Publish Date:May 15, 2024
రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు. నిమ్మల పాలకొల్లు నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఇప్పుడు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడాల శ్రీహరిరావు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఎలాగూ ఓటమి ఖాయం అన్న భావనతో డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదని వైసీసీ శ్రేణులే చెబుతున్నాయి. వాస్తవానికి గూడాల శ్రీహరిరావు అక్వా వ్యాపారంలో బాగానే సంపాదించారు.
అయినా కూడా ఎటూ ఓటమి తప్పదు కనుక ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదు. దీంతో పాలకొల్లులో వైసీపీ పోటీ నామ్ కే వాస్తే చందంగానే ఉందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు. నిజానికి పాలకొల్లులో నిమ్మల రామానాయుడికి ప్రజాభిమానం మెండుగా ఉంది. ప్రజలలో మమేకమై వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే నిమ్మల రామానాయుడు జగన్ హవా నడిచిన 2014 ఎన్నికలలో 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో 2019 త్రిముఖ పోటీ ఉంది. అప్పటి ఎన్నికలలో నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి 33 వేల ఓట్లు వచ్చాయి. జగన్ హవా నడిచి, జనసేన పోటీలో ఉన్న ఆ ఎన్నికలలోనే నిమ్మల 18 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు తోడు తెలుగుదేశం కూటమిలో జనసేన కూడా భాగస్వామ్య పార్టీ కావడంతో ఈ సారి నిమ్మల మెజారిటీ భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. హ్యాట్రిక్ గెలుపుతో నిమ్మల ఈసారి చంద్రబాబు కేబినెట్ లో బెర్త సంపాదించడం కూడా ఖాయమని తెలుగుదేశం వర్గీయులు విశ్వాసం వ్యక్తం చే స్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nimmala-win-sure-in-palakollu-39-176059.html
తిరుమలలో భక్తుల రద్దీ స్వల్పంగా పెరిగింది. సోమవారం (జూన్ 10)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 31 కంపార్ట్ మెంట్లు పూర్తిగా నిండిపోయాయి.
ఐసీసీ మెగా టోర్నమెంట్లలో పాకిస్థాన్ పై విజయాల సంప్రదాయాన్ని భారత్ కొనసాగిస్తోంది. టి20 వరల్డ్ కప్ లో భాగంగా ఆదివారం (జూన్ 9)న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో టీమ్ ఇండియా ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది.
కేంద్రమంత్రిగా గుంటూరు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
కేంద్రమంత్రిగా శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.
భారత ప్రధానిగా ఆదివారం నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ప్రధాని నెహ్రూ వరుసగా మూడు పర్యాయాలు ప్రధాని పదవి అధిరోహించిన సంగతి తెలిసిందే.
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు.
ఐదేళ్ళపాటు జగన్తో అంటకాగి ఆయన ఆడమన్నట్టల్లా ఆడిన పాపం తన పీకకు భారీ స్థాయిలో చుట్టుకుంటున్న నేపథ్యంలో వాసుదేవరెడ్డి అప్రూవర్గా మారిపోవడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
మళయాళ నటుడు సురేష్ గోపి అరుదైన రికార్డు దక్కించుకున్నారు.
కేరళలోని త్రిస్సూర్ నుంచి బీజేపీ తరఫున ఎంపీగా గెలిచి రికార్డ్ సృష్టించిన ప్రముఖ నటుడు సురేశ్ గోపి... మోదీ కేబినెట్లో చోటు దక్కించుకోవడం ద్వారా మరో మైలురాయిని అందుకుంటున్నారు.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా
ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా ఉలవచారు బిర్యానీ చిత్రంలో ఈ సాంగ్ గుర్తొచ్చే విధంగా ఉంది మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో నడ్డా విందు.
ఢిల్లీలో ఇవాళ కేంద్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్డీయే ఎంపీలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పసందైన విందు ఇస్తున్నారు. ఈ డిన్నర్ పార్టీకి సంబంధించిన మెనూ కూడా వెల్లడైంది.
తాజాగా రాష్ట్రం నుంచి మరో ఎంపీకి కూడా మోదీ కేబినెట్లో స్థానం దక్కుతుందని తెలుస్తోంది. ఏపీ నుంచి కేంద్ర క్యాబినెట్ లోకి నరసాపురం బీజేపీ ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు చోటు దక్కిందని సమాచారం.
వరుసగా మూడో పర్యాయం భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 8 వేల మంది అతిథులు మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు. వారిలో దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఉన్నారు.
జడ్చర్ల పంచాయతీ కార్యాలయం, వెంకటేశ్వర ఆలయాల్లో ఉన్న క్రీ. శ. 12వ శతాబ్ది శాసనాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా, సీఈఓ, డా .ఈమని శివనాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్లో కొత్త మద్యం పాలసీ మీద ముఖ్యమంత్రి కార్యాలయంలో చర్చలు జరిగాయి. ప్రస్తుతం వున్న మద్యం పాలసీని రద్దు చేపి కొత్త పాలసీని తీసుకురావాలని నిర్ణయించడం జరిగింది.