Publish Date:Aug 12, 2022
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తల్లి విజయమ్మకు గురువారం తృటిలో ప్రమాదం తప్పింది. ఆమె అనంతపురం జిల్లాలో ఓ వివాహనికి హాజరై.. హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో కర్నూలు నగర శివారులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఎడమ వైపు రెండు టైర్లు ఒక్కసారిగా బరస్టయ్యాయి. అయితే డ్రైవర్ వెంటనే అప్రమత్తమై.. కారు వేగాన్ని నియంత్రించడంతో.. పెను ప్రమాదం తప్పింది.
ఈ సంఘటన జరిగిన వెంటనే పలువురు విజయమ్మ క్షేమంగా ఉన్నందుకు ఊపిరి పీల్చుకుంటూనే ఆమెకు అంత పెద్ద ప్రమాదం ఎదురు కావడం పట్ల ఆందోళల వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు కొత్త కారు అదీ ఖరీరైన అత్యాధునిక హంగులు ఉన్న కారుకు ఒకే సారి రెంటు టైర్లు బరస్ట్ కావడమేమిటన్న అనుమానాలూ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే కొనుగోలు చేసి ఇంకా రిజిస్ట్రేషన్ కార్యక్రమాలు కూడా పూర్తికాని కారు టైర్లు రెండు ఒకే సారి బరస్ట్ కావడంపై సామాజిక మాధ్యమంలో నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవలే కొనుగోలు చేసిన టొయోటా వెల్లిఫైర్ కారు ఖరీదు కోటిన్నర అని చెబుతున్నారు. అలాంటి కార్లకు అసలు టైర్లు పేలే అవకాశాలు అతి తక్కువ అని వివరిస్తున్నారు. అదీకాక ఇటువంటి ఖరీదైన కార్లు ముందుగానే అన్ని టెస్టులూ చేసి, సేఫ్టీ మెజర్స్ అన్నీ సరిగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే డెలివరీ ఇస్తారని వాహన రంగ నిపుణులు అంటున్నారు. కొత్త టైర్లు బరస్టయ్యే అవకాశమే ఉండదనీ, అలాంటిది రెండు టైర్లు ఒకే సారి బరస్టవ్వడమేమిటని అంటున్నారు.
వైయస్ రాజశేఖరరెడ్డి భార్యగా, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ గౌరవ అధ్యక్షురాలిగా విజయమ్మకు ప్రజల్లో గౌరవ ఉంది. ఆమె కుమారుడు వైయస్ జగన్ ప్రస్తుతం ముఖ్యమంత్రగా ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయమ్మకు రక్షణగా ఓ ఎస్కార్టు వాహనం అయినా ఉండాలి.. లేకుంటే.. ఆమె భద్రత కోసం కనీసంలో కనీసం ఇద్దరు పోలీసులు అయినా ఉండాలని అయితే ఆమె ఎటువంటి భద్రతా సిబ్బందీ వెంట లేకుండా కేవలం ఇద్దరితో మాత్రమే ప్రయాణించడం పట్ల నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఒక వైపు ఏపీ కేబినెట్లోని మంత్రులకు జగన్ ప్రభుత్వం భద్రతను కట్టుదిట్టం చేసింది. అలాగే ఎమ్మెల్యేలకు సైతం గన్మెన్లను కేటాయించింది. ఎస్కార్ట్ కూడా కేటాయించింది. మరి అలాంటప్పుడు.. మాజీ సీఎం వైయస్ఆర్ భార్యగా, ప్రస్తుత సీఎం వైయస్ జగన్కి తల్లిగా.. ఓ మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వైయస్ విజయమ్మకు ఎటువంటి సెక్యూరిటీ లేకపోవడమేమిటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విజయమ్మ కారుకు జరిగిన ప్రమాదం తీరును గమనిస్తుంటే ఆమె ప్రణాలకు ముప్పు ఉందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/netizens-express-doubts-about-vijayamma-car-accidents-25-141821.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.