గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై స్వతంత్ర దర్యాప్తునకు జాతీయ మహిళా కమిషన్ ఆదేశం

Publish Date:Aug 12, 2022

Advertisement

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో.. తెలుగు రాష్ట్రాల్లో రేపిన రచ్చ అంతా ఇంతా కాదు.  దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ చెబుతున్న మాటలు.. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఒకటికి  రెండు సార్లు మీడియాతో మాట్లాడిన మాటలకు ఎక్కడా పొంతన లేకుండా ఉన్నాయని జనం అభిప్రాయపడుతున్నారు.

అలాగే వారి మాటల్లోని తేడాను సామాజిక మాధ్యమం సాక్షిగా నెటిజన్లు ఏకి పడేస్తున్నారు. అలాగే  తెలుగుదేశం పార్టీ కూడా ఈటెలలాంటి ప్రశ్నలు సంధిస్తూ వైసీపీపి ఉక్కిరి బిక్కిరి చేసేస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ సర్కార్ లోని ఇద్దరు మహిళా మంత్రులూ కూడా గోరంట్లకు మద్దతుగా మాట్లాడటంతో నెటిజన్లు ట్రోలింగ్ కు గురి అవుతున్నారు. అయినా జగన్ సర్కార్, వైసీపీ పార్టీ అంతా నాఇష్టం.. ఏం చేసినా అడిగేదెవరు అన్న రీతిలో వ్యవహరిస్తోంది. అయితే ఇక గోరంట్ల వ్యవహారంలో ఇక ఆ పరిస్థితి  ఉండే అవకాశం లేదని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంలో కేంద్ర పెద్దలకు ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసిందని హస్తిన నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఎంపీ జస్పీర్ సింగ్ గిల్ ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.

ప్రధానికీ, జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ కూ లేఖలు రాశారు. అక్కడితో ఆగకుండా గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం కారణంగా ఎంపీ అంటే మేల్ ప్రాస్టిట్యూట్ అని అందరూ అనుకునే పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.    ప్రజాస్వామ్య వ్యవస్థకు మూల స్తంభమైన పార్లమెంట్‌లో ఇటువంటి వ్యక్తులు అడుగు పెట్టడానికి అనర్హులని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారని అంటున్నారు. ఈ వీడియో వ్యవహారంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంపీ గిల్ కోరారని అంటున్నారు.  

ఎంపీ గిల్ ఫిర్యాదుపై జాతీయ మహిళా కమిషన్ స్పిందించి,  న్యూఢ్ వీడియో కాల్ వ్యవహారంపై  తగిన చర్యలు తీసుకోవాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ లేఖ రాసినట్లు తెలిసింది.  అలాగే ఈ వ్యవహారంపై స్వతంత్ర్య దర్యాప్తు జరిపి.. సాధ్యమైనంత త్వరగా మహిళా కమిషన్‌కు నివేదిక ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ డీజీపీకి  రేఖా శర్మ లేఖ రాశారు. దీంతో జగన్ ప్రభుత్వం తమ పార్టీ ఎంపీ అని చూసీ చూడనట్లు  ఊరుకుందామనుకున్నా.. ఎదురుదాడితో ఈ వ్యవహారంలో విపక్షాల నోరు నొక్కుద్దామనుకున్నా ఇక వీలయ్యే అవకాశం లేదు. సాంకేతికంగా వీడియో ఒరిజనలా, ఫేకా అని తేల్చడం సాధ్యం కాదంటూ అనంతపురం ఎస్పీతో ప్రభుత్వం చెప్పించినా.. కేంద్రం తలచుకుంటే ఎస్పీ మాటల డొల్ల తనం కూడా వెల్లడైపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కేంద్రం న్యూడ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని నిగ్గు తేల్చాని బావిస్తే వైసీపీ బుకాయింపులకు అవకాశం ఉండదని పరిశీలకులు అంటున్నారు.  దీంతో ఇప్పుడు వైసీపీకి, జగన్ సర్కార్ లో మాధవ్ కు మద్దతుగా మాట్లాడిన వారికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దంటూ సీబీఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలంటూ జగన్ సీబీఐ కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.
జగన్ సామ్రాజ్యంగా చెప్పుకునే కడప లోక్ సభ స్థానంలో ఈ సారి ఆయన పార్టీ మూడో స్థానానికే పరిమితం కానుందా? అంటే స్థానికులు ఔననే అంటున్నారు. ఈ లోక్ సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల రంగంలోకి దిగడంతోటే ఇక్కడ వైసీపీ గ్రాఫ్ దిగజారడం ఆరంభమైంది.
ఆంధ్రప్రదేశ్ లో ప్రచార పర్వం ఈ శనివారం (మే 11) సాయంత్రంతో ముగియనుంది. అంటే నిండా మూడు రోజుల వ్యవధి కూడా లేదు. ఈ దశలో రాష్ట్రంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా సీని పరిశ్రమ వారు రంగంలోకి దిగి పిఠాపురంలో జనసేనాని పవన్ కల్యాణ్ కు మద్దతుగా పెద్ద ఎత్తున ప్రచార రంగంలోకి దూకడంతో అక్కడి వాతావరణం సందడిగా మారిపోయింది.
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే అమ‌రావ‌తిపై, పగబట్టినట్టుగానే పోలవరంపై కూడా పగబట్టారు. ఆ పనులను నిలిపివేయించారు. కాంట్రాక్టర్లను బెదిరించి పక్కకు తప్పించారు. రివర్స్ టెండర్లు అంటూ పెద్ద డ్రామా నడిపించి.. తమకు అత్యంత దగ్గరివారైన మేఘా కంపెనీకి కాంట్రాక్టును కట్టబెట్టారు. రివర్స్ టెండరింగ్ వ్యవహారం ద్వారా ఇన్ని కోట్ల రూపాయలు ఆదా చేశామంటూ మాయమాటలు వల్లించారు. అప్పటి నుంచి పోలవరం పనులు పూర్తిగా పడకేశాయి.
చింతమనేని విజయం ఖాయమని స్థానికులు అనుకుంటున్నారు. ఈ సారి, లండన్ బాబును లండన్ పంపించి, తనకు ప్రజలు నలభై వేల మెజార్టీ ఇస్తారని నమ్మకంతో చింత‌మ‌నేని ఉన్నారు. మే 13న జరిగే ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ గెలుపును ఎవరూ ఆపలేరని ఆయ‌న ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో జగన్ చెబుతున్న అబద్ధాలు విని జనం చీదరించుకుంటున్నారు. వీటికంటే ఎక్కువ ఇరిటేషన్ కలిగిస్తున్న అంశం..
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఒక్క‌సారికూడా మీడియా ముందుకు రాలేదు. తెలుగు మీడియా అంటే ఆయ‌న‌కు చిరాకు కాబోలు.. ఛీఛీ నేనా.. తెలుగు మీడియాతో మాట్లాడ‌ట‌మా అన్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌వ‌ర్త‌న ఉంటుంది. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయినా నిత్యం కాక‌పోయినా తరచుగా మీడియా స‌మావేశాలు ఏర్పాటుచేసి ప్ర‌భుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై వివ‌రిస్తుంటారు.
కొట్టు సత్యనారాయణ ఏపీ దేవాదాయ శాఖ మంత్రి, తాడేపల్లిగూడెం శాసనసభ్యుడు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు
అభివృద్ధి జ‌ర‌గాలంటే ఆయుధం ఓటు.. ప్ర‌జా పాల‌న సాగాలంటే ఆయుధం ఓటు.. అవినీతి ప్ర‌భుత్వాల‌ను కుప్ప కూల్చాలంటే ఆయుధం ఓటు.. క‌క్ష‌పూరిత పాల‌న సాగిస్తున్న ప్ర‌భుత్వం మెడ‌లు వంచాల‌న్నా ఆయుధం ఓటే.. మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బాగుండాలంటే ఆయుధం ఓటు.. ఆ ఆయుధం మ‌న చేతుల్లోనే ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లయ్యింది. ఈ పదేళ్లలో విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు ప్రభుత్వాలను చూశారు. విభజన అనంతరం జరిగిన తొలి ఎన్నికలలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం విజయం సాధించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు.
తెలుగువన్ రూపొందించిన పొలిటికల్ స్పూఫ్ షార్ట్ ఫిలిమ్ గ్యాంగ్స్ ఆఫ్ గగన్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో వుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.