హోంమంత్రి బాధ్యతా రాహిత్యం.. శాంతి భద్రతలు ఎక్కడ తానేటి వనితా మేడం

Publish Date:May 3, 2022

Advertisement

పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత వైఖరి. రాష్ట్రంలో ఏం
జరిగినా అది విపక్ష తెలుగుదేశం పనే అంటున్నారామె. రాష్ట్రంలో రోజూ మూడు మర్డర్లు, ఆరు రేపులు అన్నట్లుగా నేర సామ్రాజ్యం వర్ధిల్లుతుంటే.. నేరలను అరికట్టి నేరగాళ్ల పీచమణచాల్సిన పదవిలో ఉన్న తానేటి వనిత  విపక్షాలపై నెపం మోపి బాధ్యత నుంచి తప్పుకోవాలని చూడటం దారుణం.  ప్రభుత్వంలో ఉన్న వారు విమర్శలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి.    అత్యాచార ఘటనలపై సహజంగానే విపక్షాలు విమర్శలు సంధిస్తాయి. నేరాలు వరుసగా అదుపులేకుండా జరుగుతున్నాయంటే అది కచ్చితంగా శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వ వైఫల్యమే. శాంతి భద్రతల పరిరక్షణకు మరింత కఠినంగా వ్యవహరిస్తామని చెప్పాల్సిన హోంమంత్రి విపక్ష టిడిపి వాళ్ల వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించడం బాధ్యతా రాహిత్యం తప్ప మరొటి కాదు.  రేపల్లె సామూహిత అత్యాచారం సంఘటనకు మద్యం మత్తే కారణమంటూ తేలిగ్గా తీసుకోవడం హోంమంత్రికి అందునా ఒక మహిళకు ఎంత మాత్రం తగదు. ఇటువంటి సంఘటనలు ఏపీలో నిత్యకృత్యంగా మారిపోవడం అన్నది రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యంగానే చెప్పాలి.

చట్టాలు చేశామని చెప్పుకుంటే సరిపోదు. అవి సక్రమంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలి.  ఎపిలో చోటు చేసుకుంటున్న సామూహిక అత్యాచార ఘటనలను మహిళలు బయటకు రావాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఉంది.  ఆంధప్రదేశ్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న అత్యాచార ఘటనల నిరోధానికి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా మంత్రుల స్థాయిలో ఉన్న వారు కూడా నేరస్తులకు వత్తాసు పలుకుతున్నట్లుగా మాట్లాడటం వారిని ప్రోత్సహించడం తప్ప మరొకటి కాదు.  మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభించడం కూడా ప్రభుత్వ వైఫల్యమే.  ఇలాంటి ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు వేయాలి. అలా కాకుండా సర్కార్ ఉదాశీనంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో నేరాలు పెట్రేగిపోతున్నాయన్నది పరిశీలకుల అభిప్రాయం. కొన్ని సంఘటనల్లో అధికార పార్టీ వారి జోక్యం వల్ల పోలీసులు నిందితులను తప్పించడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా రాష్ట్రంలో నేర సామ్రాజ్యం ఇష్టారాజ్యంగా విస్తరించడానికి కారణమౌతున్నది.

ఈ వాస్తవాలన్నిటినీ పట్టించుకోకుండా అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ విపక్షమే కారణమంటూ హోంమంత్రి నిర్ధారణకు వచ్చేయడం బాధ్యతా రాహిత్యం కాక మరొకటి కాదు.    ఖజానా నింపడానికి మద్యం అమ్మకాల్ని బహిరంగంగా ప్రోత్సహిస్తున్న రాష్టాలు, ఆ మత్తులో జరిగే నేరాలకు బాధ్యత వహించి తీరాలి. ఆ నేరాల్ని పరోక్షంగా ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని మద్రాసు హైకోర్టు 2019 మార్చిలో తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో నిందితులు చేసే నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత ఎంత అంటూ ఓ వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ తీర్పు ఇవ్వడం గమనార్హం. అంటే మద్యం విక్రయాలతో ఖజానా నింపుకోవడమే కాదు.. ఆ కారణంగా అకృత్యాలు జరక్కుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు పరోక్షంగా హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా చోటు చేసుకుం టున్న అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. మొన్నటికి మొన్న దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో ఒంటరిగా ఉన్న వివాహిత ఇంట్లోకి మద్యం తాగి చొరబడి ఆమెను దారుణంగా హింసించి చంపిన ఘటన మరవక ముందే.. తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు. అఘాయిత్యానికి ఒడిగట్టారు.

ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఓ యువకుడు  కన్నతల్లిపైనే అత్యాచారానికి యత్నించాడు. అడ్డుకున్న తండ్రిపై దాడికి దిగాడు. అడ్డుకోబోయిన తల్లిని బండరాయితో వెూది చంపేశాడు. అనంతపురం జిల్లాలో 33 ఏళ్ల యువకుడు   కన్నతల్లిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఎంత వారించినా వినకపోవటంతో తల్లిదండ్రులు అతడిని చంపి పోలీసు స్టేషన్‌లో లొంగిపోయారు.లారీ డ్రైవర్‌ మద్యం మత్తులో కన్న కుమార్తెపైనే అత్యాచారయత్నం చేసిన ఘటన కొన్నాళ్ల కిందట ఏలూరు జిల్లా నూజివీడులో చోటుచేసుకుంది. ఇక అంతకుముందు స్నేహితుడితో కలిసి బీచ్‌కు వెళ్లిన ఓ యువతిపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

మచిలీపట్నం తాలూకా కరగ్రహారం శివారు పల్లిపాలెం బీచ్‌లో నెల కిందట ఈ ఘటన చోటుచేసుకుంది.  సీఎం జగన్‌ నివాసానికి అత్యంత సవిూపంలో ఉన్న సీతానగరం పుష్కర్‌ ఘాట్‌కు.. కాబోయే భర్తతో కలిసి విహారానికి వెళ్లిన యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. రాష్ట్రంలో వరుసగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా.. ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ‘దిశ’ ఏమైందో, ఎక్కడుందో తెలియడం లేదు. నేరాల నియంత్రణ విషయంలో శాంతి భద్రతలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థ దిశ, దశ లేక నిర్వీర్యమై నిస్తేజంగా మిగిలిపోయింది. పోలీసుల విధి నిర్వహణలో ప్రభుత్వ మితిమీరిన జోక్యమే ఈ పరిస్థితికి కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో రాష్ట్రంలో పులివెందుల రాజ్ నడుస్తోందన్న విపక్షాల విమర్శలు వరుసగా జరుగుతున్న అకృత్యాలు  వాస్తవమే అనిపించేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. 

By
en-us Political News

  
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించిన అధికారులను అభినందించిన ఆయన ఈ ఎన్నికలలో పార్టీ విజయం కోసం కష్టపడిన కార్యకర్తలకు, అలాగే పార్టీని ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ణతలు తెలిపారు.
ఈ పథకంలో ఉన్న లోపాలన సవరించి రాష్ట్రాల బాధ్యతను మరింత పెంచి పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా చెబుతోంది. అయితే కాంగ్రెస్ మాత్రం మోడీ సర్కార్ ఉద్దేశాలను తప్పుపడుతోంది.
బీజేపీ ఉనికి రాష్ట్రంలో నామమాత్రంగానే మిగిలిందని ఈ ఎన్నికల ఫలితాలు తేల్చాయి. అవన్నీ పక్కన పెడితే ఈ పంచాయతీ ఎన్నికల మూడో విడతలో ఓ ఆసక్తికర విషయంపై తెలుగు రాష్ట్రాలలో చర్చ మొదలైంది.
ల్లమల సాగర్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణా జలవనరులశాఖ అధికారులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో చంద్రబాబు హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉపాధి హామీ పథకం పేరు మార్పు అన్నది గ్రామీణ పేదల జీవనాధారంపై జరుగుతున్న దాడిగా ఎంపీలు అభివర్ణించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గత కొన్నేళ్లుగా ఉపాధి హామీ పథకానికి నిధులను నిలిపివేస్తూ, పనులను నిరాకరిస్తూ, గ్రామీణ ప్రజలు ఆకలితో అలమటించేలా చేస్తోందని ఆరోపించారు.
తెలంగాణలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపు నిచ్చారు. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లా కేంద్రాల్లో బీజేపీ ఆఫీసుల వద్ద డీసీసీల నేతృత్వంలో కాంగ్రెస్ ధర్నాలకు దిగింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో గాంధీ భవన్, బీజేపీ కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రత ఏర్పాట్లు చేశారు.
జగనన్న వదిలిన బాణాన్ని అంటూ తన అన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి, 2019 ఎన్నికలలో జగన్ విజయానికి తన వంతు దోహదం చేసిన చెల్లిని అధికారం చేపట్టిన తరువాత జగన్ దూరం పెట్టారు. ఆస్తుల పంచాయతీతో పాటుగా రాజకీయంగా తనకు పోటీ అవుతుందన్న భయంతోనే జగన్ షర్మిలను దూరంపెట్టారన్న ప్రచారం అప్పట్లో జోరుగా సాగింది.
మూడో దశలో బుధవారం (డిసెంబర్ 17) మొత్తం 4,159 స్థానాలకుఎన్నికలు జరిగితే ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారలు 2,286 స్థానాలు గెలుచుకున్నారు. బీఆర్ఎస్ 1,142, బీజేపీ 242, ఇతరుఅు 479 సానాల్లో విజయం సాధించారు.
తెలంగాణ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మద్దతుదారులు ప్రభంజనం సృష్టిస్తోంది.
అసెంబ్లీ సాక్షిగా నేడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీలో నాయకులు, శ్రేణులూ పూర్తిగా డీలా పడ్డాయి. దానికి తోడు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వలస వెళ్లిపోయి, ఎలాగో తీరిక చేసుకుని వారానికి ఒక సారి మాత్రం ఆంధ్రప్రదేశ్ వచ్చి.. వెడుతున్నారు. దీంతో ఆయన పూర్తిగా పార్ట్ టైమ్ పొలిటీషియన్ గా మారిపోయినట్లైందని పార్టీ శ్రేణులే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన పది మంది ఎమ్మెల్యేలు ఆ తరువాత కాంగ్రెస్ గూటికి చేరారంటూ బీఆర్ఎస్ అరోపించిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలు విన్నారు.
స‌చివాల‌యంలో కేటీఆర్ కి ఇంత నెట్ వ‌ర్క్ ఉందా? అని విస్తుపోయింది. విచారణకు ఆదేశించి.. లీకు వీరులు ఎవరైనా, ఎంతటి వారైనా చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలూ జారీ చేసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.