తదుపరి సినిమా ఎపీలో…!

Publish Date:Jun 14, 2025

Advertisement

ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి చంద్రబాబుని సినీ ఇండస్ట్రీ పెద్దలు కలవనున్నారు. సరిగ్గా అదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షూటింగుల కోసం విదేశాలకు వెళ్ళనున్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవానికి కౌంట్ డౌన్ మొదలైపోయింది. ఇంకొన్ని గంటల్లో.. హైదరాబాద్‌లోని హైటెక్స్‌ వేదికగా అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా నిర్వహించబోతోంది ప్రభుత్వం. అవార్డులకు సంబంధించి.. తెలంగాణ ఫిల్మ్ డెవల ప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, నిర్మాత దిల్‌రాజు ఆసక్తికరమైన అంశాన్ని తెలిపారు. ఉత్తమ చిత్రంగా ఎంపికైన ప్రతి సినిమాకు.. 4 అవార్డులు ఇవ్వనున్నారు. బెస్ట్ ఫిల్మ్‌గా ఎంపికైన చిత్రానికి సంబం ధించిన.. హీరో, హీరోయిన్, దర్శకుడు, నిర్మాతకు  గద్దర్ ఫిల్మ్ పురస్కారాలు అందజేయనున్నారు. ఇలా  ఒక సినిమాకి నాలుగు చొప్పున అవార్డులు ప్రదానం చేయడం ఇదే తొలిసారి.

14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను అందిస్తోంది.  అందుకే గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమంపై అంతటా ఆసక్తి నెలకొంది. 2014 నుంచి 2024 మధ్య కాలంలో విడుదలైన సినిమాలకు  ఈ పురస్కారాలు అందించనున్నారు. ప్రతి ఏడాది.. 3 ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి..  ఆ సినిమాల హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. 

మొత్తానికి.. తెలంగాణలో 14 ఏళ్ల తర్వాత గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ఇవ్వబోతున్నారు. దీంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటి నుంచి నంది అవార్డులు ఇస్తారనే చర్చ మొదలైంది. ఈ ఆదివారం (జూన్ 15న) ఏపీ సీఎం చంద్రబాబుతో.. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో నంది అవార్డులపై ఓ క్లారిటీ వస్తుందనే చర్చ సాగుతోంది. సీఎం చంద్రబాబుతో సమావేశానికి.. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి దాదాపు 60 మంది హాజరవుతారని తెలుస్తోంది.  వీరిలో.. పెద్ద నిర్మాతలు, స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు ఉండనున్నారు. తొలిసారి..  24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన వాళ్లందరినీ పిలిచారు. అయితే.. ఎవరెవరు హాజరవుతారనేది సస్పెన్స్‌గా మారింది. ఈ ఆహ్వానాలన్నీ.. ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఆధ్వర్యంలోనే అందినట్లు తెలుస్తోంది.  ఇక.. సీఎంతో మీటింగ్‌కు ఆహ్వానం అందకపోవడంపై.. చిన్న నిర్మాతలు, చిన్న సినిమాల నటీనటులు, డైరెక్టర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. మీటింగ్ విషయంలో ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఎవరికి వారు సెపరేట్ గ్రూపులుగా ఉన్నారనే చర్చ జరుగుతోంది. థియేటర్ ఎగ్జిబిటర్ల వివాదంలో.. ఏ నలుగురి పేర్లయితే ప్రముఖంగా వినిపించాయో.. ఆ నలుగురు.. అంటే.. దిల్ రాజు, అల్లు అరవింద్, సురేశ్ బాబు, ఏషియన్ సునీల్ కూడా మీటింగ్‌కు వెళ్లనున్నారు. ఏపీలో థియేటర్లు తమ కంట్రోల్‌లో లేవని, తాము కంట్రోల్ చేయడం లేదని ఇప్పటికే స్పష్టతనిచ్చారు.  ఇప్పుడు.. సీఎం చంద్రబాబు ముందు కూడా అదే చెప్పి చేతులు దులుపుకోవాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను కూడా ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు సినీ పరిశ్రమ పెద్దలు. ప్రధానంగా సింగిల్ స్క్రీన్లని కాపాడుకోవడం, ఆడియెన్స్‌ని మళ్లీ థియేటర్లకు రప్పించేలా చేసేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు. ఎగ్జిబిటర్ల పర్సంటేజీల విధానం, క్యాంటీన్ రేట్లపైనా చర్చ జరిగే అవకాశం ఉంది. థియేటర్ ఓనర్లు కరెంట్ బిల్లుల్లో సబ్సిడీ అడగాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా.. షూటింగ్‌ల కోసం సింగిల్ విండో విధానం తీసుకురావాలని కోరనున్నారు. ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న చిత్ర నిర్మాతల సమస్యలకు పరిష్కారం చూపాలని అడగనున్నట్లు తెలుస్తోంది.  గతంలో వైసీపీ ప్రభుత్వం.. 175 స్క్రీన్ల లోపు విడుదలయ్యే చిన్న సినిమాలకు.. ఐదో షో ఇస్తాననే హామీ ఇచ్చింది. కానీ..  అమలు చేయలేదు. దాంతో మరోసారి చిన్న సినిమాలకు ఐదు షోలు ఇవ్వాలనే డిమాండ్‌ని.. సీఎం ముందు ఉంచనున్నారు. 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి 68 శాతం ఆదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. అందువల్ల.. ఏపీలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి, స్టూడియోల నిర్మాణానికి.. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని.. సినీ పరిశ్రమ ప్రముఖులు కోరనున్నారు. పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలో టికెట్ రేట్ల పెంపునకు సంబంధించి ఏం చర్చిస్తారనేది  ఆసక్తిగా మారింది. తెలంగాణలో అయితే.. తన సినిమాలకు టికెట్ రేట్లు పెంచేది లేదని దిల్ రాజు చెప్పేశారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచనతో లేదు. మరి.. ఏపీలో టికెట్ రేట్ల పెంపు ఉంటుందా? పెద్ద సినిమాల రిలీజ్‌ల సమయంలోనే.. టికెట్ రేట్లు పెంచుకునేందుకు అవకాశం ఇస్తారా? అన్నది ఆసక్తిగా మారింది. సీఎంతో మీటింగ్ తర్వాత.. కుబేర, కన్నప్ప, తమ్ముడు లాంటి సినిమాలు.. రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వీటికి.. రేట్లు పెంచుతారా? లేదా? అన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది.

By
en-us Political News

  
బీజేపీ తన వ్యూహాత్మక నిర్ణయాలతో ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల ఎంపికలో  ఈ విషయం మరోసారి ప్రస్ఫుటమైంది.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేశారు. బీజేపీ అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ ఆయన పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును పార్టీ ప్రకటించడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌ వ్యవహార శైలి, కాంగ్రెస్ కల్చర్ కు చాలా భిన్నంగా ఉంటుందని రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ వర్గాల్లో చాలా  కాలంగా వినిపిస్తోంది. అవును.. కాంగ్రెస్ నాయకులు, శ్రేణులతో పాటుగా  ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలలో కూడా మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ కల్చర్ కు భిన్నంగా వ్యహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. 
మొన్న‌టి వ‌ర‌కూ కిష‌న్ రెడ్డిని కేసీఆర్ ప్రోగా ఉండే బీజేపీ అధ్య‌క్షుడంటూ ఒక గొడ‌వ న‌డిచేది. అన్న‌ట్టుగానే బీజేపీ తెలంగాణ‌లో గ‌ట్టి పోటీ ఇవ్వ‌లేక‌.. సెకండ్ ప్లేస్ టు థ‌ర్డ్ ప్లేస్ కి ప‌డిపోయింది క‌మ‌లం పార్టీ.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి సోమవారం (జూన్ 30)సాయంత్రం బయలుదేరి తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత జగన్ ఆంధ్రప్రదేశ్ కు, తాడేపల్లిలోని ఆయన ప్యాలెస్ కు చుట్టపు చూపుగానే వస్తున్నారు. దీంతో జగన్ తాడేపల్లి ప్యాలెస్ రాకకు పెద్దగా ప్రధాన్యత ఉండే అవకాశం లేదు.
పఠాన్‌చెరు మండలం పాశ మైలారం పారిశ్రామిక వాడలోని సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీలో సోమవారం (జూన్ 30) ఉదయం సంభవించిన భారీ పేలుడులో కనీసం ఐదుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు.
తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు అనూహ్య మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు.
ఉభయ తెలుగు రాష్ట్రాలకు బీజేపీ నూతన అధ్యక్షులు ఎవరో తేలిపోయింది? ఇంతవరకు అనేక కోణాల్లో, అనేక సమీకరణలు ఆధారంగా లెక్కలు కట్టిన కమల దళం చివరకు నాగపూర్ ఎంపిక చేసిన పాత కాపులకే పట్టం కట్టింది.
పురుగుల మందు తాగి ఎస్సై భార్య ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో  జరిగింది. ఖమ్మం రైల్వే ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై ఈ రోజు విజయవాడలో నిర్వ‌హించ‌నున్న‌ నేషనల్ క్వాంటం వర్క్‌షాప్ లో పాల్గొనేందుకు అంతర్జాతీయ ఐటీ సంస్థలు, బహుళజాతి కంపెనీల ప్రతినిధులు రాష్ట్రానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగదారులకు ఇది నిజంగా శుభవార్తే. తక్కువ విద్యుత్ వినియోగించేవారికీ, పీఎం సూర్యఘర్  పథకం కింద  సోలార్ ప్యానెళ్లు పెట్టుకున్న లబ్ధిదారులకు అడ్వాన్స్ కంజప్షన్ డిపాజిట్ (ఏసీడీ) చార్జీల వసూలు నిర్ణయాన్ని ఏపీసీపీడీసీఎల్ ఉపసంహరించుకుంది.
అన్నమయ్య జిల్లాలో ఈ తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. తిరుమల నుంచి కర్నాటకలోని బాగేపల్లి వెడుతున్న టెంపుల్ ట్రావెల్ ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.