అయ్యో పాపం.. కేబినెట్ విస్తరణ లేనట్లే.. జగనన్నా మజాకా..

Publish Date:Jan 25, 2022

Advertisement

ఇదిగో అదిగో అంటుండగానే పుణ్యకాలం కాస్తా కరిగిపోతోంది. మంత్రి పదవులపై ఆశలు పెట్టు కున్న ఎమ్మెల్యేల ఆశలు అడియాశలుగానే మిగిలి పోతున్నాయి. ఇటు తెలంగాణలో, అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రలలోనూ ఎంతో కాలంగా మంత్రివర్గ విస్తరణ పునరుద్దరణ గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. అయితే వచ్చిన వార్తలు వచ్చినట్లే వెనక్కి వెళ్లి పోతున్నాయి.ఇలా తళుక్కుమని, ఆశావహులను ఒకింత మురిపించి మాయమై పోతున్నాయి. 

ఏపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం 2019లో జూన్ 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేసింది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఫిఫ్టీ ఫిఫ్టీ ఫార్ములాను ఎనౌన్స్ చేశారు. రెండున్నరేళ్ళ తర్వాత మొత్తానికి మొత్తంగా మంత్రివర్గాన్ని తీసేసి కొత్తవారికి అవకాశం కల్పిస్తామని అన్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చింది. అయినా, మంత్రివర్గ విస్తరణ గురించి ఉలుకు పలుకూ లేదు. అయితే ఒకసారి కొత్త మంత్రివర్గం కూర్పుకు సంబంధించి కసరత్తు మొదలైందని. ముఖ్యమంత్రి ఫినిషింగ్ టచెస్ ఇస్తున్నారని, ఇంకొకసారి మంత్రుల కోరికపై ఆరు నెలలు ఎక్స్టెన్షన్ ఇచ్చారని, ఇలా వార్తలైతే వస్తున్నాయి కానీ, అసలు ముహూర్తం మాత్రం రావడం లేదు. ఈ లోగా ఆశావహులు గుళ్ళో గోపురాల చుట్టూ తిరుగుతూ,జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. పూజలు చేస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం, ఇప్పట్లో మంత్రి వర్గవిస్తరణ ఉండదు. అసలే ఉండక పోవచ్చును, ఉన్నా, చిన్న చిన్న మార్పులు చేర్పులే కానీ, పూర్తి స్థాయి పక్షాలన మాత్రం ఉండదని తెలుస్తోంది.   

ఏపీ కథ అలా ఉంటే, తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కంటే ముందస్తు ఎన్నికల ముచ్చట ప్రముఖంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2018 అసెంబ్లీ ఎన్నికల వరకు తెలంగాణ కింగ్, అంత వరకు ఆయనకు ఎదురన్నదే లేదు. అందుకే 2018లో ముందస్తుకు వెళ్లి, అదే ఊపులో సారూ .. కారూ .. పదహారు ..ఢిల్లీ సర్కారు వ్యూహంతో 2019 లోక్ సభ ఎన్నికలకు వెళ్ళారు. లోక్ సభ ఎన్నికల్లో కేంద్రంలో సంకీర్ణం వస్తే, రాష్ట్రాన్ని కేటీఆర్’కు అప్పగించి  తాను కేంద్రంలో చంక్రం తిప్పాలని కేసీఆర్ స్కెచ్ సిద్దం చేసుకున్నారు. అయితే, అక్కడ కథ అడ్డం తిరిగింది. కేంద్రంలో  సంకీర్ణం రాలేదు. బీజేపీ సొంత సీట్ల సంఖ్యే మ్యాజిక్ ఫిగర్ (272) దాటి 303 కు చేరింది. ఎన్డీఎ ఫిగర్ 350 క్రాస్ చేసింది. మరోవంక రాష్ట్రంలో కారును బ్రేకు పడింది. కారు టైరుకు పక్చరైంది. కారు పదహారు కల బేజారైంది. నెంబరు 9కి  చేరింది.బీజేపీ నాలుగు, కాంగ్రెస్ మూడు సీట్లు ఎగరేసుకు పోయాయి. చివరకు సొంత బిడ్డ కవిత కూడా ఓడి పోయారు. ఇక అక్కడి నుంచి కేసీఆర్ లెక్క తప్పుతూ వస్తోంది.

అయినా, కారణాలు వేరైనా కేటీఆర్ పట్టాభిషేకం చేసే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే, కేటీఆర్ పట్టాభిషేకం మాట ఎలా ఉన్నా, అందుకోసం చేసే ప్రతి ప్రయత్నం బెడిసి కొడుతున్నట్లు కనిపిస్తోంది. మరో వంక హుజూరాబాద్ పరాభవం తర్వాత ప్రజల్లో  ప్రభుత్వం పట్ల వ్యతిరేక పెరుగుతోంది. లెక్కలు తప్పుతున్నాయి. పార్టీలోనూ, చాప కింద నీరు చేరుతున్నది. తడి తగులుతోంది. కాళ్ళకింద నెల కదులుతోది. బుజ్జగింపులు తప్పడం లేదు.

అందుకే, మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ ముఖ్యమంత్రి కొంత జంకు తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి అయిపోగానే మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడా ఆలోచన అటక ఎక్కిందనీ అంటున్నారు. అలాగే, ఈసారి కూడా ముఖ్యంత్రి ముదస్తుకు పోతారన్న ఊహాగానాలు వినవస్తునాయి.  ఆగస్టు తర్వాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్తారని అంటున్నారు.అదే నిజమైతే కేసీఆర్ ఇక మంత్రి వర్గాన్ని విస్తరించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీ అనుకూలంగా వస్తే ఒకలా, వ్యతిరేకంగా వస్తే మరోలా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహం ఉంటుంది సన్నిహిత వర్గాల తాజా  సమాచారం. ఈ నేపద్యంలో, మార్చి 10న యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతనే, మత్రివర్గ విస్తరణ కానీ,మరో నిర్ణయం గానీ ఉంటుందని, అంతవరకు, అంతా గప్ చిప్ .. అంటున్నారు.

By
en-us Political News

  
రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. ఒక సారి గెలిచిన పార్టీ మరో సారి ఓడిపోతుంది. ఇది సూర్యుడు తూర్పున ఉదయిస్తాడన్నంత సహజం. అయితే ఒక్కో సారి మాత్రం ఒక ఓటమి ఆ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. అంటే కళ్ల ముందరే ఓడలు బళ్లు అయిన దృశ్యం సాక్షాత్కరిస్తుందన్న మాట. సరిగ్గా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి అలా ఉంది.
తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటలకు పైగా సమయం పడుతోంది.
దెందులూరు వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఘోర అపశృతి చోటుచేసుకుంది. వైసీపీ ప్రచార ఆర్భాటం చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. ఎన్నికల నిబంధనలను ఏమాత్రం పాటించకుండా చిన్న పిల్లలను ప్రచారంలో భాగం చేసి వారి ప్రాణాలతో చెలగాటమాడారు. పెదపాడు మండలం రాజుపేటలో బుధవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
ఎవరూ ఊహించని యువతి ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టింది. కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యండి అని ఓటర్లని చిరునవ్వులు చిందిస్తూ అడిగింది.
వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైయస్ జగన్ అక్రమాస్తుల కేసు మళ్లీ మొదటికొచ్చింది. సీబీఐ కోర్టు జడ్జి బదిలీ అయ్యారు. దీంతో ఈ కేసు విచారణ మే 15వ తేదీకి వాయిదా పడింది. అయితే సీబీఐ, ఈడీ కేసుల్లో వైయస్ జగన్ సహా 130 పిటిషన్లపై గత 12 ఏళ్లుగా విచారణ కొనసాగుతూనే ఉంది.
తెలుగు ఠీవీ పీవీ నరసింహారావు(కు భారత రత్న ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అదే టైంలో మరో డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది. అదే ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలనే నినాదం. సీనియర్ ఎన్టీఆర్‌ అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ నినాదాన్ని గట్టిగానే వినిపిస్తున్నారు. ఇందులో చాలా మంది ప్రముఖులు కూడా ఉన్నారు. 
పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ... వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.
జగన్ హయాంలో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే. మద్యం దుకాణాల దగ్గర కాపలా విధులు నిర్వర్తించాల్సి రావడం నుంచి రాష్ట్రప్రభుత్వోద్యోగులు, టీచర్లు పడిన బాధలు ఇన్నిన్ని కావయా అన్నట్లుగా ఉంది. చివరకు వారిని నెల మొదటి తారీకున రావాల్సిన వేతనాలకు కూడా విడతల వారీగా విదిల్చి నానా ఇబ్బందులకూ గురి చేశారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారత దేశాన్ని ఏదో పెద్ద శనిగ్రహం పట్టి పీడిస్తోంది.
అందుకే అంటారు.. ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా జీవితం మీద ఆశ వదలకూడదని..! ఈ మాటకి తాజా ఉదాహరణ
ఏపీ హైకోర్టులో జనసేన పార్టీకి పాక్షిక ఊరట మాత్రమే లభించింది. గాజు గ్లాసు గుర్తు స్వతంత్య్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని జనసేన పార్టీ సవాల్ చేస్తూ హైకోర్టులో మంగళవారం (ఏప్రిల్ 30) పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసుడిగా ఎపి రాజకీయాల్లో అడుగు పెట్టి ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ కు అడ్డూ అదుపు లేకుండా అరాచకపాలన సాగిస్తున్నట్టు విమర్శ ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ ఏడాది రాష్ట్రంలో తొలిసారిగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. రాష్ట్రంలో మంగళవీరం(ఏప్రిల్26) అత్యధికంగా నల్గొండ మాడుగులపల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో సోమవారం (ఏప్రిల్ 29) ఒక్కరోజే వడదెబ్బకు ఎనిమిది మంది చనిపోయారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.