Publish Date:May 23, 2023
జార్ఖండ్ నదీ పరివాహక ప్రాంతంలోని
దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్లో పనిచేసిన బుద్నీ మెహజన్ సంతాలీ తెగకు చెందిన అమ్మాయి.వీళ్లది ప్రత్యేక కల్చర్. 1959 డిసెంబరులో అప్పటి ప్రధాన మంత్రి నెహ్రూ బుధ్ని పవర్ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. నెహ్రూ బుద్నీకి పూలమాల వేసి స్వాగతం పలికారు. పూల మాలతో చేసే సన్మానం వివాహం క్రింద పరిగణిస్తారు సంతాలీలు. సంతాలీ సంప్రదాయాల ప్రకారం, ఆమెకు నెహ్రూ పూలమాల వేయగానే భార్యగా మారిపోయింది. ఇది బుద్నీకి శాపం లా పరిణమించింది. సంతాలి సంప్రదాయం ప్రకారం నెహ్రూ భార్యగా ప్రకటించబడింది, ఒక వ్యక్తి ఒక స్త్రీకి పూలమాల వేయగానే ఆమెతో అతని వివాహం అయినట్టేనని పరిగణించాల్సి వస్తుంది.. సాంప్రదాయాల ప్రకారం, సంతాలీ యేతర వ్యక్తిని వివాహం చేసుకున్నందుకు ఆమెను సంఘం నుండి బహిష్కరించారు.
నేను ప్రధాని నెహ్రూకి పూలమాల వేయలేదని సంతాలి తెగవారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేసింది. నేను కేవలం అతనికి కరచాలనం ఇచ్చాను. ఈ చిన్న పొరపాటు వల్ల నేను మా గ్రామాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది అని అప్పట్లో బుధ్ని స్టేట్ మెంట్ ఇచ్చింది. నేను నా సంఘం నుండి బహిష్కరించబడ్డాను. నేను డివిసి పవర్హౌస్లో వర్కర్ని. అయితే, 1962లో డివిసి నన్ను ఉద్యోగం నుండి తొలగించింది. ”
1985లో అప్పటి ప్రధాని, నెహ్రూ మనవడు రాజీవ్ గాంధీ బుధ్ని కోసం వెతికారట. ఆ తర్వాత భిలాయ్లో తనను కలవాల్సిందిగా రాజీవ్ ఆహ్వానించారని కూడా ఓ కథనం ప్రచారంలో ఉంది. జవహర్లాల్ నెహ్రూకు సంబంధించిన పత్రాలను పరిశోధిస్తున్నప్పుడు రాజీవ్ కు బుధ్ని గురించి తెలిసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/nehru-mary-with-santaali-girl-25-155800.html
ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.
మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు. మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు.
సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు వైసీపీ కార్యకర్తలపై జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే. ఇప్పుడు జగన్ తాజాగా ఈ కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ నెల 16న పోలింగ్ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు.
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు
ప్రజాసమస్యలపై అధికారులతో చర్చిస్తారు. క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు.
ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో శుక్రవారం జరగనున్న సంక్రాంతి సంబరాల్లో పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.
ఈ భేటీలో చంద్రబాబు అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.
తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.
మోకిల నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఓ కారు మీర్జాగూడ వద్ద అదుపు తప్పి తొలుత డివైడర్ ను ఆ తరువాత చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతులు, క్షతగాత్రులు అందరూ విద్యార్థులే.
ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని మంత్రి లోకేష్ పరామర్శించారు.
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చక్రం తిప్పారు. కవిత ఎడ్యుకేటెడ్ కావడం, హిందీ కూడా బాగానే మాట్లాడగలగడంతో జాతీయ స్థాయి ప్రతినిథిగా ఉండేవారు. అయితే కవిత రెండో సారి ఎంపీగా గెలవలేక పోయారు