అందుకే ఆంధ్రా, తెలంగాణాలకి నిధులు విడుదల కాలేదా?

Publish Date:Nov 7, 2014

Advertisement

 

ఎన్డీయే ప్రభుత్వంలో తెదేపా భాగస్వామిగా ఉన్నప్పటికీ, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని కాంగ్రెస్, వైకాపాల ఆరోపిస్తున్నాయి. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారం చేప్పట్టి ఇప్పటికి ఐదు నెలలు పూర్తి కావస్తున్నప్పటికీ ఇంతవరకు నిధులు కానీ ఎటువంటి ప్రాజెక్టులు గానీ మంజూరు చేయకపోవడమే వారి వాదనలకు ఆధారం. అయితే కేంద్రం మరే ఇతర రాష్ట్రాలకు కూడా ఇంతవరకు నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేసిన దాఖలాలు లేవనే సంగతి ప్రతిపక్షాలు ప్రస్తావించకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అన్యాయం జరిగిపోతోందన్నట్లు మాట్లాడుతున్నారు. కానీ పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకొని తెలంగాణాపట్ల సవతితల్లి ప్రేమ చూపిస్తోందని చేసిన ఆరోపణలు, ఆంద్రప్రదేశ్ పట్ల కేంద్రం చాలా సానుకూలంగా ఉందని స్పష్టం అవుతోంది. ఆ కారణంగానే రేపు జరుగబోయే కేంద్రమంత్రివర్గ విస్తరణలో రాష్ట్రంలో తన పార్టీకి కాక, తెదేపాకు ప్రాధాన్యం ఇచ్చారు.

 

రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నిటినీ ఖచ్చితంగా అమలుజేస్తామని, రాష్ట్రాన్ని అన్ని విధాల ఆదుకొంటామని ప్రధాని మోడీతో సహా కేంద్రమంత్రులు అందరూ కూడా పదేపదే స్పష్టం చేస్తున్నారు. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ప్రభుత్వ విధి విధానాలను, వ్యవస్థలను సమూలంగా ప్రక్షాళనం చేసి, దేశాన్నిఅభివృద్ధి పధంలో పరుగులు తీయించాలని తపిస్తున్నారు.

 

ఆ ప్రయత్నంలోనే అయన కొన్ని మంత్రిత్వ శాఖలను విలీనం చేయడం, అనవసరమయిన కమిటీలను రద్దు చేయడం వంటి పెనుమార్పులు చేస్తున్నారు. చివరికి దశాబ్దాల నాటి ప్రణాళికా సంఘాన్ని కూడా ఆయన రద్దు చేసి, దాని స్థానంలో దేశావసరాలకు, అభివృద్ధికి దోహదపడే సరికొత్త ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఒకవిధంగా కేంద్రప్రభుత్వం ఇప్పుడు సంధికాలంలో ఉందని చెప్పవచ్చును.

 

బహుశః ఈ మార్పులు చేర్పులు కారణంగానే, విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంతవరకు ప్రత్యేకహోదా, నిధులు, ప్రాజెక్టులు మంజూరు చేయడంలో ఆలస్యం జరుగుతోందని భావించవచ్చును. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఈ విషయాన్ని ప్రజలకు వివరించకుండా, హామీలు అమలు చేస్తామని చెపుతుండటం వలన ప్రతిపక్షాలకు ఈ అవకాశం దక్కిందని చెప్పవచ్చును. వారి ఆరోపణల కారణంగానే ప్రజలలో కూడా అనుమానాలు తలెత్తుతున్నాయని చెప్పవచ్చును.

 

ప్రజలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల పట్ల అనుమానాలు లేవనెత్తడంలో ప్రతిపక్షాలు సఫలమయితే దాని వలన ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే సంగతి ప్రభుత్వం గుర్తించి, నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యానికి కారణాలను ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే మంచిది. లేకుంటే ప్రతీ అంశం నుండి రాజకీయ మైలేజీ పొందాలని చూసే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఈ అంశంపై కూడా మైలేజీ పొందాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తారని చెప్పడానికి నేడు ఆయన డిల్లీ యాత్రే ఒక ఉదాహరణ.

 

హుడ్ హూద్ తుఫాను భాదితుల కోసం మోడీ ప్రకటించిన రూ.1000 కోట్లు పరిహారం తక్షణమే విడుదల చేయాలని ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరేందుకు బయలుదేరుతున్నట్లు సమాచారం. ఆ తరువాత రాష్ట్ర ప్రభుత్వం విఫలమయితే తానే కెన్ద్రమ్పైఒత్తిది తెచ్చి రాష్ట్రానికి నిధులు విడుదల చేయించానని చెప్పుకొన్నా ఆశ్చర్యం లేదు. అందువలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా నిధులు, ప్రాజెక్టుల మంజూరులో ఎందువలన జాప్యం జరుగుతోందో ప్రజలకి వివరించే ప్రయత్నం చేయడం మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.