూర్ హింసాకండపై మౌనంగా ఉండటాన్నిప్రశ్నిస్తూ, ఆయన క్రైస్తవుడేనా అని ప్రశ్నించడాన్ని జగన్ పార్టీ తట్టుకోలేకపోతోందని అంటున్నారు. 

 ఇక షర్మిల ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అందుకున్నారో లేదో అలా వైసీసీ సోషల్ మీడియా వింగ్ ఆమెను టార్గెట్ చేస్తూ దూషణల పర్వాన్ని ప్రారంభించేసింది. అంత దాకా ఎందుకు ఆమె ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించడానికి ముందే ఆమె కాన్వాయ్ ను అడ్డుకుని, దారి మల్లించి వైసీపీ సర్కార్  నిర్బంధకాండను ప్రారంభించేసింది.  

జగన్ పాలనలో రాష్ట్రం అధోగతికి చేరుకుందని కాంగ్రెస్ ఏపీ అధినేత్రిగా షర్మిల విమర్శలు నేరుగా సూటిగా ఉండటమే కాకుండా.. ఎన్నికల ప్రచారంలో జగన్ చేసిన వాగ్దానాలను ఎత్తి చూపుతో, వాటిని నెరవేర్చడంలో ఎలా విఫలమయ్యారో పూసగుచ్చినట్లు వివరించడం సహజంగానే సజ్జలను బాధపెట్టింది.  షర్మిల జగన్ రెడ్డిని నేరుగా టార్గెట్ చేయడం ద్వారా జగన్ తీరుపై అసంతృప్తితో ఉన్న వైసీపీ నేతలకు పరోక్షంగానైనా ఆహ్వానం పలికారు. ఇది సజ్జలను అమితంగా బాధపెట్టింది. సిట్టింగుల మార్పు పేరున చేస్తున్న ప్రయోగం కారణంగా ఇప్పటికే పలువురు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇకా మరింత మంది తమ దారి తాము చూసుకోవడానికి దిక్కులు వెతుకుతున్నారు. అటువంటి వారందరికీ తన ప్రసంగం ద్వారా షర్మిల కాంగ్రెస్ గేట్లు తెరిచే ఉన్నాయని చాటారు. వారికి మార్గం చూపడానికా అన్నట్లు తాను ఇలా ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేరగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇలా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అలాగే ఒకప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత ఆప్తులుగా ఉన్న కేవీపీ, రఘువీరా వంటి నేతలు షర్మిల పక్కన నిలబడి వైఎస్ రాజకీయ వారసురాలు ఆమె మాత్రమేనని చాటేశారు. దీంతో పార్టీ నుంచి వలసలు వెల్లువెత్తడం ఖాయమన్న భయమే సజ్జలలో బాధకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో వైసీపీ నేతలూ, శ్రేణులే కాదు, అగ్రనాయకత్వం కూడా భయంతో వణికి పోతోందని సజ్జల బాధ లోకానికి చాటింది. 

By
en-us Political News

  
రాబోయే రోజుల్లో ఏ ప్రాంతీయ పార్టీని దగ్గరకు చేర్చుకొనే అవకాశం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి బుధవారంతో 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంగళవారం (జూన్ 9) ఢిల్లీలో ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఈ సోలో ఎజెండా ప్రకటించారు.
మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో బీజేపీ వ్యూహం ఏమిటన్న విషయాన్ని అమిత్ షా తేటతెల్లం చేసేశారు. దేశవ్యాప్తంగా కూటమి రాజకీయాలు నడుస్తున్న తరుణంలో.. కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు జనసేనకు ఒకింత ఇబ్బందికలిగేలా ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ తిరస్కరనకు గురి కావడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. మీనాక్షి నటరాజన్‌పై తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని స్పష్టం చేశారు.
పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి గానీ, ఎవరికీ గానీ ఎలాంటి అన్యాయం జరగదని పునరుద్ఘాటించారు. డీలిమిటేషన్ బిల్లుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న విమర్శలను అమిత్ షా కొట్టిపారేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల్లో సీరియస్‌నెస్ లేదని, వాటిని పట్టించుకోవలసిన అవసరం లేదనీ అన్నారు.
మోదీ ప్రధాని పీఠంపై విజయవంతంగా 12 ఏళ్ల సుదీర్ఘ పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 4,399 రోజుల పాటు ఆయన నిరంతరాయంగా ప్రధాని పదవిలో ఉన్నారు. 1952లో భారతదేశంలో మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత.. జవహర్‌లాల్ నెహ్రూ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై 4,398 రోజుల పాటు నిరవధికంగా ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు.
ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు.
ఈ ఎన్నికలకు సంబంధించి దాఖలైన నాలుగు నామినేషన్ పత్రాలు పూర్తిగా సక్రమంగా ఉన్నాయని రిటర్నింగ్ అధికారి, అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి ఆర్. వణితా రాణి ప్రకటించారు. శాసనసభ భవనంలోని తన చాంబర్‌లో అభ్యర్థుల సమక్షంలో జరిగిన ఈ స్కృటినీ ప్రక్రియలో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని తేలడంతో కూటమి శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో 2027 సంవత్సరం ఒక సరికొత్త సంచలనానికి వేదిక కాబోతోందా? అంటే రాజకీయ పరిశీలకులు ఔననే ఉంటున్నారు. 2024లో ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న జగన్, అలాగే 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పరాజయాన్ని చవిచూసిన కేసీఆర్ ఇద్దరూ 2027 సంవత్సరంలో మళ్లీ ప్రజలతో మమేకమై పూర్వ వైభవాన్ని అందిపుచ్చుకోవాలన్నవ్యూహరచనలో ఉన్నారు.
సాక్షాత్తూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయంగా రంగంలోకి దిగి ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. క్షేత్రస్థాయిలో అధికారులు ఆ ఫైళ్లను పక్కన పెట్టేయడం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహారాష్ట్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన 20 అడుగుల ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఆవిష్కరణ వేడుకలో వివాదం తలెత్తింది. ఈ భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయిన ఏక్‌నాథ్ షిండేకు కనీసం ఆహ్వానంఅందలేదు.
దేశరాజకీయాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి అత్యంత కీలకమైన అడుగులు వేస్తోంది.
రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా తెలుగు దేశం పార్టీ తరుపున సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ లు నామినేషన్ లు దాఖలు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.