Publish Date:Jan 21, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన సోదరుడు వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా అందరిలోనూ మెదులుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారో లేదో అలా అటువంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేశారు షర్మిల. ఇక ఆమె వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నే తలెత్తని విధంగా అన్నపై డైరెక్ట్ అటాకేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా తన తొలి ప్రసంగంతోనే తేల్చి చెప్పాశారు. ఆదివారం (జనవరి 21)న ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన షర్మిల జగన్ పై డైరెక్ట్ అటాక్ కు సిద్ధ పడ్డారని, అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారని ఆమె తొలి ప్రసంగంతోనే చాటారు. తనంటే భయపడేవారే ఎక్కువగా తనపై విమర్శలు చేస్తారనీ, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పడం ద్వారా షర్మిల జగన్ సర్కార్ తన ఎంట్రీతో భయపడుతోందని స్పష్టం చేశారు.
వైసిపి హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని విమర్శించారు. జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో మూడు మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, జనం మీద మోయలేనంతగా పన్నుల భారం మోపారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, పోలవరం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. దళితులపై దాడులు పెచ్చరిల్లాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాల దోపిడీ స్వైరవిహారం చేస్తోంది. ఇక ప్రశ్నించే వారిపై వేధింపులు, గొంతెత్తితే కేసులు అంటూ షర్మిల వైసీపీ సర్కార్, ఏపీ సీఎం జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆ విషయం ఎత్తలేదని గుర్తు చేశారు. స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, మూడు రాజధానులన్న జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. .జగన్ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్ హింసాకాండ మీద మాట్లాడలేదని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-doubt-sharmila-target-jagan-39-169125.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.