Publish Date:Mar 20, 2024
రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఏపీలో మాత్రం ఆ సామెతను సీఎం జగన్ తలచుకుంటే తప్పులకు కొదవా అని మార్చుకోవాలి. జగన్ పై ప్రేమతో అధికారులు తప్పులు చేయడానికి వెరవని విచత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఔను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది అంటే ఉంది. అంతే అది అమలు కాదు. ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతాయి. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు. కోడ్ అమలుకు ఉపక్రమించరు. అది అంతే. ఎందుకలా అంటే అంతా జగన్మాయ అంటారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా చాటారు. కోడ్ ఉల్లంఘన 60 అడుగుల కటౌట్ రూపంలో దర్శన మిస్తోందంటూ సెల్ఫీ దిగి మరీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.
ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రీ వెళ్లే ప్రధాన రహదారిపై ఎపీ సీఎం జగన్ 60అడుగుల కటౌట్ దర్జాగా దర్శనమిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజుల తరువాత కూడా అత్యంత ప్రధానమైన రహదారిలో అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షించేలా ఏర్పాటు చేసిన కటౌట్ తొలగించలేదంటే ఏపీలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలౌతోందన్నది అర్ధమౌతుంది. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు.
అధికారులు పని చేయడం లేదా అంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అదే జొన్నాడ వద్ద వచ్చీ పోయే వాహనాలన్నిటినీ ఎండను కూడా లెక్క చేయకుండా క్షుణ్ణంగా తనఖీలు చేసి పంపిస్తున్నారు. చిన్న చిన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు గోడల మీద రాతలను తొలగించేస్తున్నారు. తుడిచేస్తున్నారు. అయితే ఘనత వహించిన అధికారులకు అంత ఘనంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి కటౌట్ మాత్రం ఆనలేదు. ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికార మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక సీఎం సహా రాజకీయ నాయకుల ఫొటోలేవీ కనపడకూడదనీ, అలాగే వాలంటీర్లు ఎవరూ విధుల్లో పాల్గొనకూడదనీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా ఇచ్చేసి ఊరుకోలేదు. ఎక్కడైన నేతల ఫొటోలు కనిపించినా, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నా వెంటనే ఫొటోలు తీసి పంపించమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా, అందుకు సంబంధించిన ఆధారాలు సమాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దారి ఎన్నికల కోడ్ దే ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేగా ఉందనడానికి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి, రాష్ట ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ సీఎం 60 అడుగుల కటౌట్ ముందు ముందు నిలబడి దిగిన సెల్ఫీయే నిదర్శనం. అయినా మన పిచ్చి కానీ రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా షిక్కటి షిరునవ్వుతో ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎక్కడో రోడ్డుపై ఉన్న 60 అడుగుల కటౌట్ ను ఎందుకు పట్టించుకుంటారు. ఎన్నికల కోడ్ కు ఏపీ సీఎం జగన్ అతీతులని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారా అన్న అనుమాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్లు తెరిచి ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-election-code-in-ap-25-172423.html
జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది.
ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును కొద్ది రోజుల కిందట గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో తనను చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.