తగ్గేదేలే.. ఎవరొచ్చినా.. రాకున్నా నా దారి జాతీయ రాజకీయాల వైపే!

Publish Date:Jul 11, 2022

Advertisement

కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తగ్గట్లే.. తగ్గేదే లే అంటూ పుష్పలా ముందుకే సాగుతున్నారు. ఎవరు కలిసి వచ్చినా, రాకున్నా తన అడుగు ముందుకేనని స్పష్టం చేస్తున్నారు. అంతే కాదు గుజరాత్ ముఖ్యమంత్రిగా పని చేసన మోడీ ప్రధాని కాగా లేనిది..  తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న నేను ప్రధాని ఎందుకు కాకూడదని ప్రశ్నిస్తున్నారు.

ముఖ్యమంత్రిగా మోడీ గుజరాత్ ను అభివృద్ధి చేసిన దాని కన్నా వంద రెట్లు తాను తెలంగాణను ప్రగతి పథంలో నడిపించానని చెప్పుకుంటున్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎనిమిదేళ్ల కాలంలోనే దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రాలలో ఒకటిగా నిలిపిన తనకు.. దేశాన్ని ఎలా ముందుకు నడపాలో మోడీ కాంటే బాగా తెలుసునని అంటున్నారు.

బీజేపీ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమైన రోజుల మీడియా సమావేశంలో మోడీకి   ప్రశ్నలూ సంధించి వాటికి సమాధానాలు చెప్పమని సవాల్ చేసి.. ప్రధాని ప్రసంగానికి అజెండా నిర్ణయించేశానని చెప్పుకున్న కేసీఆర్.. ఆ తరువాత మోడీ తన ప్రసంగంలో కేసీఆర్ ప్రస్తావనే తీసుకురాకపోవడంతో దిగాలు పడ్డారు. అందుకే బీజేపీ జాతీయ కార్గవర్గ సమావేశాలు ముగిసిన వారం రోజుల తరువాత తనను తాను కూడదీసుకుని మరోసారి మోడీ పాలనపై ధ్వజమెత్తడానికి మీడియా ముందుకు వచ్చారు. ఒక వైపు రాష్ట్రం కుండపోత వర్షాలతో అతలాకుతలమై ఉన్న సమయంలో రాష్ట్రంలో వర్షాల పరిస్థితిపై సమీక్షా సమావేశాన్ని క్లుప్తంగా ముగించేసిన కేసీఆర్.. కేంద్రంపై, మోడీ పాలనపై ధ్వజమెత్తేందుకు మీడియా సమావేశంలో ఎక్కువ సమయమే తీసుకున్నారు.

బీజేపీ చెబుతున్న డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వం రావడమేనని ఉద్ఘాటించారు. మోడీ జాతీయ కార్యవర్గ సమావేశాల అనంతరం జరగిన బహిరంగ సభలో తానడిగి ఒక్క ప్రశ్నకూ సమాధానం చెప్పలేకపోయారని నిందించారు. మోడీ ప్రసంగం పూర్తయిన వారం రోజుల తరువాత కేసీఆర్ తాను మోడీకి సంధించిన ప్రశ్నలు కొత్తవేమీ కాదని వెల్లడించారు. 2014 ఎన్నికలకు ముందు మోడీ అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ ను ఏ ప్రశ్నలైతే అడిగారో వాటినే తాను మోడీని అడిగానని అసలు రహస్యం చెప్పేశారు. తన జాతీయ అజెండా కొత్తదేమీ కాదనీ.. ఎనిమిదేళ్ల నాడు యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ మోడీ ఏ అజెండానైతే ప్రజల ముందుకు తీసుకువచ్చారో అదే అజెండాతో తాను మోడీని ఎదుర్కొంటానని చెప్పారు. ఈ సందర్భంగా రూపాయి పతనంపై  మోడీ అప్పటి యూపీఏ ప్రభుత్వంపై చేసిన విమర్శల వీడియోను విలేకరుల సమావేశంలో ప్రదర్శించి చూపారు.

  దర్యాప్తు సంస్థల్ని రాజకీయ ప్రత్యర్ధులపై దాడులకు ఉపయోగించుకుంటున్నారనీ.. అలా వారిని బెదరించి  బీజేపీలో చేర్చుకుంటున్నారని కేసీఆర్ విమర్శించారు. రాష్ట్రప్రభుత్వాలను కూల్చేయడమే కేంద్రం పాలనా తీరుగా మారిపోయిందన్నారు.    సీబీఐ కేసులు ఎదుర్కొని.. ఆ తర్వాత బీజేపీలో చేరి కేసుల ఊసే లేకుండా తిరుగుతున్న నేతల జాబితాను ఈ సందర్బంగా ఆయన బయటపెట్టారు. ప్రధానంగా సుజనా చౌదరి పేరును పలు మార్లు ఉదహరించారు. ప్రధాని మేకిన్ ఇండియా అట్టర్ ప్లాప్ అని విమర్శలు గుప్పించారు. పతంగుల మాంజా నుంచి ప్రతిదీ మేడిన్ చైనాయే అని ఎద్దేవా చేశారు. దేశానికి పాకిస్థాన్ కన్నా చైనాతోనే ప్రమాదం ఎక్కువ అని తనతో పలువురు మాజీ మేజర్లు, లెఫ్టినెంట్ జనరళ్లు చెప్పారనీ, అటువంటి చైనా సరిమద్దుల్లో మోడీ సర్కార్ దేశ భక్తి పేరిట ఆర్మీతో ప్రయోగాలు చేస్తోందని ఆరోపించారు.

అగ్నిపథ్ అనేది ఒక పనికి మాలిన పథకమని చెప్పారు. జవాన్లకు శిక్షణ ఇవ్వడానికే ఆరేళ్లు పడుతుందన్నారు. అటువంటి శిక్షణ లేకుండా కేవలం నాలుగేళ్లలో జవాన్ల కెరీర్  పూర్తి చేసేయడమంటే ఆర్మీ సామర్థ్యాన్ని నీరుగార్చడమేనని దుయ్యబట్టారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోడీ వారి బతుకులను ఆగంఆగం చేశారని విమర్శించారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముందు రెండు రోజుల పాటు రైతు ఉద్యమ నేత రాకేశ్  తికాయత్ ను ప్రగతి భవన్ కు పిలిపించుకుని రెండు రోజుల పాటు కేసీఆర్ చర్చించారు. అంతే కాకుండా ఆయన మాటలను బట్టి ఆర్మీ మాజీ మేయర్లు, లెఫ్టినెంట్ జనరళ్లతో కూడా ఆయన చర్చించారని అవగతమౌతోంది. మొత్తం మీద కేసీఆర్ బీజేపీపై విసుర్లు, విమర్శలతో మరో సారి రాజకీయ చర్చలకు తనను తాను కేంద్ర బిందువుగా చేసుకోగలిగారు.

By
en-us Political News

  
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.