కోడ్ దారి కోడ్ దే.. ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదే.. ఏపీలో జగన్మాయ!

Publish Date:Mar 20, 2024

Advertisement

రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా అన్నది సామెత. ఏపీలో మాత్రం ఆ సామెతను సీఎం జగన్ తలచుకుంటే తప్పులకు కొదవా అని మార్చుకోవాలి. జగన్ పై ప్రేమతో అధికారులు తప్పులు చేయడానికి వెరవని విచత్ర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఔను ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ ఉంది అంటే ఉంది. అంతే అది అమలు కాదు. ఉల్లంఘనలు యథేచ్ఛగా జరిగిపోతాయి. ఫిర్యాదులను అధికారులు పట్టించుకోరు. కోడ్ అమలుకు ఉపక్రమించరు. అది అంతే. ఎందుకలా అంటే అంతా జగన్మాయ అంటారు.  ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం మాజా కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ విషయాన్ని సాక్ష్యాలతో సహా చాటారు. కోడ్ ఉల్లంఘన 60 అడుగుల కటౌట్ రూపంలో  దర్శన మిస్తోందంటూ సెల్ఫీ దిగి మరీ సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. 

ఇంతకీ విషయమేమిటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జొన్నాడ వంతెన వద్ద రాజమండ్రీ వెళ్లే ప్రధాన రహదారిపై ఎపీ సీఎం జగన్ 60అడుగుల కటౌట్ దర్జాగా దర్శనమిస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజుల తరువాత కూడా అత్యంత ప్రధానమైన రహదారిలో అందరి దృష్టినీ ప్రముఖంగా ఆకర్షించేలా ఏర్పాటు చేసిన కటౌట్ తొలగించలేదంటే ఏపీలో ఎన్నికల కోడ్ ఎంత దివ్యంగా అమలౌతోందన్నది అర్ధమౌతుంది. ఇదే విషయాన్ని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు.

అధికారులు పని చేయడం లేదా అంటే బ్రహ్మాండంగా పని చేస్తున్నారు. అదే జొన్నాడ వద్ద వచ్చీ పోయే వాహనాలన్నిటినీ ఎండను కూడా లెక్క చేయకుండా క్షుణ్ణంగా తనఖీలు చేసి పంపిస్తున్నారు. చిన్న చిన్న పోస్టర్లు, ఫ్లెక్సీలు, బ్యానర్లు గోడల మీద రాతలను తొలగించేస్తున్నారు. తుడిచేస్తున్నారు. అయితే ఘనత వహించిన అధికారులకు అంత ఘనంగా అందరికీ కనిపించేలా ఏర్పాటు చేసిన సీఎం జగన్ గారి కటౌట్ మాత్రం ఆనలేదు.  ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల అధికార మీనా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది కనుక సీఎం సహా రాజకీయ నాయకుల ఫొటోలేవీ కనపడకూడదనీ, అలాగే వాలంటీర్లు ఎవరూ విధుల్లో పాల్గొనకూడదనీ స్పష్టమైన ఆదేశాలిచ్చారు. అలా ఇచ్చేసి ఊరుకోలేదు.  ఎక్కడైన నేతల ఫొటోలు కనిపించినా, వలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నా వెంటనే ఫొటోలు తీసి పంపించమని చెప్పారు. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే యథేచ్ఛగా ఉల్లంఘనలు జరుగుతున్నా, అందుకు సంబంధించిన ఆధారాలు సమాజిక మాధ్యమంలో హల్ చల్ చేస్తున్నా.. అధికారుల్లో మాత్రం చలనం కనిపించడం లేదు.  రాష్ట్రంలో ఎన్నికల కోడ్ దారి ఎన్నికల కోడ్ దే ఉల్లంఘనల దారి ఉల్లంఘనలదేగా ఉందనడానికి సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ కార్యదర్శి, రాష్ట ఎన్నికల సంఘం మాజీ కమిషనర్   నిమ్మగడ్డ రమేష్  సీఎం 60 అడుగుల కటౌట్ ముందు ముందు నిలబడి దిగిన సెల్ఫీయే నిదర్శనం. అయినా మన పిచ్చి కానీ  రాష్ట్రంలో పౌరపంపిణీ వాహనాలపైనా , ఈసేవా కేంద్రాల్లో జారీ చేస్తున్న ప్రభుత్వ ధ్రువీకరణ పత్రాలపైనా షిక్కటి షిరునవ్వుతో ఇప్పటికీ ముఖ్యమంత్రి ఫోటోలు కనిపిస్తున్నా పట్టించుకోని అధికారులు ఎక్కడో రోడ్డుపై ఉన్న 60 అడుగుల కటౌట్ ను ఎందుకు పట్టించుకుంటారు. ఎన్నికల కోడ్ కు ఏపీ సీఎం జగన్ అతీతులని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారా అన్న అనుమాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.   ఇప్పటికైనా ఎన్నికల సంఘం కళ్లు తెరిచి ఏపీలో కోడ్ ఉల్లంఘనలపై కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు. 

By
en-us Political News

  
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పంథాను మార్చుకోలేదనేది స్పష్టమవుతోంది. ఐదేళ్ల పాలనలో మూడు రాజధానుల మంత్రం జపించిన జగన్.. ఇప్పుడు మచిలీపట్నం-విజయవాడ-గుంటూరును కలిపి ఒక మెగా సిటీగా మార్చాలనే సరికొత్త ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
మూడు రాజధానుల అంశం గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణాలలో ఒకటి అన్న విషయాన్ని విస్మరించి.. మళ్ళీ అదే తరహా ప్రత్యామ్నాయ వాదనలు వినిపించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది. పార్టీ కేడర్ సైతం మావిగన్ ఏంటి అదేదో పంటకు పట్టే తెగుల్లా ఉందని నెత్తీ నోరూ బాదుకుంటోంది.
ఆ రోజు సభలో ఓ మంత్రి తనపై చెయ్యి చేసుకున్నారని పేర్కొన్నారు. మరో మంత్రి ఏకవచనంతో తిట్టిపోశారు, కులం పేరుతో దూషిస్తూ తన పుట్టుకను నిందించారన్నారు. శాసనమండలిలో తన సిబ్బందినీ దగ్గరికి రాకుండా వైసీపీ సభ్యులు అడ్డుపడ్డారని, తన చుట్టూ చేరి బెదిరింపులు, ప్రలోభాలతో రకరకాలుగా ఇబ్బంది పెట్టారన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలకు 5 కోట్ల మంది ప్రజల తరఫున కృతజ్ణతలు తెలిపారు. దేశం మొత్తానిది ఒక దారైతే... తమదో దారి అన్నట్లు వైసీపీ వ్యవహరించిందని దుయ్యబట్టారు. రాష్ట్రం, దేశం నాశనమైనా పర్వాలేదు.. మాకు స్వార్థ రాజకీయమే ముఖ్యమన్నట్లుగా వైసీపీ వ్యవహరించిందని విమర్శించారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.