జగన్ ది దృతరాష్ట్ర పాలన.. ఏపీలో దుశ్సాసన పర్వం

Publish Date:May 10, 2022

Advertisement

ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం.

ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. కీచకులు, దుశ్సాసనులు వీరవిహారం చేస్తున్నారు. ఏపీలో మహిళలు భద్రతా, రక్షణా కరవై దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అరాచకత్వానికి చిరునామాగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఒక దాని వెంట ఒకటిగా మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్నా ప్రభుత్వం  మాత్రం వాటిని అరికట్టే దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. పైపైచ్చు అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తం చేస్తే రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసే విషయంలో ఏ మాత్రం చొరవ చూపని పోలీసులు.. విపక్షాల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. ఇక దాని వెంట ఒకటిగా మహిళలపై దారుణాలు జరుగుతుంటే... జగన్ మాత్రం దృతరాష్టుడిలా రాష్ట్ర పాలన సాగిస్తున్నారు. 
 
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిత అత్యాచార ఘటన మరువక ముందే, తెనాలి రైల్వే స్టేషన్ లో మరో సామూహిక అత్యాచార ఘటన. దాని వెంట మరొకటి..మరొకటి ఇలా ప్రతి రోజూ రాష్ట్రంలో ఏదో ఒక చోట మహిళలపై మ్లేచ కాముకుల దాడి జరుగుతూనే ఉంది. పలు సంఘటనల్లో మంత్రులు, పోలీసులు నిందితులను వెనకేసుకొస్తూ.. అత్యాచారాల నిరోధానికి బదులు నిందితుల రక్షణకే తమ ప్రాధాన్యత అని రుజువు చేసుకున్నారు.   తెనాలి ఘటనలో సాక్షాత్తూ హోంమంత్రి నేరస్తులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడారు. 
మహిళా హోంమంత్రి అయ్యుండీ.. దొంగతనం కోసం వచ్చిన వాళ్లు అనుకోకుండా తోపులాట జరిగి అత్యాచారం చేశారని చెప్పడం ప్రభుత్వానికి మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. మరో సంఘటనలో హత్యాచారానికి గురైన మహిళది ఆత్మహత్య అని చెప్పడానికి సదరు ఎస్పీ పడిన తాపత్రేయం దిగ్భ్రమ కలిగించక మానదు. మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం నివేదిక రాకున్నా..అత్యాచారం జరగలేదనీ, ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనీ మీడియాకు చెప్పడం.. నిందితులను కాపాడటానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తాయి. 
మొత్తానికి ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఉందా అన్న సందేహం కలిగేలా పరిస్థితులు దిగజారిపోయాయి. ఏపీలో మహిళలు నిర్భయంగా, స్వేచ్ఛగా బతికే పరిస్థితులు లేవు. మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు, అఘాయిత్యాలు, హత్యలు నిత్య కృత్యమైపోయాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ పాలనలో ఏపీలో కీచకపర్వం రాజ్యమేలుతోంది. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేని పరిస్థితులు నెలకొన్నాయి. జగన్ ఆర్భాటంగా చెప్పుకున్న దిశ చట్టం, ఘనంగా ప్రచారం చేసుకున్న దిశ యాప్, ఆడంబరంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు ఉన్నాయంటే ఉన్నాయనుకోవడానికే తప్ప మహిళల రక్షణ విషయంలో అవి చేస్తున్న పని శూన్యం. ప్రభుత్వం ఉందా అని అనుమానం కలిగేలా జగన్ సర్కార్ తీరు ఉంది.  తాజాగా పుట్టపర్తి జిల్లాలో పచ్చి బాలింతపై సామూహిక అత్యాచారానికి పాల్పడి ఆ తరువాత హత్య చేశారు. ఇలా వరుస సంఘటనలతో ఏపీ రేపుల రాష్ట్రంగా దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చకుంది. దేశంలోనే మహిళలకు రక్షణ లేని రాష్ట్రంగా నిలిచింది. 

By
en-us Political News

  
ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ, వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.
రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతిని నిర్మూలిస్తామని ప్రజలకు హామీ ఇచ్చామని, అలాంటిది పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే ఇలాంటి వివాదాల్లో చిక్కుకోవడం క్షమించరాని నేరమన్నారు. యువ నాయకుడు, మంచి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చాడన్న ఉద్దేశంతో అవకాశం ఇస్తే, పార్టీకి చెడ్డపేరు తీసుకువచ్చారంటూ పుట్టా మహేష్ యాదవ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
ఇప్పటికే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. ఓ వైపు డీఎంకే కాంగ్రెస్ కూటమి, మరో వైపు అన్నాడీఎంకే, బీజేపీ కూటములు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదంటే తమదని ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు ఆ రెండు కూటములతో పాటు టీవీకే అధినేత విజయ్ సీఎం సీటుపై కన్నేశారు.ఇప్పటికే విజయ్ తమిళనాడు వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలతో ఎలక్షన్ క్యాంపెయిన్ హోరెత్తిస్తున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న సమయంలో విజయ్‌ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య కోర్టు గడపతొక్కడంతో ఈ విషయం ఇటు తమిళనాడులోనే కాకుండా దక్షిణాది రాజకీయాల్లో సైతతం హాట్ టాపిక్‌గా నిలిచింది.
పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్ హౌస్ లో ఆయన సమక్షంలో జరిగిన డగ్ర్స్ పార్టీ వ్యవహారంలో ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఈ ఘటనపై స్పష్టత కోరుతూ వారం రోజులలో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ అయ్యింది.
ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టులో ప్రస్తుతం తన కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మ బెంచ్ నుండి విచారణను వేరే బెంచ్‌కు బదిలీ చేయాలని ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రస్తుత ధర్మాసనం వద్ద విచారణ జరుగుతుందన్న నమ్మకం లేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ రాజాసింగ్ పై సెటైర్లు వేశారు. రాజాసింగ్, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో ఇలాంటి స్నేహపూర్వక సంభాషణలు సాగడం మంచి వాతావరణానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.