Publish Date:Apr 24, 2024
పుట్టుకతో వచ్చిన బుద్ధి... అంటారు చూశారా.. ఆ మాట తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సరిగ్గా సూటవుతుంది. పదేళ్ళపాటు తెలంగాణ ముఖ్యమంత్రిగా అహంకారపూరితమైన అధికారాన్ని చెలాయించిన కేసీఆర్ని, ఆయన పార్టీని నిన్నటి ఎన్నికలలో తెలంగాణ ప్రజలు ఇంటికి సాగనంపారు. దారుణమైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, ఆత్మ విమర్శ చేసుకుని, పద్ధతులలో మార్పులు చేసుకుంటే వచ్చే ఎన్నికలలో కేసీఆర్కి మళ్ళీ ప్రజాదరణ లభిస్తే లభించవచ్చు. కానీ, కేసీఆర్గానీ, ఆయన పార్టీలోని వ్యక్తులుగానీ తమ పాత ధోరణిలోనే వున్నారు తప్ప మారే ధోరణిలో ఎంతమాత్రం లేరు. ఈ విషయం కేసీఆర్ తాజాగా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు చూస్తూ అర్థమవుతోంది. తమను ఇంటికి పంపించి తప్పు చేశామని ప్రజలు భావిస్తున్నారని కేసీఆర్ అంటున్నారంటే, ఇంతకంటే అమాయకత్వం, అహంకారం మరొకటి వుంటుందా?
1989లో ఎన్టీఆర్ని కూడా ప్రజలు ఓడించారు. తనకు తిరుగేలేదని అప్పటి వరకూ భావిస్తూ వచ్చిన ఎన్టీఆర్ ప్రజలు ఇచ్చిన తీర్పుతో షాకయ్యారు. అయినప్పటికీ, ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, తనను తాను మార్చుకున్నారు. అంతే తప్ప ప్రజలను ఏనాడూ నిందించలేదు. ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయాల్లో రాణించిన కేసీఆర్ ఎన్టీఆర్ నుంచి ఈ గుణాన్ని నేర్చుకోలేదు.
పదేళ్ళ కేసీఆర్ అధికారాన్ని పీకి అవతల పారేసిన రేవంత్ రెడ్డి ఇప్పటికీ కేసీఆర్కి అంగుష్టమాత్రుడిగానే కనిపిస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికీ తనను తాను హిమాలయాలంత ఎత్తున ఉన్నట్టుగానే ఊహించుకుంటున్నారు. తాను పదేళ్ళపాటు అద్భుతమైన పరిపాలన అందించినట్టే భావిస్తున్నారు. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా గొప్పవనే భావిస్తున్నారు. మేడిగడ్డ కుంగిపోవడం చాలా చిన్న విషయంగానే భావిస్తున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. తాను చాలా గొప్ప పరిపాలన అందించినట్టే ఆయన భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ క్రమంగా ఖాళీ అవుతోంది. భవిష్యత్తులో కేసీఆర్ కుటుంబం, ఆయన కుటుంబానికి విధేయంగా పడివుండేవారు తప్ప మరెవరూ ఆ పార్టీలో వుండే అవకాశాలు కనిపించడం లేదు. ఇలాంటి వాస్తవ పరిస్థితులకు భిన్నమైన విధంగా కేసీఆర్ వాదన వుంది. కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన నాయకులు తనకు ఫోన్ చేసి, అనవసరంగా బీఆర్ఎస్ని వదిలి వెళ్ళామని బాధపడుతున్నారట. కేసీఆర్ అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్న ఎమ్మెల్యేలు, ఎంపీలకే కేసీఆర్కి ఫోన్ చేసే సీన్ లేదు.. ఇప్పుడు బయటకి వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయడం, ఈయన మాట్లాడ్డం... బాగుందండి కల్పన. కేసీఆర్ అక్కడితో ఆగలేదు. కాంగ్రెస్ పార్టీలో వున్న 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్లో వున్నారట. వాళ్ళంతా బీఆర్ఎస్కి మద్దతు ఇస్తున్నారట, కాంగ్రెస్ నుంచి
బయటకి వచ్చి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తున్నారట.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/no-change-in-kcr-39-174411.html
వైసీపీ నాయకుడు జగన్కున్న మానసిక వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’ అని, దాన్ని షార్ట్కట్లో ‘నార్సి’ అంటారని,
మామూలు ఓట్లతో మెజారిటీలు సాధిస్తే పోస్టల్ బ్యాలెట్ లెక్కించినా నామమాత్రం అవుతుంది. కానీ ఈసారి నెక్ టూ నెక్ గా ఏపీలో పోరాటం ఉంది. వంద, యాభై, పాతిక, పదీ ఓట్ల తేడాతో కూడా అభ్యర్ధుల గెలుపు ఉండనుంది. దాంతో అపుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లే డిసైండ్ ఫ్యాక్టర్ గా మారనున్నాయి. అందుకే పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కి ఎన్నడూ లేనంతగా ప్రాధాన్యత పెరిగింది.
మాట తప్పను మడమ తిప్పను అనే జగన్ ఇచ్చిన మాటకు పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వరన్న సంగతి ఈ ఐదేళ్ల కాలంలో పదే పదే రుజువైంది. మాట ఇవ్వడం మడమ తప్పటం అన్నది జగన్ నైజంగా జనం భావించే పరిస్థితికి వచ్చేశారు.
నార్సీ వ్యాధికి వున్న కొన్ని లక్షణాలను ఫస్ట్ పార్ట్.లో చెప్పడం జరిగింది. ఈ మానసిక వ్యాధిగ్రస్థులకి వుండే మరికొన్ని లక్షణాలను చూద్దాం.
మనీలాండరింగ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో ఊరట లభించే అవకాశాలు కనిపించడం లేదు. ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే . గత ఏడాది ఫిబ్రవరి 26న అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ సిఎం మనీష్ సిసోడియాకు ఇంత వరకు బెయిల్ లభించలేదు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. అసలు స్వరూపం ఏమిటో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ బట్టబయలు చేశారు. ఆ యాక్ట్ ను తీసుకువచ్చేసి.. ఇంకా అమలులోకి రాలేదు. పరిశీలనలో ఉంది అంటూ ఏపీ మంత్రులు చేస్తున్న ప్రకటనల డొల్ల తనాన్ని ఆయన ఒకే ఒక్క ట్వీట్ తో బయటపెట్టేశారు. తాను ప్రత్యక్ష బాధితుడిని అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు రాష్ట్రంలో దుమారం రేపుతోంది. జగన్ ప్రభుత్వ దొడ్డిదారి యవ్వారాల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది.
జగన్కి వున్న మానసిక వ్యాధి గుట్టు రట్టయింది.. ఆ వ్యాధి పేరు ‘నార్సిసిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్’, షార్ట్కట్లో ‘నార్సీ’ అంటారు.
హైదరాబాద్ బిజెపి అభ్యర్థి మాధవిలత తరపున కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్ షో తర్వాత కాంగ్రెస్, ఎంఐఎం ఒక్కటయ్యాయి. ప్రత్యర్థి బిజెపి అభ్యర్థిని ఎదుర్కోవడానికి ఎన్నికల కమిషన్ ను ఆశ్రయించాలని నిర్ణయించాయి.
ఒక నాయకుడు ప్రజల విశ్వాసాన్ని పొందాలంటే వారి మనస్సులు గెలవాలి. అయితే ఇంట్లోనే ఆయన తీరుకు, వైఖరికీ నిరసన వ్యక్తం అవుతుంటే..సొంత కుటుంబ సభ్యులే బయటకు వచ్చి తమ వారిని నమ్మొద్దని చెబుతుంటే ఆ నేతను జనం ఎలా నమ్ముతారు. ఎందుకు విశ్వసిస్తారు. ముందు ఇంట గెలు.. ఈ తరువాత రచ్చగెలవడం గురించి ఆలోచించు అంటారు కదా?
ఏపీ ఇన్ఛార్జ్ డీజీపీగా శంఖబ్రతా బాగ్చి నియమితులయ్యారు. ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయి డీజీపీని నియమించేవరకు బాగ్చి డీజీపీ
చంద్రబాబు చండ్ర నిప్పులు చెరిగారు. తన స్వభావానికి విరుద్ధంగా ఆగ్రహాన్ని ప్రదర్శించారు. స్కిల్ కేసులో తనను అక్రమంగా అరెస్టు చేసిన్పుడు కూడా ఆయన శాంతంగానే ఉన్నారు. న్యాయస్థానాలలోనే తేల్చుకుంటానని, తనపై కేసే తప్పంటూ క్వాష్ పిటిషన్ వేశారు. ఎక్కడా ఆగ్రహం ప్రదర్శించలేదు. జనాలకు సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల సంఘం ఎట్టకేలకు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎ వేటు వేసింది. అయితే ఇప్పటికే ఆలస్యమైపోయిందన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఎన్నికల సంఘం తీరు పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విపక్షాల ఫిర్యాదులు, ఆరోపణలకు పూచికపుల్ల విలువ ఇవ్వకుండా ఎన్నికల సంఘం వ్యవహరించిందని అంటున్నారు.
ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటలాంటిదని చెప్పవచ్చు. పార్టీకి వ్యతిరేక పవనాలు వీచిన 2019 ఎన్నికలలో కూడా ప్రకాశం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం విజయం సాధించింది. అయితే దర్శినియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఒకింత భిన్నంగా మారాయి.