పాత మిత్రులతో కొత్త పోత్తులు ?

Publish Date:Aug 11, 2022

Advertisement

ఉభయ తెలుగు రాష్ట్రాలలో రాజకీయం కొంచెం చాలా భిన్నంగా ఉంటుంది. రాజకీయ మీడియా సబంధాలు కుడా అంతే. అయిన దానికి  కాని దానికి మీడియా సందడి కొంచెం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదిగో తోక అంటే, అదిగో  పులి అనే ప్రచారం క్షణాల్లో రెండు రాష్ట్రాలను చుట్టేస్తుంది. అందుకే మీడియా కథనాలలో ఏది నిజం, ఏది కాదు? అనే విషయంలో ప్రజల్లో   అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగని మీడియా ప్రసారం చేసే ప్రతి కథనం కట్టు కథే అనుకోవలసిన అవసరం లేదు.  

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, సుదీర్ఘ విరామం తర్వాత, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్ళారు. ఆజాదీకా అమృత మహోత్సవ కార్యక్రమానికి సంబందించి ప్రధాని సారధ్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు ఒకరినొకరు పలకరించు కున్నారు. కొద్ది సేపు మాట్లాడుకున్నారు. నిజానికి అందులో విశేషం లేదు, అనుకోవచ్చును  కానీ, వుంది.  నిజమే, కారాణాలు ఏవైనా, ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కాక పోయినా, ఇద్దరి మధ్య దూరం అయితే వుంది. గత నాలుగు సంవత్సరాలలో ఒకరి నొకరు కలిసింది లేదు, మాట్లాడుకున్నదీ లేదు. సో, ఆవిధంగా ఆ ఇద్దరు ఏమి మాటలాడుకున్నారు, అనేది పక్కన పెట్టినా, ఆ ఇద్దరూ .. మాట్లాడుకున్నారు అనేదే, మంచి హెడ్లైన్ అవుతుంది. అయింది కూడా.

ఒకప్పుడు బీజేపీ, టీడీపీల మధ్య  సంబధాలు చక్కగా ఉన్న ఆ రోజుల్లో, అద్వానీ మొదలు మోడీ వరకు అనేక మంది బీజేపీ సీనియర్ నాయకులు,చంద్రబాబును విశ్వసనీయ మిత్రుడుగా అభివర్ణించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాగే, తెలుగు దేశం పార్టీ బీజేపీతో తెగతెంపులు చేసుకుని, ఎన్డీఎ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా, ప్రధాని మోడీ, చంద్రబాబును కానీ, తెలుగు దేశం పార్టీని గానీ టార్గెట్ చేసిన సందర్భాలు పెద్దగా లేవు. నిజానికి, 2019 ఎన్నికలుకు ముందు తెలుగు దేశం పార్టీ, కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిసి, ప్రధాని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంలో కూడా మోడీ, తెలుగు దేశం పార్టీని అంతగా టార్గెట్ చేయలేదు, జగన్మోహన్ విసిరిన ట్రాప్ లో చంద్రబాబు చిక్కుకున్నారని, మిత్ర ధర్మంగా హెచ్చరిక మాత్రమే చేశారు. రాజకీయ శత్రువుగా చూడలేదు.

గడచిన నాలుగు సంవత్సరాలలో రాష్ట్రంలో, దేశం రాజకీయ సమీకరణలు, రాజకీయ పరిస్థితులు, రాజకీయ వాతారణం మారిపోయినా, రాష్ట్రంలో  బీజేపీ, టీడీపీ నాయకులు ఒకరినొకరు విమర్శిం చుకున్నా,  ఒక్క మోడీనే కాదు, జాతీయ నాయకులూ ఎవరూ కూడా డైరెక్ట్ గా చంద్రబాబును టార్గెట్ చేసిన సందర్భాలు అంతగా లేవు. అలాగని, ఇద్దరి మధ్య గొప్ప స్నేహ సంబంధాలు ఉన్నాయని కాదు, కానీ, అవసరం అయితే మళ్ళీ చేతులు కలిపే అవకాశమే లేదనే పరిస్థితులు అయితే లేవు. అయితే, ఇప్పుడు లాంటి అవసరం వచ్చిందా, అవకాశం ఏర్పడిందా అంటే, అవునననే అనవలసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

అవును రాజకీయాల్లో శాశ్వత  అవసరాలే కానీ, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో సాగుతున్న జగన్మోహన్ రెడ్డి అరాచక, అకృత్య పాలన అంతమొందించేందుకు, బీజేపీ, జనసేన కుటమితో పొత్తును కోరుకుంటోంది. ఇందులో దాపరికం లేదు,. మరోవంక  గడచిన   రెండు మూడు సంవత్సరాలలో బీజేపీ  కీలక మిత్రపక్షాలు అన్నీ, ఎన్డీఏ నుంచి వెళ్లి పోయాయి. తాజాగా, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (జేడీయు) కూడా ఎన్డీఎ గూడు విడిచింది.  నిజమే, సంఖ్యా పరంగా చూసుకుంటే, మిత్రపక్షాలు వెళ్ళిపోయినా బీజేపీకి వచ్చిన నష్టం లేదు. బీజేపీకి సొంతంగానే, లోక్ సభలో కావలసిన సంఖ్యా బాలం వుంది. రాజ్యసభలోనూ కొంచెం అటూ ఇటుగా బీజేపీ సంఖ్యా బలం  మూడంకెల  సంఖ్యకు చేరుకుంది. లోపలి నుంచి బయటి నుంచి మద్దతు ఇచ్చే పార్టీలు ఎటూ ఉండనే ఉన్నాయి. మొన్నటి ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ విషయం తేలిపోయింది. పార్లమెంట్ ఉభయ సభల సభ్యులలో, ఓటు హక్కు  వినియోగించుకున్న700 మంది ఎంపీలలో 528 మంది (74.37 శాతం) బీజేపీ/ ఎన్డీఎ అభ్యర్ధి జగదీప్ ధన్ కర్కు ఓటేస్తే, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్ధి మార్గరెట్ మార్గరెట్ అల్వాకు కేవల 182 మంది ( 25.63) శాతం మంది మాత్రమే ఓటేశారు.

సో సంఖ్యా పరంగా చూసుకుంటే, మిత్రపక్షాలు శత్రు కూటమిలో చేరినా, బీజేపీ, ఎన్డీఎకు వచ్చే తక్షణ ముప్పు ఏమీ లేదు. కానీ, మిత్రులంతా వెళ్లి పోయారు, ఎన్డీఏ ఖాళీ అయింది అంటే, ప్రజల్లో పార్టీ ప్రతిష్ట కొంత మేర దిగజారే ప్రమాదం ఉంటుంది. అందుకే, బీజేపీ, మళ్ళీ పాత మిత్రులను దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టిందని, అందులో భాగంగానే, మోడీ మాజీ విశ్వసనీయ మిత్రుడు చంద్రబాబుతో ముచ్చట్లు మోదలు పెట్టారని అంటున్నారు.అయితే, ఇప్పటి కిప్పుడు మూడు ముళ్ళు పడిపోతాయని కాదు, కానీ, అటూ ఇటూ అన్నీ ఓకే అయితే, ఓ శుభ ముహూర్తాన పెళ్లి బాజాలు ... వినిపించినా వినిపిస్తాయి.

By
en-us Political News

  
మేడారంలో జరిగిన కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా సచివాలయంలో కాకుండా మేడారంలో కేబినెట్ సమావేశం ఏర్పాటైందన్నారు. ములుగు ఎమ్మెల్యే, మంత్రి సీతక్క ఇందుకు చొరవ తీసుకున్నారని, మేడారంలో కేబినెట్ భేటీ విషయంలో అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చారని వివరించారు.
దాదాపు 500 కిలోమీటర్ల ఈ పాదయాత్ర సాగనుంది. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తున్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అభిమానంతోనేనన్నారు. ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆశీస్సులతోనే ముందడుగు వేస్తున్నానని చెప్పారు.
ఇప్పటికే ఇదే కేసులో ఎంపీ మిధున్ రెడ్డిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన బెయిలుపై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీ లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని ఈడి అనుమానిస్తోంది. లిక్కర్ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల్లో హవాలా మార్గంలో భారీ ఎత్తున జరిగిన నగదు చలామణి లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఆరోపణలు ఉన్నాయి.
అవినీతి మరక ఉన్నప్పటికీ బీజేపీ ఎంట్రీకి అదేమంత అడ్డంకి కాదని గతంలో పలువురి విషయంలో రుజువైంది. అయితే మిథున్ రెడ్డి విషయంలో మాత్రం కమలనాథులు కండీషన్లు పెట్టారనీ, అందుకే మిథున్ రెడ్డి బీజేపీ ఎంట్రీకి బ్రేక్ పడటానికి కారణమంటున్నారు.
వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదరణతో ఎన్నికైన తర్వాత.. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా.. ఆ దేశ అధ్యక్షుడిని, అతడి భార్యని ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటనా లేకుండా ఎత్తుకుపోయిందని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు.
తెలంగాణ సీనియర్‌ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేవర తలచుకుంటే ఊరేం ఖర్మ దేశమే పేరు మార్చుకుంటుంది. భరతావని మనది. జండా పట్టుకుని చాలా చక్కగా నవ్వుతూ నిలబడి ఉంటుంది.
రాష్ట్రంలోని 121 మున్సిపాలిటీల్లో ఎస్టీలకు 5, ఎస్సీలకు 17, బీసీలకు 38 మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవులను కేటాయించారు. అలాగే మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
ఈ కేసులో విజయసాయి కూడా ఇప్పటికే సిట్, ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా ఈ నెల 22 విచారణకు రావాల్సిందిగా విజయసాయికి ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జగిత్యాల ఎమ్మెల్యే మాకనూరు సంజయ్ లపై స్పీకర్ నిర్ణయం తీసుకోవలసి ఉంది. ఈ ముగ్గురిలో కూడా దానం నాగేందర్ పరిస్థితి ఒకింత భిన్నంగా ఉంది. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ టికెట్ పై విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాకుండా, ఆ పార్టీ తరపఫున లోక్ సభ ఎన్నికలలో పోటీకి కూడా దిగారు.
ఎన్నికల నిర్వహణలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తీరు వల్ల ప్రజలలో ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం సడలిపోతోందని రాహుల్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ డుమ్మా కొట్టడమే ఈ ప్రచారానికి కారణం. ఈ నెల 13న పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన దహీ-చూరా విందుకు ఈ ఆరుగురు ఎమ్మెల్యేలూ గైర్హాజరయ్యారు.
బీఎస్పీ గతంలో నాలుగుసార్లు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తుచేస్తూ ..2027 ఎన్నికలలో ప్రజలు మరోసారి బీఎస్పీని అధికారంలోకి తీసుకురావాలని ఆశపడుతున్నారన్నారు. యూపీలో బీఎస్పీ ఐదో సారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను మాయావతి వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.