పాలకొల్లు.. నిమ్మల గెలుపు పక్కా.. కేబినెట్ బెర్త్ గ్యారంటీ!

Publish Date:May 15, 2024

Advertisement

రాష్ట్రమంతటా ఒకెత్తు.. పాలకొల్లు ఒక్కటీ ఒకెత్తు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి నిమ్మల రామబానాయుడి విజయంపై విపక్ష వైసీపీ అభ్యర్థికి కూడా ఎలాంటి అనుమానం లేదు. నిమ్మల పాలకొల్లు నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. ఇప్పుడు కూడా విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని నియోజకవర్గంలో మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గూడాల శ్రీహరిరావు పెద్దగా ప్రచారం కూడా చేయలేదు. ఎలాగూ ఓటమి ఖాయం అన్న భావనతో డబ్బులు కూడా ఖర్చు పెట్టలేదని వైసీసీ శ్రేణులే చెబుతున్నాయి. వాస్తవానికి గూడాల శ్రీహరిరావు అక్వా వ్యాపారంలో బాగానే సంపాదించారు.

అయినా కూడా ఎటూ ఓటమి తప్పదు కనుక ఖర్చు ఎందుకు అనుకున్నారో ఏమో ప్రచారం కూడా సరిగా నిర్వహించలేదు. దీంతో పాలకొల్లులో వైసీపీ పోటీ నామ్ కే వాస్తే చందంగానే ఉందని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నారు.  నిజానికి పాలకొల్లులో నిమ్మల రామానాయుడికి ప్రజాభిమానం మెండుగా ఉంది. ప్రజలలో మమేకమై వారి కష్ట సుఖాలలో పాలుపంచుకునే నిమ్మల రామానాయుడు జగన్ హవా నడిచిన 2014 ఎన్నికలలో 18 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 

కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో 2019 త్రిముఖ పోటీ ఉంది. అప్పటి ఎన్నికలలో నియోజకవర్గంలో జనసేన అభ్యర్థికి 33 వేల ఓట్లు వచ్చాయి. జగన్ హవా నడిచి, జనసేన పోటీలో ఉన్న ఆ ఎన్నికలలోనే నిమ్మల 18 వేల పై చిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకతకు తోడు తెలుగుదేశం కూటమిలో జనసేన కూడా భాగస్వామ్య పార్టీ కావడంతో ఈ సారి నిమ్మల మెజారిటీ భారీగా పెరగడం ఖాయమని అంటున్నారు. హ్యాట్రిక్ గెలుపుతో నిమ్మల ఈసారి చంద్రబాబు కేబినెట్ లో బెర్త సంపాదించడం కూడా ఖాయమని తెలుగుదేశం వర్గీయులు విశ్వాసం వ్యక్తం చే స్తున్నారు.  

By
en-us Political News

  
హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం బుధవారం (మే 29) ఉదయం సీఎం చంద్రబాబు అన్న నినాదాలతో మారుమోగిపోయింది. ఏపీలో ఎన్నికలు ముగిసిన అనంతరం తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి కంపోజ్ చేయడంపై బీఆర్ఎస్ చేస్తున్న అనవసర రాద్ధాంతం ఇప్పటికే దిగజారిన ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది.
వారం రోజులు.. సరిగ్గా వారం రోజులు.. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడి రాష్ట్రంలో కొలువుదీరబోయే కొత్త ప్రభుత్వం ఏది అన్నది తేలిపోతుంది.
వైసీపీ ఆవిర్భావం నుంచి ఒక ఒరవడిలో వెడుతోంది. తన తప్పులు, తప్పిదాలు, తన దౌర్జన్యాలూ, దాష్టికాలూ అన్ని ప్రత్యర్థులపై నెట్టేసి చేతులు దులిపేసుకోవడమే ఆ ఒరవడి. విపక్షంలో ఉండగానూ అదే చేసింది. గత ఐదేళ్ల అధికారంలోనూ దానినే ఫాలో అయ్యింది.
పిఠాపురం నియోజకవర్గంలో జనసేనాని పవన్ కల్యాణ్ విజయంపై ఎవరికీ ఎటువంటి సందేహాలూ లేవు. ఆఖరికి ఆ నియోజకవర్గంలో పవన్ కు ప్రత్యర్థిగా, వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వంగా గీత కూడా ఎన్నికల తరువాత ప్లేటు ఫిరాయించేసి తానెప్పుడూ పవన్ కల్యాణ్ ను వ్యక్తిగతంగా దూషించలేదనీ, వైసీపీ పెద్దల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చినా తాను విమర్శల విషయంలో సంయమనం పాటించాననీ చెప్పుకున్నారు.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (మే 29)ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 17 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
రిజల్ట్స్ కౌంట్‌డౌన్ కొటేషన్-7
ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గంలో ఎవరికివాళ్లు… మా తాలుకా అంటే.. మా తాలుకా అని.. బోర్డులు తగిలించుకొని తిరుగుతున్నారు. వాహనాలకు నెంబర్‌ పేట్లకు బదులు.. మా పిఠాపురం ఎమ్మెల్యే ఫలానా అని.. రేడియంతో స్టిక్కరింగ్‌ చేయిస్తున్నారు. జనసేన, వైసీపీ కార్యకర్తల మధ్య స్టిక్కర్ వార్ నడుస్తోంది.
వైసీపీ ఓటమి ఖరారని తెలుగుదేశం కూటమి నేతలు, పరిశీలకులు, రాజకీయ పండితులు చెప్పడం కాదు. స్వయంగా వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డే అంగీకరించేశారు. ఈ సారి ఎన్నికలలో తెలుగుదేశం కంఫర్ట్ బుల్ గా విజయం సాధించబోతోందని ఆయన అన్యాపదేశంగా కేడర్ కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చేశారు.
హైదరాబాద్ లో ఒకే రోజు రెండు ఫేక్ కాల్స్ వచ్చాయి. ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నివాసముండే ప్రజా భవన్ కు ఉదయం ఉత్తుత్తి బాంబు బెదిరింపు వస్తే సాయంత్రం నాంపల్లిక్రిమినల్ కోర్టుకు ఇదే తరహా కాల్ వచ్చింది. 
సార్వత్రిక ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. ఎడు విడతలుగా జరుగుతున్న ఎన్నికలలో చివరి విడత పోలింగ్ జూన్ 1న జరుగుతుంది. ఆ తరువాత నాలుగు రోజులకు అంటే జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి. ఈ సారి దేశ వ్యాప్తంగా ఎలాంటి ట్రెండ్ కనిపించనప్పటికీ, ఏపీ ఎన్నికల విషయంలో మాత్రం దేశ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
 బిఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత అరెస్ట్ అయి ఇన్ని రోజులైనా బెయిల్ విషయంలో ఇంకా  క్లారిటీ రాలేదు.   ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగిశాయి. హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తీర్పును రిజర్వ్ చేశారు.
బీఆర్ఎస్ పరిపాలించిన పదేళ్ళ కాలంలో ఎవర్నయినా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారా? ఎవరూ నోరు ఎత్తకుండా ఆందోళనకారులందర్నీ బూటు కాళ్ళ కింద వేసి తొక్కేశారే... అప్పుడేమయ్యాయి ఈ నీతి సూత్రాలు?
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.