నేడు కొత్త... రేపటికి పాతేనా...!
Publish Date:Oct 1, 2012
Advertisement
జాషువాను జాతీయకవిగా గుర్తించేలా కేంద్రానికి తగు సిఫార్సులు చేస్తామని ఉపముఖ్యమంత్రి, తెలుగు అకాడమీ అధ్యక్షుడు దామోదర రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా తెలుగు అకాడమీలో జాషువా పరిశోధనా పీఠాన్ని ఏర్పాటుచేశామన్నారు. జాషువా 117వ జయంతి ఉత్సవాలు నిర్వహణ సందర్భంగా ‘జాషువా సాహితీ పురస్కారాలు`2012’ ప్రదానోత్సవంలో ఆయన ఈ మాటలన్నారు. అదే జరిగితే ప్రతి తెలుగువాడు ఎంతగానో సంతోషిస్తాడు. అయితే అది అమలు జరిగేనా అన్న అనుమానం అభిమానులకు కలుగుతోంది. ఎందుకంటే తెలుగువాడు అంటే కేంద్రానికి చాలా చిన్నచూపు. దీనికి తోడు తెలుగువారికి తెలుగువాడే శత్రువు అన్న కొత్త సామెతను సైతం చాలా సార్లు నిజం చేశారు. దేశంలోనే అత్యధికులు మాట్లాడే రెండో పెద్ద భాషగా గుర్తింపువున్న తెలుగును ఆ స్థాయిలో కేంద్రం గౌరవిస్తోందా... అధికారభాషగా వున్న మన రాష్ట్రం పూర్తిగా అమలుచేస్తోందా.. ఇటువంటివాటిపై ఇప్పటికే ఎన్నో సందేహాలు, వాస్తవాలు ఎంతోమంది పెద్దలకు తెలియనికావు. మరి ఇప్పుడు జాషువా వంటి కవికి జాతీయకవిగా గుర్తించేలా చేస్తారా అన్నది అనుమానం. మహాకవులుగా జనహృదయాల్లో నిలిచిపోయి, జాతికి, తెలుగుకు ఘనకీర్తిని తెచ్చిన ఎందరో కవులున్నారు. అంతేందుకు అందరూ చదివే ప్రతిజ్ఞను తెలుగువాడే వ్రాశాడని ఈ మధ్యనే తెలిసింది. వందమాతరం, జనగణమనలకు ఆయా రచయితల పేర్లున్నట్లే ప్రతిజ్ఞకు దాన్ని వ్రాసిన మన తెలుగాయన పేరు ఉండేలా కృషి చేస్తే మరింత ఆనందిస్తారు. అప్పుడు చెప్పడమే తప్ప, ఆ తర్వాత పట్టించుకోని మనవారి నైజం అందరికి తెలిసిందే కనుక నేటికి కొత్త రేపటికి పాత అన్నట్లుగా ఉంటుందని తెలుగుభాషా ప్రేమికులు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వాస్తవాలు ఆలోచిస్తే....నిజానికి నిజం అంతేనేమో!
http://www.teluguone.com/news/content/national-poet-gurram-joshua--deputy-chief-minister-24-17784.html
సుబ్రతో రాయ్ అరెస్ట్ ...
ఖరారైన రాష్ట్రపతి పాలన ...
రాష్ట్రపతి పాలనకే మొగ్గు ...
విఫలమైన 'టి' కాంగ్రెస్
చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు.
తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు.
తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది.
జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు.
వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది.
చంద్రబాబు తెలంగాణా జిల్లలో పాదయాత్ర చేస్తునంత కాలం తన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని, తన నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని అయన ఎంత తీవ్రంగా విమర్శించినా స్పందించని కొడాలి నాని, చంద్రబాబు ఇప్పుడు తన కృష్ణా జిల్లాలో పాదయాత్ర చేస్తూ అదే విధంగా విమర్శలు చేసినప్పుడు మాత్రం వెంటనే స్పందించారు.
రాష్ట్ర రాజధానిలోఇందిరా పార్క్ వద్ద నేటి నుండి 36గంటల సమరదీక్షను నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న తెలంగాణా జేయేసీ నేతలు, పోలీసు ఆదేశాలను
నిర్విరామంగా సాగుతూ 117వ రోజుకు జేరుకొన్నచంద్రబాబు పాదయాత్ర ఈరోజు కృష్ణా జిల్లాలో పరిటాలకు చేరుకొంది. ముందు అనుకొన్న ప్రకారం అయితే ఈ రోజుతో ఆయన పాదయాత్ర ముగించాల్సి ఉంది. అయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు మరియు వైద్యులు కూడా పాదయాత్ర ముగించమని కోరినప్పటికీ చంద్రబాబు తన పాదయాత్రను కొనసాగించడానికే నిశ్చయించుకొన్నారు.
తెలంగాణా జేయేసీ అద్వర్యంలో సికిందరాబాద్ లో ఇందిరా పార్క్ వద్ద 36గంటల సమరదీక్షకు అనుమతి కోరుతూ జేయేసీ నేతలు హోంమంత్రి సబితా ఇంద్రరెడ్డికి వినతిపత్రం సమర్పించగా, కొద్దిసేపటిలోనే వారికి అనుమతి నిరాకరిస్తున్నట్లు పోలీసుల నుండి వెంటనే లేఖ అందడంతో తెలంగాణావాదులు కిరణ్ కుమార్ రెడ్డి మీద, పోలీసుల మీద మండిపడ్డారు.





