త్వరలో ఏపీలో కొత్త సినిమా.. కొత్త జిల్లాల జాతర..

Publish Date:Jan 25, 2022

Advertisement

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ లో  ఏపీలో కొత్త సినిమా ప్రారంభం కాబోతోంది. ఆ సినిమాతో వచ్చే ఊపుతో ఇప్పుడున్న వ్యతిరేకత అంతా కూడా వాషవుట్ అవుతుందని జగన్ అండ్ కో అంచనా వేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇంతకీ ఆ సినిమా ఇతివృత్తం ఏంటంటే ఆంధ్రాలో ఇప్పుడున్న 13 జిల్లాలను రెట్టింపు చేసే సరికొత్త ప్రక్రియ. అంటే ఏపీని 26 జిల్లాలుగా విభజించబోతున్నారన్నమాట. కొంతకాలంగా ఇవిగో కొత్త జిల్లాలు, అవిగో కొత్త జిల్లాలు అంటూ ఊరించారు. ఆ ముహూర్తం కోసం ఇప్పటిదాకా వేచి చూశారు. ఇప్పటికి గానీ ఆ ముహూర్తం రాలేదన్నమాట. అన్నీ అనుకున్నట్టు కుదిరితే మరో రెండు రోజుల్లోనే కొత్త జిల్లాల నోటిఫికేషన్ వెలువడడం ఖాయమని అత్యంత విశ్వసనీయంగా తెలుస్తోంది. 

ఇక జిల్లాల ఏర్పాటుకు క్రైటీరియాను కూడా జగన్ బాబు చాలా సింపుల్ గా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. వేరే పట్టణాల జోలికిి వెెళ్లకుండా కేవలం లోక్ సభ నియోజకవర్గాలనే ఎంచుకొని ఎంతో జాగ్రత్తపడుతున్నట్టు సమాచారం. ఈ జాగ్రత్త పడడం ఎందుకంటే గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల విషయంలోనూ అదేదో అద్భుత దీపంలా హైప్ క్రియేట్ చేసి అభాసుపాలయ్యారు. 10 జిల్లాలున్న తెలంగాణను 33 జిల్లాలుగా విభజించి.. ఇంతకీ తమది ఏ జిల్లానో ఆ జిల్లావాసులకే తెలియనంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. ఈ జిల్లాల పెంపును ఓ ప్రసహనంగా మార్చి సొంత పార్టీ నేతల నుంచే గాక ప్రజల నుంచి కూడా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొని.. ఎందుకీ నిర్ణయం తీసుకున్నాన్రా బాబూ అంటూ జుట్టు పీక్కునే పరిస్థితి తెచ్చుకున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఆంధ్రాలో రాకుండా ఉండేందుకు జగన్ కాస్త ఆచితూచే అడుగులు వేస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే జిల్లాల విషయంలో ఎవరికీ విమర్శించే అవకాశం ఇవ్వకుండా ప్రతి లోక్ సభ నియోజకవర్గాన్ని ఓ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే కసరత్తు దాదాపుగా పూర్తి కావచ్చిందని చెబుతున్నారు. ఆ లెక్కన 25 నియోజకవర్గాలకు 25 జిల్లాలవుతాయి. కాకపోతే దానికున్న విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్ నియోజకవర్గాన్ని రెండు జిల్లాలుగాా విభజించాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. దీంతో 13 జిల్లాలు కాస్తా 26గా ఏర్పడబోతున్నాయన్నమాట. మరి కొత్త జిల్లాలతో జగన్ ఏం సాధించబోతున్నారనేదే చాలా ఆసక్తి రేపుతున్న అంశం. 

జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజల దృష్టి అంతా కూడా వాటి మీదికి మళ్లుతుంది. మీడియా కూడా జిల్లాల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తుంది. దీంతో ఇప్పుడు విపరీతంగా ఎదుర్కొంటున్న ప్రభుత్వ వ్యతిరేకత కాస్తా దారి మళ్లుతుంది. ఇది అన్నింటికన్నా జగన్ కు  టాప్ మోస్ట్ బెనిఫిట్ గా చెబుతున్నారు. ఇక మరో ముఖ్యమైన అంశం ఉద్యోగుల్లో పెరిగిపోయిన వ్యతిరేకత నుంచి కాస్తయినా గట్టెక్కడం. ఫిబ్రవరి 7 నుంచి సమ్మెకు వెళ్లి తీరతాం అంటున్న ఉద్యోగ సంఘాల నేతలను బుజ్జగించినా ప్రయోజనం కనిపించడం లేదు. దీంతో వారిని ఎలా దారికి తెచ్చుకోవాలనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై లోలోపల చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పరిపాలన పడకేయడం ఖాయం. ప్రజా సమస్యలను అడ్రస్ చేసే నాథుడే లేకుండా పోతాడు. అదే జరిగితే జగన్ పరిస్థితి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టుగా తయారవుతుంది. అలాంటి ప్రమాదాలేవీ రాకుండా ఉండాలంటే జిల్లాల పెంపు మినహా గత్యంతరం లేదన్న అభిప్రాయానికి బిగ్ బాస్ వచ్చినట్లు చెబుతున్నారు. కొత్త జిల్లాలకు కొత్త కలెక్టర్లు, కొత్త ఎస్పీలతో పాటు జిల్లా స్థాయిల్లో ఆయా శాఖలకు చెందిన అందరు ఇతర బాసులూ వస్తారు. ఒకవేళ సమ్మె కొనసాగితే గనక కొత్త క్యాడర్ ను ఆపద్ధర్మ విధి నిర్వహణ కింద వినియోగించుకునే వెసులుపాటు దొరుకుతుంది. ఆ తరువాత రాష్ట్ర, జిల్లా స్థాయి ఉద్యోగుల సమస్యను గురించి తీరిగ్గా ఆలోచించుకోవచ్చు. 

ఇక జగన్ కొత్త సినిమా ఆశిస్తున్న మరో లాభమేంటంటే... కొత్త జిల్లాలకు కొత్త బాసుల మాదిరిగానే ఆయా జిల్లాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు వస్తాయి. ఇప్పటికే  విపరీతంగా అప్పుల ఊబిలో కూరుకుపోయి, రాష్ట్రాన్ని దివాళా తీయించి దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న జగన్ బాబుకు కేంద్రం నుంచి  అందే జిల్లా అభివృద్ధి నిధులు కొంతమేరకు ఉపశమనం కలిగిస్తాయని చెప్పవచ్చు. అదనపు అప్పుల కోసం అనుమతికి  ఇప్పటికే గొళ్లెం పెట్టిన ఢిల్లీ బాసులు కొత్త జిల్లాలు ఏర్పాటైతే నిధులు కేటాయించక తప్పదు. అలా వాటితో కొద్ది  రోజులపాటైనా నెట్టుకు రావచ్చు. కొత్త కార్యాలయాల ప్రారంభాలు, శంకుస్థాపనలు, రిబ్బన్ కట్టింగ్ లు అంటూ కొంతకాలం జరిగిపోతుంది. ప్రజలు కూడా తమకో కొత్త జిల్లా వచ్చిందన్న అంశాన్ని కొద్ది రోజులపాటైనా ఎంజాయ్ చేస్తారు. దీంతో జగన్ అండ్ టీమ్ కొంత రిలీఫ్ ఫీలయ్యే చాన్స్ దొరుకుతుంది. 

ఇక ఇటీవలే జగన్ జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న దృష్ట్యా జిల్లాకో ఎయిర్ పోర్టు అంటే 26 ఎయిర్ పోర్టులు అవుతాయి. ప్రయాణం సాగేది గాల్లోనే అయినా మరి విమానాశ్రయాలను కనెక్ట్ చేసేది రోడ్లే కదా. ఇప్పటికే ఏపీలో రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పన్లేదు. రోడ్లు బాగు చేయకుండా, వాటికి నిధులు కేటాయించకుండా విమానాశ్రయాలు మాత్రం నిర్మిస్తామనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఏపీ ప్రజలే నిర్ణయించుకుంటారు. పాత హామీలు ఇప్పటికే పడకేసిన పరిస్థితుల్లో కొత్త హామీలు, కొత్త జిల్లాలతో మరో కొత్త సినిమా తీయడం తప్ప జగన్ కు వేరే ప్రోగ్రామే కరవైందంటున్నారు విశ్లేషకులు.

By
en-us Political News

  
రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చారిత్రాత్మక విజయం సిద్ధించిన రోజిదని పేర్కొన్నారు. అమరావతి రైతుల త్యాగాలకు దక్కిన న్యాయమన్నారు. అమరావతి ఇప్పుడు కేవలం నగరం కాదు, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని బాలకృష్ణ పేర్కొన్నారు.
జములమడుగులో ఊహించిన దానికంటే అత్యధికంగా అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. వైసిపి అధ్యక్షుడు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి వైఖరిని తూర్పారబట్టారు.. ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మేలు పొందాలని ప్రయత్నిస్తున్నారంటూ జగన్ పై విమర్శలు కురిపించారు. పకృతిలో పంచభూతాల కూడా తన అధీనంలోనే ఉన్నాయని చెప్పుకునే పెను భూతంగా ఆయన జగన్ రెడ్డిని అబివర్ణించారు.
ఈ కీలక పరిణామం నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ఐదు కోట్ల ఆంధ్రుల చిరకాల కోరిక నేడు నెరవేరిందని పేర్కొన్నారు. అమరావతి చట్టానికి ఆమోదం తెలిపి రాష్ట్ర భవిష్యత్తుకు భరోసానిచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఏపీ ప్రజల తరఫున ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ చట్ట సవరణకు ఆమోదముద్ర వేయడంతో, కేంద్ర న్యాయశాఖ తుది నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరిణామంతో అమరావతికి పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభించినట్లయింది.
అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం ఉంది, దీని ఫలితాన్ని అనేక నిర్మాణాత్మక మరియు రాజకీయ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి.
కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం తన చోటుకు ఎసరు వస్తున్నదా అన్న అనుమానంతో.. ఆ కాపు నేత తానేనని చాటుకోవడానికి తన వంతు ప్రయత్నాలు మొదలెట్టేశారంటున్నారు. నేను సైతం అంటూ ఆయన రంగంలోకి దిగినట్లు వైసీపీ వర్గీయులే అంతర్గత సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. ఇందుకు తార్కానాలు కూడా చూపుతున్నారు.
ఉభయ సభలలో ఆమోదం పొందిన ఆ బిల్లు ఇప్పుడు దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వద్దకు చేరింది. ఇక ఆమె సంతకం పెట్టడానూ ఈ బిల్లు చట్టంగా మారుతుంది. ఆమె నేడో, రేపో ఈ బిల్లుపై సంతకం చేయడం ఖాయమని అంటున్నారు.
తమిళనాడులో 2026 ఎన్నికలు హోరాహోరీగా సాగే పోరుగా రూపుదిద్దుకుంటున్నాయి, ఇందులో స్పష్టమైన విజేత ఎవరూ లేరు. స్వల్ప ఓట్ల మార్పులు సీట్ల ఫలితాలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపవచ్చు.
రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉండటం మాత్రమే కాదని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని వైసీపీకి హితవు పలుకుతున్నట్లుగా మాట్లాడుతూనే.. ఆ పార్టీకి కర్తవ్యబోధ చేశారు.
బిజెపికి 1951లో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించిన భారతీయ జనసంఘ్‌తో పునాదులు పడ్డాయి. అక్క‌డి నుంచి ఈ పార్టీ అంచ‌లంచ‌లుగా ఎదిగి నేడీ స్థితికి చేరుకుంది. గ‌తంలో వాజ్ పేయి ఈ పార్టీకి అధికార వాస‌న రుచి చూప‌డంతో.. ఇప్పుడు వ‌రుస‌గా మూడు ప‌ర్యాయాల పాటు అధికారం చేజిక్కించుకుని.. ప్ర‌స్తుతం అప్ర‌తిహాత జైత్ర యాత్ర చేస్తోంది.
చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో ఎండలు మండిపోతాయి. వడగాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది.
రాఘవ్ చద్దా, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య తలెత్తిన అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ యుద్ధంగా మారాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.