సభలో నవ్వులు పూయించిన ‘నేషన్ ఫస్ట్’ డైలాగ్..!

Publish Date:Aug 17, 2026

Advertisement

 

ఏపీ అసెంబ్లీలో సత్యకుమార్, లోకేష్ సరదా సంభాషణ..! 

అమరావతి శాసనసభలో రాజకీయ చర్చల మధ్య కాసేపు సరదా వాతావరణం నెలకొంది. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, సత్యకుమార్ మధ్య సాగిన ఆసక్తికర సంభాషణ సభలో నవ్వులు పూయించింది.
మంత్రి సత్యకుమార్‌ను ఉద్దేశించి నారా లోకేష్ సరదాగా మాట్లాడుతూ.. “సత్యకుమార్‌కి  ప్రత్యేకంగా బీజేపీ కండువా అవసరం లేదు.. మీరు బీజేపీ అని లోకమంతా తెలుసు కదా!” అంటూ చమత్కరించారు. దీంతో సభలో చిరునవ్వులు విరిశాయి. లోకేష్ వ్యాఖ్యలకు మంత్రి అచ్చెన్నాయుడు కూడా తనదైన శైలిలో జత కలిశారు. 

“జాతీయ స్థాయిలో ప్రముఖ నేతల్లో సత్య ఒకరు” అంటూ ప్రశంసించారు. ఇంతలో లోకేష్ మరో పంచ్ వేశారు. “మా పార్టీ వారికి కూడా కాస్త క్రమశిక్షణ నేర్పించండి” అంటూ సత్యకుమార్‌ను ఉద్దేశించి అనడంతో సభలో నవ్వులు మరింత పెరిగాయి. అదే సమయంలో ఓ టీడీపీ ఎమ్మెల్యే “పార్టీ ఫస్ట్” అంటూ కలగజేసుకున్నారు. 

దీంతో సత్యకుమార్ వెంటనే స్పందిస్తూ.. “నేషన్ ఫస్ట్.. పార్టీ నెక్స్ట్.. సెల్ఫ్ లాస్ట్” అంటూ తన సమాధానంతో అందరి దృష్టిని ఆకర్షించారు. సత్యకుమార్ చెప్పిన ఈ ఒక్క మాటతో సరదా సంభాషణకు ఆసక్తికరమైన ముగింపు లభించింది. పార్టీ కంటే దేశ ప్రయోజనాలే ముందు అనే సందేశాన్ని ఆయన స్పష్టం చేయడంతో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య మరోసారి నవ్వులు వెల్లువెత్తాయి. రాజకీయ వేడి మధ్య సభలో కాసేపు చోటుచేసుకున్న ఈ సరదా సంభాషణ.. సభ్యుల మధ్య స్నేహపూర్వక వాతావరణాన్ని ప్రతిబింబించింది.

Nara Lokesh, Satya Kumar Yadav, AP Assembly, Minister Atchennaidu, TDP BJP Alliance,
Andhra Pradesh Politics, Amaravati Legislative Assembly


 

By
en-us Political News

  
గత నెల  25న సీవాన్ ప్రాంతంలోని  జేపీ చౌక్ సమీపంలో  విద్యార్థులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టిన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఆందోళనకారులను అదుపు చేసే క్రమంలో విధుల్లో  పోలీస్  అభిషేక్ కుమార్   ఏకే47తో కాల్పులకు తెగబడ్డాడు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందని ట్రంప్ ఆ పోస్టులో విస్పష్టంగా పేర్కొన్నారు,  అక్కడ సముద్ర మార్గంలో ఇరాన్  గతంలో అమర్చిన   మైన్‌ లు అన్నింటినీ అమెరికా బలగాలు పూర్తిగా తొలగించాయని ట్రంప్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఆ సమావేశం అనంతరం అదే రోజు రాత్రి ఆయన ఢిల్లీ నుంచే నేరుగా లండన్  బయలుదేరతారు.
దేశంలో పెట్టుబడుల  ఆకర్షణలో   నవ్యాంధ్రప్రదేశ్  రికార్డు స్థాయి పురోగతి  సాధించింది. పెట్టుబడుల ఆకర్షణలో గత కొన్నేళ్లుగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు    రాష్ట్రాలు ఆధిపత్యం కొనసాగుతున్నది. అయితే వాటిని తోసి రాజని ఆంధ్రప్రదేశ్ రెండో స్థానానికి ఎగబాకింది. 
వైద్య నివేదికల ప్రకారం ఇమ్రాన్ తీవ్రమైన గుండె దడ,   రక్తపోటు,  మానసిక ఒత్తిడి సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లు అల్వీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆయనను వెంటనే జైలు నుంచి బయటకు తరలించి,   ఆధునిక ఆసుపత్రిలో స్వతంత్ర వైద్యుల బృందం పర్యవేక్షణలో మెరుగైన చికిత్స అందించాల్సిన అవసరం  ఉందని ఆరిఫ్ అల్వీ చెబుతున్నారు.  
పలు మార్లు ఇండియాపై అంతర్జాతీయ వేదికలపై ఆరోపణలు చేసి, కాశ్మీర్ విషయంలో ఇండయాపై అంతర్జాతీయ వేదికలపై విమర్శలు చేసి భంగపడిన పాకిస్థాన్ కు తాజాగా ఆప్నిస్థాన్ లోని తాలిబన్ ప్రభుత్వం దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అయ్యేలా కౌంటర్ ఇచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI అభివృద్ధికి అల్గారిథమ్‌ల కంటే కరెంట్, భూమి, మౌలిక వసతులే అసలైన సవాలుగా మారాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ వెల్లడించారు. ఓపెన్ ఏఐ భాగస్వామ్యంతో 4.25 గిగావాట్ల సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న భారీ ఏఐ ఫ్యాక్టరీ వివరాలు, టెక్నాలజీ భవిష్యత్తు గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
కింగ్‌డమ్ హార్ట్స్ 4 Kingdom Hearts 4 ల్యాట్ 2027 రిలీజ్ డేట్ ఖరారైంది! డిస్నీ కోకో , స్టార్ వార్స్, బాంబీ, మోఆనా వంటి 6 కొత్త ప్రపంచాలు మరియు D23 ట్రైలర్ విశేషాలను తెలుగులో తెలుసుకోండి.
ఈజిప్ట్‌లోని లక్సార్‌లో ఉన్న పురాతన తీబన్ సమాధి ఆధారంగా ప్రాచీన ఈజిప్షియన్ల అంత్యక్రియల సంస్కృతి, మమ్మీకరణ ఆచారాలు మరియు కాలక్రమేణా వాటిలో వచ్చిన మార్పుల గురించి ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
కేరళ బాక్సాఫీస్ వద్ద లోకేష్ కనగరాజ్ డీసీ చిత్రం రూ.16.5 కోట్ల గ్రాస్‌తో 2026లో హయ్యెస్ట్ గ్రాసింగ్ తమిళ సినిమాగా నిలిచింది. విజయ్ జన నాయగన్ రికార్డును బ్రేక్ చేస్తూ రూ.100 కోట్ల క్లబ్ దిశగా దూసుకెళ్తున్న పూర్తి బాక్సాఫీస్ విశ్లేషణ ఇక్కడ చదవండి.
BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ ఆటగాడు ఆయుష్ శెట్టి సంచలనం సృష్టించాడు. బెంగళూరులో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత పోరులో ప్రపంచ నెం.1, డిఫెండింగ్ ఛాంపియన్ షి యూకీని 21 14, 13 21, 21 19 తేడాతో ఓడించి చారిత్రక విజయం సాధించాడు. పూర్తి కథనం ఇక్కడ చదవండి.
GIC Re మొదటి త్రైమాసిక Q1FY27 ఆర్థిక ఫలితాలలో ప్రీమియం వృద్ధి మందగమనం, పెరుగుతున్న అండర్ రైటింగ్ నష్టాలు మరియు IRDAI కొత్త నిబంధనల ప్రభావంపై సమగ్ర విశ్లేషణ.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.