‘జాతీయ అజెండా, ప్రాంతీయ జెండా’ ఇదే కేసేఆర్ యాత్రల అజెండా

Publish Date:May 27, 2022

Advertisement

మరో రెండు మూడు నెలలు ఆగండి, మీకో సంచలన వార్త చెపుతా .. గురువారం  బెంగుళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామితో భేటీ అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన మరో సంచలన ప్రకటన ఇది. 

ఇంతకీ ఆయన ఏమన్నారంటే, “జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు. రెండు మూడు నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది” అని మీడియాకు చెప్పారు.అయితే ఆ సంచలన ప్రకటన ఏమిటో, ఆయన మనసులో ఏముందో మాత్రం ఆయన బయట పెట్టలేదు. కానీ, ఆయన బెంగుళూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన తర్వాత, కుమార స్వామి అసలు గుట్టు విప్పేశారు. అదేమంటే, వడ్ల గినజలో బియ్యపు గింజ...

కేసీఆర్ చాలా కాలంగా చెపుతున్న ప్రాంతీయ పార్టీల కూటమి ఏర్పాటు ముచ్చటే, ఆ ‘సంచలన’ వార్తని కుమార స్వామి చెప్పారు.  “ప్రాంతీయ పార్టీలన్నీ విబేధాలను పక్కనపెట్టి జాతీయ ప్రయోజనాల రీత్యా ఏకతాటిపైకి వచ్చేస్తాయి, కేసీఆర్‌ చొరవతో భారత భవిష్యత్తుకు పునాదులు వేస్తాయి” అని కుమార స్వామి చెప్పు కొచ్చారు. అందుకు ఆయన ముహూర్తం కూడా ఖరారు చేశారు. దేశమంతా విజయదశమి జరుపుకొనే రోజుల్లోనే విజయవంతమయ్యే సంచలన ప్రకటన రానుందని కుమారస్వామి అన్నారు. 

అయితే ఇదేమన్నా కొత్త ప్రకటనా అంటే కాదు, 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి కేసీఆర్ ఇదే చెపుతున్నారు. అంతే కాదు, అయన తాను స్వయంగా  చెప్పిన ఫ్రంట్ ఏర్పాటును ఆయనే, ఫ్రంటూ లేదు టెంటు లేదంటూ ఖండించారు. నిజానికి, జాతీయ రాజకీయాల్లో కీలక భూమిక గురించి ముఖ్యమంత్రి కేసీఆర్’కు కూడా స్పష్టత లేదని, అయన ప్రకటనలే సూచిస్తున్నాయి.  అదలా ఉంటే గత ఐదారు  నెలలుగా జాతీయ రాజకీయాల పై దృష్టి కేంద్రీకరించైనా కేసీఆర్ , దేశవ్యాప్త రాజకీయ యాత్రలు చేస్తున్నారు, అయితే, ఎందుకనో గానీ, ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏమి చేసినా, ఏదో ఒక అపశకునం అనాలో ఇంకేమనాలో కానీ ,అనుకున్న యాత్ర అనుకున్నట్లు సాగడం లేదు.

గత వారం ఢిల్లీ వెళ్ళిన సమయంలో ఆయన అక్కడినుంచి అటే పంజాబ్, ఢిల్లీ, కర్ణాటక మీదుగా మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధి, షిర్డీ వెళ్లి  అన్నా హజారే, షిర్డీ సాయిబాబాలను దర్శించుకుని, 28 తేదీకి గానీ హైదరాబాద్ తిరిగి రారని అన్నారు. కానీ, ఈ యాత్రలో, ఒకటికి రెండు బ్రేకులు పడ్డాయి. ఢిల్లీ టూర్’కు సంబంధించి ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 25 వరకు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండాల్సింది. అటు తర్వాత బెంగళూరు, రాలేగావ్ సిద్ధి, షిర్డీ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ, రెండు రోజుల ముందుగా మే 23నే ఆయన  అకస్మాత్తుగా హైదరాబద్ తిరిగి వచ్చారు.

ఇప్పుడు మళ్ళీ గురువారం ( మే 26) ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటిస్తున్న సమయంలోనే, బెంగుళూరు వెళ్లారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం బెంగళూరు నుంచి ఆయన శుక్రవారం (మే 27న) మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్దికి వెళ్లి, సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలవవలసి ఉంది. ఆపై శిరిడీలో సాయిబాబాను దర్శించుకొని హైదరాబాద్ తిరిగిరావాల్సిఉంది. కానీ కేసీఆర్ అనూహ్యంగా బెంగళూరు పర్యటన ముగియగానే నేరుగా హైదరాబాద్ తిరిగొచ్చారు. 

నిజానికి, జాతీయ రాజకీయాలకు సంబంధించి కేసీఆర్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. ఢిల్లీకి ముందే, తమిళనాడు, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాలు పర్యటించి, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులను, ఎన్సీపీ అదినేత పవార్ వంటి సీనియర్ నాయకులను కలిసి  కాంగ్రెస్ యేతర, బీజేపీ యేతర ఫ్రంట్ ఏర్పాటు గురించి చర్చించి వచ్చారు.

అయితే, ఆ చర్చలు ఏవీ ఫలించలేదు. కాంగ్రెస్ ’చేయి’ వదిలేది లేదని పవార్ నుంచి స్టాలిన్ వరకు అందరూ స్పష్టం చేయడంతో, కేసీఆర్ స్వరం  మార్చి మరో రూట్’లో వెళుతున్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితిలో కేసీఆర్ ఆశిస్తున్నట్లుగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావడం అయ్యే పనేనా  అంటే, రాజకీయ విశ్లేషకులు, 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలు ఏకం కావడం అయ్యే పని కాదనే అంటున్నారు.అయితే, కేసీఆర్’కు ఈవిషయం తెలియదా అంటే, తెలియదాని కాదు, కానీ, లోక్ సభ ఎన్నికలకంటే ముందు వచ్చే అసెంబ్లీ ఎన్నికల గండం గట్టేక్కే ఎత్తుగడలో భాగంగానే ఆయన. 2018లో ప్లే చేసిన ట్రిక్’నే మళ్ళీ మరోమారు ప్లే చేస్తున్నారని, అంటున్నారు. అందుకే కేసీఆర్ ప్రస్తుత రాజకీయాని, ‘జాతీయ అజెండా,  ప్రాంతీయ జెండా’ గా పేర్కొంటున్నారు.

By
en-us Political News

  
సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్.. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే.. 2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
ఈసీ ఆదేశాల మేరకు కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.
ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే.. క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.
పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.
విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు. ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.
వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన ముద్రగడ.. కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు. అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.
ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్ రాగం అందుకున్నారని విమర్శించారు.
పైపెచ్చు.. జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు. కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.
ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది.
ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు.
ఈ అరెస్టు పై బీఆర్ఎస్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావు అరెస్టు సందర్భంగా పోలీసులకు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. గురుకులాల్లో అవినీతి, రాష్ట్ర అప్పులపై గన్ పార్క్ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, అజారుద్దీన్‌.. బీఆర్‌ఎస్‌ నేతలు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు సవాల్‌ విసిరారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.