త్వరలో ఏపీలో కొత్త సినిమా.. కొత్త జిల్లాల జాతర..

Publish Date:Jan 25, 2022

Advertisement

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో  ఏపీలో కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ సినిమాతో వచ్చే ఊపుతో ఇప్పుడున్న వ్యతిరేకత అంతా కూడా వాషవుట్ అవుతుందని జగన్ అండ్ కో అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఇతివృత్తం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడున్న 13 జిల్లాలను రెట్టింపు చేసే సరికొత్త ప్రక్రియ. అంటే ఏపీని 26 జిల్లాలుగా విభజించబోతున్నారన్నమాట. కొంతకాలంగా ఇవిగో కొత్త జిల్లాలు, అవిగో కొత్త జిల్లాలు అంటూ ఊరించారు. ఆ ముహూర్తం కోసం ఇప్పటిదాకా వేచి చూశారు. ఇప్పటికి గానీ ఆ ముహూర్తం రాలేదన్నమాట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మరో రెండు రోజుల్లోనే కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. 

ఇక జిల్లాల ఏర్పాటుకు క్రైటీరియాను కూడా జగన్ బాబు చాలా సింపుల్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వేరే పట్టణాల జోలికిి వెెళ్లకుండా కేవలం లోక్ సభ నియోజకవర్గాలనే ఎంచుకొని ఎంతో జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం. ఈ జాగ్రత్త పడడం ఎందుకంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల విషయంలోనూ అదేదో అద్భుత దీపంలా హైప్ క్రియేట్ చేసి అభాసుపాలయ్యారు. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి.. ఇంతకీ తమది ఏ జిల్లానో ఆ జిల్లావాసులకే తెలియనంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఈ జిల్లాల పెంపును ఓ ప్రసహనంగా మార్చి సొంత పార్టీ నేతల నుంచే గాక ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నాన్రా బాబూ అంటూ జుట్టు పీక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రాలో రాకుండా ఉండేందుకు జగన్ కాస్త ఆచితూచే అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే జిల్లాల విషయంలో ఎవరికీ విమర్శించే అవకాశం ఇవ్వకుండా ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని చెబుతున్నారు. ఆ లెక్కన 25 నియోజకవర్గాలకు 25 జిల్లాలవుతాయి. కాకపోతే దానికున్న విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగాా విభజించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో 13 జిల్లాలు కాస్తా 26గా ఏర్పడబోతున్నాయన్నమాట. మరి కొత్త జిల్లాలతో జగన్ ఏం సాధించబోతున్నారనేదే చాలా ఆసక్తి రేపుతున్న అంశం. 

జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల దృష్టి అంతా కూడా వాటి మీదికి మళ్లుతుంది. మీడియా కూడా జిల్లాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తుంది. దీంతో ఇప్పుడు విపరీతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత కాస్తా దారి మళ్లుతుంది. ఇది అన్నింటికన్నా జగన్ కు  టాప్ మోస్ట్ బెనిఫిట్ గా చెబుతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఉద్యోగుల్లో పెరిగిపోయిన వ్యతిరేకత నుంచి కాస్తయినా గట్టెక్కడం. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లి తీరతాం అంటున్న ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లోలోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పరిపాలన పడకేయడం ఖాయం. ప్రజా సమస్యలను అడ్రస్ చేసే నాథుడే లేకుండా పోతాడు. అదే జరిగితే జగన్ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారవుతుంది. అలాంటి ప్రమాదాలేవీ రాకుండా ఉండాలంటే జిల్లాల పెంపు మినహా గత్యంతరం లేదన్న అభిప్రాయానికి బిగ్ బాస్ వచ్చినట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలతో పాటు జిల్లా స్థాయిల్లో ఆయా శాఖలకు చెందిన అందరు ఇతర బాసులూ వస్తారు. ఒకవేళ సమ్మె కొనసాగితే గనక కొత్త క్యాడర్ ను ఆపద్ధర్మ విధి నిర్వహణ కింద వినియోగించుకునే వెసులుపాటు దొరుకుతుంది. ఆ తరువాత రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యను గురించి తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. 

ఇక జగన్ కొత్త సినిమా ఆశిస్తున్న మరో లాభమేంటంటే... కొత్త జిల్లాలకు కొత్త బాసుల మాదిరిగానే ఆయా జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పటికే  విపరీతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాష్ట్రాన్ని దివాళా తీయించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న జగన్ బాబుకు కేంద్రం నుంచి  అందే జిల్లా అభివృద్ధి నిధులు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. అదనపు అప్పుల కోసం అనుమతికి  ఇప్పటికే గొళ్లెం పెట్టిన ఢిల్లీ బాసులు కొత్త జిల్లాలు ఏర్పాటైతే నిధులు కేటాయించక తప్పదు. అలా వాటితో కొద్ది  రోజులపాటైనా నెట్టుకు రావచ్చు. కొత్త కార్యాలయాల ప్రారంభాలు, శంకుస్థాపనలు, రిబ్బన్ కట్టింగ్ లు అంటూ కొంతకాలం జరిగిపోతుంది. ప్రజలు కూడా తమకో కొత్త జిల్లా వచ్చిందన్న అంశాన్ని కొద్ది రోజులపాటైనా ఎంజాయ్ చేస్తారు. దీంతో జగన్ అండ్ టీమ్ కొంత రిలీఫ్ ఫీలయ్యే చాన్స్ దొరుకుతుంది. 

ఇక ఇటీవలే జగన్ జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న దృష్ట్యా జిల్లాకో ఎయిర్ పోర్టు అంటే 26 ఎయిర్ పోర్టులు అవుతాయి. ప్రయాణం సాగేది గాల్లోనే అయినా మరి విమానాశ్రయాలను కనెక్ట్ చేసేది రోడ్లే కదా. ఇప్పటికే ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. రోడ్లు బాగు చేయకుండా, వాటికి నిధులు కేటాయించకుండా విమానాశ్రయాలు మాత్రం నిర్మిస్తామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకుంటారు. పాత హామీలు ఇప్పటికే పడకేసిన పరిస్థితుల్లో కొత్త హామీలు, కొత్త జిల్లాలతో మరో కొత్త సినిమా తీయడం తప్ప జగన్ కు వేరే ప్రోగ్రామే కరవైందంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్ అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతిబా ఫూలే 200వ జయంతి వేడుకలు దేశరాజధానిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్లమెంటు ఆవరణలోని ప్రేరణా స్థల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశాధినేతలు, రాజకీయ దిగ్గజాలు ఒకే వేదికపైకి వచ్చారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు.
బీజేపీకి ఓటేస్తే.. సామాజిక న్యాయానికి పాడె కట్టడమేనన్నారు. రాష్ట్రంలోని బీజేపీని అడుగుపెట్టనీయవద్దని, ఒక్క సీటు కూడా వారికి ఇవ్వకుండా తమిళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పరకాల కోరారు.
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.