మోడీ పాలనపై భిన్నాభిప్రాయలకు కారణం ఏమిటి?

Publish Date:Nov 2, 2015

Advertisement

 

మోడీ ప్రభుత్వం ప్రస్తుతం చాలా విచిత్రమయిన పరిస్థితులు ఎదుర్కొంటోంది. ప్రపంచ దేశాలన్నీ మోడీ నామస్మరణ చేస్తుంటే, దేశంలో కొందరు మేధావులు మోడీ అధికారంలోకి వచ్చేక భావ ప్రకటన స్వేచ్చకు భంగం కలుగుతోందని, దేశంలో మత అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ తమ అవార్డులను వెనక్కి తిరిగి ఇచ్చేస్తున్నారు. దేశంలో చాలా మంది ప్రజలు, విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయులు మోడీ నేతృత్వంలో భారత్ చాలా వేగంగా అభివృద్ధి పధంలో దూసుకుపోతోందని దృడంగా విశ్వసిస్తుంటే, దేశంలో కొంతమంది ప్రజలు మోడీ ప్రభుత్వం దేశాభివృద్ధి కంటే అభివృద్ధి జరిగిపోతున్నట్లు గట్టిగా ప్రచారం చేసుకోవడానికే పరిమితం అయిందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

 

సార్వత్రిక ఎన్నికలు మొదలు జమ్మూ కాశ్మీర్ ఎన్నికల వరకు బీజేపీ విజయపధంలో సాగిపోతుండటం గమనిస్తే మోడీ పరిపాలన పట్ల ప్రజలలో సదాభిప్రాయమే ఉందని అర్ధమవుతుంది. ప్రస్తుతం జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు దశలలో ‘అభివృద్ధి’ ప్రదానాంశంగా మారడానికి కారణం కూడా అదేనని చెప్పుకోవచ్చును.

 

బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వామ పక్షాలు, కాంగ్రెస్ తదితర పార్టీలు ఇంతకు ముందు భూసేకరణ చట్టంతో మోడీ ప్రభుత్వాన్ని చావు దెబ్బతీయాలని ప్రయత్నించి భంగపడ్డాయి. బీజేపీని ఇటువంటి రాజ్యాంగ, సాంకేతిక, ఆర్ధిక, పరిపాలనా పరమయిన అంశాలతో ఎదుర్కోవడం కష్టమని గ్రహించిన కాంగ్రెస్ దాని మద్దతుదారులు బీజేపీకి ఉన్న మతతత్వ ముద్రనే హైలైట్ చేస్తూ దానితోనే మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నట్లు కనబడుతోంది. అందుకే దేశంలో ఎక్కడ హిందుమతోన్మాదులు పేట్రేగిపోయినా దానిని మోడీ ప్రభుత్వానికి లింక్ చేస్తూ అందరూ కలిసికట్టుగా గట్టిగా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. కొందరు సాధువులు, ఆర్.ఎస్.ఎస్. నేతల వివాదాస్పద వ్యాఖ్యలు, ముంబాయిలో శివసేన ఆగడాలు చాలా శృతి మించిపోవడంతో మోడీ ప్రభుత్వ వ్యతిరేకులు చేస్తున్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది.

 

ఇదివరకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా దేశంలో చాలాసార్లు మత ఘర్షణలు జరిగాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటనలు చాలాసార్లు జరిగాయి కానీ వాటిని కాంగ్రెస్ (యూపిఏ) ప్రభుత్వానికి ఆపాదించబడలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి సెక్యులర్ ముద్ర సంపాదించుకొంది కనుకనే అని చెప్పక తప్పదు. కానీ కాంగ్రెస్ పాలనలో కూడా లెక్కలేనన్ని కుంభకోణాలు జరిగాయి. అవినీతి సర్వత్రా వ్యాప్తి చెందింది. మహిళలపై సామూహిక అత్యాచార ఘటనలు జరిగాయి. ప్రపంచ దేశాల దృష్టిలో భారత్ పరువు ప్రతిష్టలు మంటగలవడం అప్పటి నుంచే మొదలయింది. కాంగ్రెస్ పార్టీని “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” కారణంగానే  ఇంత కాలం దేశ ప్రజలు భరిస్తూ వచ్చేరు. కానీ దాని వలన వినాశనమే తప్ప అభివృద్ధి జరుగలేదనే సంగతి రుజువవడంతో అభివృద్ధిని కాంక్షిస్తూ దేశ ప్రజలు మోడీకి పట్టం కట్టారు.

 

ఆయన పరిపాలనలో కూడా కొన్ని తప్పులు ఉండవచ్చును లేదా జరుగుతుండవచ్చును కానీ కాంగ్రెస్ పాలనతో పోలిస్తే మోడీ పాలన వంద రెట్లు మెరుగయినదని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎప్పటికప్పుడు దేశ అవసరాలకి తగ్గట్లుగా అనేక సంస్కరణలు చేస్తూ పాలనలో చురుకుదనం తెచ్చారు. బంగ్లాదేశ్ తో దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్యలను పరిష్కరించారు. భారత్ సైనికులు దశాబ్దాలుగా అడుగుతున్న 'ఒకే హోదా-ఒకే పెన్షన్' డిమాండ్ ని నెరవేర్చారు. అనేక రాష్ట్రాలలో ఉన్నత విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో మారుమూల ప్రాంతాలకు విద్యుత్, రోడ్లు తదితర ప్రాధమిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. దేశంలో అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆదాయంలో వాత పెంచి ఇచ్చారు. ఆర్ధిక, పారిశ్రామిక ప్రగతిలో అభివృద్ధి సాధిస్తున్నారు. ప్రపంచ దేశాలలో వ్యాపారానికి అనుకూలమయిన దేశాలలో భారత్ స్థానం 140 నుండి 132కి చేరుకోవడమే దేశ పరిస్థితుల్లో మార్పు మొదలయిందని, దానిని యావత్ ప్రపంచం గుర్తించిందని విస్పష్టంగా తెలియజేస్తోంది.

 

ఒకవేళ మోడీ ప్రభుత్వం ఇదే వేగంగా దేశాభివృద్ధి సాగించినట్లయితే వచ్చే ఎన్నికల సమయానికి వాటి ఫలితాలు ప్రజలకు ప్రత్యక్షంగా కనబడతాయి. అప్పుడు ఇక బీజేపీని, మోడీని గద్దె దించడం అసంభవం కనుకనే దేశంలో ఇతర సమస్యల గురించి, మాట్లాడకుండా...పోరాడకుండా కేవలం “మత స్వేచ్చ-కుహానా సెక్యులరిజం” అనే అంశాలకి హైప్ క్రియేట్ చేస్తున్నారు. గురించి మాత్రమే మాట్లాడుతున్నారని భావించవచ్చును. ఒకవేళ మోడీ ప్రభుత్వం నిజంగానే ప్రజల మత స్వేచ్చను, భావ ప్రకటన స్వేచ్చను హరించే ప్రయత్నం చేస్తే దానిని ఏవిధంగా రక్షించుకోవాలో దేశప్రజలకు బాగా తెలుసు. దేశంలో జరిగే చెదురుముదురు సంఘటనలను, బీజేపీ అనుబంధ పార్టీలు, నేతలు చేసే వివాదాస్పద వ్యాఖ్యలను, తప్పులను హైలైట్ చేసి చూపిస్తూ దేశంలో పెద్ద అనర్ధం జరిగిపోతోందన్నట్లు, పెద్ద ఉపద్రవం ముంచుకు వస్తున్నట్లు కాంగ్రెస్ దానికి మద్దతు పలికే కొందరు మేధావులు దేశ ప్రజలను తప్పు ద్రోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు.

 

మోడీ ప్రభుత్వాన్ని దెబ్బ తీయాలని వారు చేస్తున్న ఈ ప్రయత్నాల వలన, ప్రపంచ దేశాలలో భారత్ పట్ల మళ్ళీ ఒక దురాభిప్రాయం ఏర్పడే ప్రమాదం ఉందనే సంగతి ‘సో కాల్డ్ మేధావులు’ విస్మరించడం చాలా శోచనీయం. వారి దుష్ప్రచారాన్ని నమ్ముతున్నవారు దేశంలో నిజంగానే అటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయా? లేక తమ చుట్టూ ఏమయినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయా లేదా? అని స్వయంగా పరిశీలించి చూసుకొన్న తరువాతనే మోడీ ప్రభుత్వం గురించి ఒక అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడం మంచిది.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.