Publish Date:Jul 14, 2022
ఏపీలో వాలంటీర్ల వ్యవస్థ బండారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం బట్టబయలు చేసేసింది. వారు ప్రభుత్వ ఉద్యోగులు కారు.. వైసీపీ కార్యకర్తలేనని చెప్పకనే చెప్పేసింది. అదెలాగంటే.. ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు ఎటువంటి ఎన్నికల విధులూ అప్పగించడానికి వీల్లేదని కేంద్ర ఎన్నికల సంఘం విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
వచ్చే నెల ఒకటో తేదీ నుంచీ ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధాన ప్రక్రయ ప్రారంభం కానున్న సమయంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ ప్రక్రియలో వాలంటీర్లకు ఎలాంటి జోక్యం ఉండరాదన్న ఉద్దేశంతోనే ఈసీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల జోక్యం విపరీతంగా ఉంటోందనీ, ఓటర్ల జాబితాలో వారు చేతి వాటం చూపుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈసీ ఈ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం.
వాలంటీర్ వ్యవస్థను జగన్ ఏర్పాటు చేసిందే ఎన్నికలలో లబ్ధికోసమన్న విమర్శలు చాలా కాలం నుంచీ వస్తున్న సంగతి విదితమే. అందుకు తగ్గట్టుగానే లబ్ధిదారులకు పథకాల లబ్ధి అందే విషయం దగ్గర నుంచీ.. ప్రతి పనీ వారి కనుసన్నలలోనే జరిగేలా జగన్ స్కెచ్ వేశారనీ, అందుకే నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలను డమ్మీలుగా మార్చేశారనీ అంటున్నారు. చివరకు ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లనే ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉందని చెబుతున్నారు.
‘గడపగడపకూ’ కార్యక్రమంలో కూడా లబ్ధిదారుల వివరాల జాబితాను ఎమ్మెల్యేలు వలంటీర్ల వద్దనుంచే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడిందని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తెలుగుదేశం పట్ల మొగ్గు చూపుతున్నారనుకున్న వారికి పథకాలు అందకుండా చేయడం దగ్గర నుంచీ వారి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం వరకూ నానా రకాల అరాచకాలకూ జగన్ సర్కార్ వాలంటీర్లను వాడుకుంటోందన్న విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో జరిగిన గతంలో ఉపఎన్నికల సమయంలోనూ వాలంటీర్ల జోక్యం పెచ్చరిల్లిందన్న విమర్శలూ ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-election-duties-to-volunteers-ec-orderd-jagan-sarkar-25-139763.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.