శాంతి భద్రతలు, మహిళలకు రక్షణ.. ఏపీ బీహార్ ను మించిపోయిందిగా!

Publish Date:May 1, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ నేరాల హబ్ గా మారిందా?.. పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైపోయిందా? ఒకప్పుడు బీహార్ లో ఉండే పరిస్థితులను మించి ఇప్పుడు ఏపీలో అరాచకం రాజ్యమేలుతోందా? అంటే వరుసగా జరుగుతున్న సంఘటనలను బట్టి అవుననే సమాధానం వస్తుందని పరిశీలకులు అంటున్నారు.  మహిళలపై అత్యాచారాలు, హత్యలు, దాడులు ఏపీలో రోజువారీగా జరిగే సాధారణ సంఘటనల్లా మారిపోయాయి. నేరస్తులు యధేచ్ఛగా తిరుగుతున్నారు. దారుణాలన్నిటికీ వీడియో సాక్ష్యాలు బయటపడుతున్నా పోలీసులు చర్యలు తీసుకునే విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఒక్కో సారి అయితే.. ఎలాంటి దర్యాప్తూ జరపకుండానే నిందితులను వెనకేసుకొచ్చేలా ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. దీంతో పోలీసులు నిందితులను వెనకేసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారన్న భావన ప్రజలలో కలుగుతోంది. 

రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోరా? అంటూ జనాగ్రహం వెల్లువెత్తుతున్నా పోలీసులలో కదలిక ఉండటం లేదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా రోజూ ఏదో ఒక అత్యాచారం, హత్య, దాడుల కేసులు వెలుగు చూస్తూనే ఉన్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే ఏపీలో నేరస్తులకు తామేం చేసిన ఏమీ కాదు, శిక్షలు ఉండవు అన్న భరోసా ఏర్పడినట్లుగా భావించాల్సి వస్తున్నదని పరిశీలకులు అంటున్నారు. అరాచకం పరాకాష్టకు చేరితేనే పరిస్థితి ఇలా తయారౌతుందని వారు విశ్లేషిస్తున్నారు. గతంలో బీహార్ లో ఇటువంటి పరిస్థితి ఉండేదనీ, ఇప్పుడు రాష్ట్రంలో శాంతిభద్రతలు బీహార్ ను తలదన్నేలా క్షీణించాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఒకదాని తరువాత ఒకటిగా మహిళలపై అత్యాచారాలు, హత్యాచారాలు, దాడులు, హత్యల సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా విజయనగరంలో ఓ యువతిని హత్య చేసి పెట్రోల్ పోలి కాల్చేశారు. రేపల్లె రైల్వే స్టేసన్ లో వలస కూలీపై సామూహిక అత్యాచారం..ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు నాలుగైదు సంఘటనలు రాష్ట్రంలో వెలుగులోనికి వస్తున్నాయి. ఏ సంఘటనలోనూ నిందితులను అరెస్టు చేసిన దాఖలాలు కానీ, దిశ చట్టం కింద కేసులు నమోదు చేసిన దాఖలాలు కానీ లేవు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిని 21 రోజులలో విచారించి శిక్షిస్తామంటూ సీఎం జగన్ ఘనంగా చేసిన ప్రకటన గాలి మూటగానే మిగిలిపోయింది.
 అసలు మహిళలపై అత్యా చారాల సంఘటనల్లో నిందితులను పట్టుకోవడం, కేసులు నమోదు చేయడం సంగతి అటుంచి పోలీసులు వారికి వత్తాసుగా నిలబడుతున్నారా అన్నట్లుగా పరిస్థితి ఉందనీ, అందుకే నేరస్తుల్లో తమకు ఏం కాదు, కేసులు, శిక్షలు ఉండవన్న బరోసా పెరిగిపోయిందనీ పరిశీలకులు చెబుతున్నారు. వివాహితపై హత్యాచారం ఘటనలో పోస్టుమార్టం జరగకముందే అత్యాచారం జరగలేదంటూ ఎస్పీ ప్రకటన, అక్రమ సంబంధం కారణంగానే హత్య జరిగిందంటూ అదేం పెద్ద నేరం కాదన్నట్లుగా ఇచ్చిన వివరణను ఇందుకు వారు ఉదాహరణగా చూపుతున్నారు.  వ్యవస్థ నిలబడుతుంది. గుంటూరు జిల్లాలో గత కొన్ని రోజులుగా రోజుకో రేప్ జరుగుతున్నా పోలీసులలో కదలిక కనిపించడం లేదు. బాధితుల పక్షాన తెలుగుదేశం, ఇతర విపక్షాలు ఆందోళనలు చేపడుతున్నా.. పోలీసులు పట్టించుకోవడం లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. భద్రత లేని రాష్ట్రంలో ఉండలేక మహిళలందరూ వేరే రాష్ట్రాలకు తరలివెళ్లే పరిస్థితులు వస్తాయని విపక్ష నాయకుడు నారా లోకేష్ అన్నారు.  ఏది ఏమైనా పోలీసులు స్వతంత్రంగా వ్యవహరిస్తూ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలకు ఉపక్రమించకుంటే.. ప్రజలే తిరగబడి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని శిక్షలు విధించే పరిస్థితి వస్తుందని పరిశీలకులు అంటున్నారు.

By
en-us Political News

  
తాజా ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు జగన్ మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, పార్టీ ఇమేజ్‌కు నష్టం కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వందేమాతరం అంశం చర్చనీయాంశంగా మారింది.
2024 ఎన్నికల సమయానికి ఆయన ప్రాతినిథ్యం వహిస్తున్న జనసేన పార్టీ తెలుగుదేశం, బీజేపీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికల రంగంలోకి దిగింది. ఆ ఎన్నికలలో నాగబాబు అనకాపల్లి లోక్ సభ స్థానం నుంచి రంగంలోకి దిగుతారని పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా నాగబాబుకు ఆ ఎన్నికలలో పోటీ చేసే అవకాశమే దక్కలేదు.
తమిళనాడులో బీజేపీ, హీరో విజయ్ సారథ్యంలోని టీవీకేల పొత్తు విషయంలో మరోసారి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
దేశంలోని నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్రపాలిత ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది
ఈసీ తీరుపై నమ్మకం లేదని చెబుతున్న పార్టీ, ఇప్పుడు సీఈసీపై అభిసంశన తీర్మానానికి మద్దతుగా నిలబడకుంటే.. ఆ పార్టీ నైతికతే ప్రశ్నార్థకంగా మారుతుంది. ఒక వేళ వైసీపీ ఈ తీర్మానాన్ని వ్యతిరేకిస్తే ఇక ముందు, ఎన్నికల అక్రమాలపై మాట్లాడేందుకు వైసీపీకి అర్హతే ఉండదు. ఇంత వరకూ తెలుగుదేశం కూటమి విజయంపై వారు చేసిన విమర్శలన్నీ దూదిపింజెల్లా ఎగిరిపోతాయి.
బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫామ్‌హౌస్ వేదికగా జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతం అప్పట్లో పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అప్పట్లో రోహిత్ రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు అక్కడ సోదాలు నిర్వహించి, ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అప్పట్లో ఈ కేసు జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది.
దేవ్ జీ అరెస్ట్ ఎలా జరిగింది? అరెస్టు తరువాత ఆయన లొంగుబాటు ప్రకటన చేసి జనజీవన స్రవంతిలో కలుస్తున్నట్లు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? లొంగిపోలేదు అంటూనే.. ప్రస్తుత పరిస్థితుల్లో అజ్ణాతంగా ఉండి ఉద్యమాన్ని కొనసాగించడం కష్టసాధ్యమని ఎందుకు చెబుతున్నారు?
త్రిష త్వరలోనే సినిమాలకు గుడ్‌బై చెప్పి రాజకీయాల్లోకి రావడం కన్ఫర్మ్ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. అయితే ఇందుకు సంబంధించి త్రిష నుంచి ఎటువంటి క్లారిటీ అయితే ఇప్పటి వరకూ రాలేదు. ప్రస్తుతం త్రిష పలు సినిమాలలో నటిస్తున్నారు. వాటిలో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమా కూడా ఉంది.
మంత్రిగా పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా పవన్ కల్యాణ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనీ, షూటింగ్ లంటూ అధిక సమయం హైదరాబాద్ లోనే ఉంటున్నారని రోజా అన్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సినిమాలలో యాక్టింగ్ కి పరిమితమైనట్లుగా పవన్ కల్యాణ్ తీరు ఉందని రోజా అన్నారు. కీలకమైన మంత్రివర్గ సమావేశానికి డుమ్మా కొట్టడం సరికాదన్న రోజా దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విధానసౌధలో కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే.. పాతిక మంది ఎమ్మెల్యేలు ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ భేటీ జరగడం సంచలనం సృష్టించింది.
తెలుగువన్ వాస్తవ వేదిక 16వ సంచికలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ఈసారి దూరం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.