Publish Date:Jan 21, 2024
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన తన సోదరుడు వైఎస్ జగన్ పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్న నిన్న మొన్నటి దాకా అందరిలోనూ మెదులుతూ ఉన్న ప్రశ్న. అయితే ఇలా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టారో లేదో అలా అటువంటి అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసేశారు షర్మిల. ఇక ఆమె వైఖరి ఎలా ఉంటుందనే ప్రశ్నే తలెత్తని విధంగా అన్నపై డైరెక్ట్ అటాకేనని ఏపీ కాంగ్రెస్ చీఫ్ గా తన తొలి ప్రసంగంతోనే తేల్చి చెప్పాశారు. ఆదివారం (జనవరి 21)న ఏపీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన షర్మిల జగన్ పై డైరెక్ట్ అటాక్ కు సిద్ధ పడ్డారని, అన్నకు వ్యతిరేకంగా రాజకీయ పోరాటానికి శంఖారావం పూరించారని ఆమె తొలి ప్రసంగంతోనే చాటారు. తనంటే భయపడేవారే ఎక్కువగా తనపై విమర్శలు చేస్తారనీ, తనను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పడం ద్వారా షర్మిల జగన్ సర్కార్ తన ఎంట్రీతో భయపడుతోందని స్పష్టం చేశారు.
వైసిపి హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పలా మారిందని విమర్శించారు. జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో మూడు మూడు లక్షల కోట్లు అప్పులు చేశారని, జనం మీద మోయలేనంతగా పన్నుల భారం మోపారని విమర్శించారు. ఐదేళ్లలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి ఒక్కటంటే ఒక్కసారి కేంద్రాన్ని నిలదీసిన పాపాన పోలేదన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు రాలేదు, పోలవరం నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. రోడ్లు వేయడానికి డబ్బులు లేవని, ఉద్యోగులకు జీతాలు సమయానికి ఇవ్వడం లేదు. దళితులపై దాడులు పెచ్చరిల్లాయి. ఇసుక, లిక్కర్, మైనింగ్ మాఫియాల దోపిడీ స్వైరవిహారం చేస్తోంది. ఇక ప్రశ్నించే వారిపై వేధింపులు, గొంతెత్తితే కేసులు అంటూ షర్మిల వైసీపీ సర్కార్, ఏపీ సీఎం జగన్ పై సూటిగా విమర్శలు గుప్పించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని దీక్షలు చేసిన జగన్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత ఒక్కసారి కూడా ఆ విషయం ఎత్తలేదని గుర్తు చేశారు. స్వలాభం కోసం వైసిపి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని, మూడు రాజధానులన్న జగన్ రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చేశారని విమర్శించారు. .జగన్ రెడ్డి క్రైస్తవుడై ఉండి కూడా మణిపూర్ హింసాకాండ మీద మాట్లాడలేదని విమర్శించారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-doubt-sharmila-target-jagan-25-169126.html
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైనదిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూటమి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవకాశం వచ్చినా వారు వదిలిపెట్టినట్టే కనిపించదు. మొన్న కోట వినుత ఘటన, నిన్న అరవ శ్రీధర్ వ్యవహారం, ఇవాళ వర్మ ఇష్యూ.. ఇలా సమయం దొరికినపుడల్లా ఆయా అంశాలను బాగా హైలెట్ చేసి.. కూటమిలో ఏదో ఒక చిచ్చు రాజేయాలని చూస్తోంది వైసీపీ అధినాయకత్వం.
అతి కొద్ది మంది నేతలు జగన్ ప్రకటనను సమర్దిస్తూ.. అనుకూల ప్రకటనలు చేస్తుండగా.. మెజారిటీ లీడర్, క్యాడర్ మాత్రం జగన్ నిర్ణయంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.