Publish Date:Apr 26, 2022
ఆంధ్రప్రదేశ్ లో అందరి పరిస్థితీ ఆగమాగమే! ఎవరికీ ఉద్యోగ భద్రత లేదు. ఉద్యో్గమున్న వేతనం సమయానికి వస్తుందన్న భరోసా లేదు. పేదలకు రేషన్ ఏ నెలకా నెల అందుతుందన్న ధీమా లేదు. ఈ నెల రేషన్ కోత ఇప్పటికే చెబుతున్నారు. ఇలా జగన్ సర్కార్ తన ఆర్థిక అవకతవకల కారణంగా అన్ని వర్గాలనూ ఇబ్బందుల్లోకి నెట్టేసింది.
వర్సిటీ సిబ్బంది అయితే రెండు నెలలుగా వేతనాలు లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని నడిపేదెలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాలందకుంటే ఎలారా బాబూ అని ఆవేదన చెందుతున్నారు.
వర్సిటీలో యూజీసీ స్కేళ్ల ప్రకారం వేతనాలు అందుకునే వారి పరిస్థితి బానే ఉంది. అయితే మిగిలిన మినిస్టీరియల్ సిబ్బంది పరిస్థితే దయనీయంగా ఉంది. వారికి ఇప్పటికీ మార్చి వేతనాలు అందలేదు. ఏప్రిల్ నెల చివరికి వచ్చేసింది. ఇంకా మొదటి ఏప్రిల్ మొదటి తారీకుల అందాల్సిన జీతాలకు అతీగతీ లేదు. ఎందుకు ఆలస్యం అయ్యింది, ఎప్పుడిస్తారు అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పే నాథుడే లేడు.
వీరి జీతాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా బడ్జెట్ కేటాయిస్తుంది. కానీ ఆర్థిక పరిస్థితి కారణంగా చెప్పి గత నెల వేతనాలకు ఇంత వరకూ ఆమోద ముద్ర వేయలేదు. వేతనాలు ఇవ్వకపోవడానికి అదే కారణమని చెబుతున్నారు.
ఈ ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల విషయంలో పెద్ద పట్టింపు చూపుతున్నట్లుగా తోచదు. ఇప్పటికే హార్టికల్చర్, వెటర్నరీ వర్సిటీలకు గత ఏడాదితో పోలిస్తే బడ్జెట్ ను తగ్గించింది. ఉద్యాన వర్సిటీకి రూ.10 కోట్లు, వెటర్నర వర్సిటీకీ రూ.15 కోటు చొప్పున తగ్గించింది. ఇక ప్రభుత్వం ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామంటూ ఘనంగా ప్రకటించిన మత్స్య వర్సిటీకి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా బడ్జెట్ లో కేటాయించలేదు. అంటే ఆ వర్సిటీ తరగతుల ప్రారంభం ఈ ఏడాది హుళక్కే అని అర్ధమౌతున్నది. కేటాయింపుల్లో కోతలు, వేతనాలకు ఆమోదముద్ర వేయకుండా వర్సిటీల సిబ్బందిని ఇబ్బందుల పాలు చేస్తున్నది. వెంటనే వేతనాలు విడుదల చేయకుంటే ఆందోళన బాటపడతామని సిబ్బంది హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంలో కదలిక వచ్చే అవకాశం ఉందని వర్సిటీ అధికారులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-salaries-to-varsity-staff-from-two-months-39-134969.html
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్కతాలోని కాళీఘాట్లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.
అనంతపురం జిల్లాకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది.
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు
కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.