మురుగునీటికి మోక్షం..!

Publish Date:Dec 21, 2016

Advertisement

ప్రస్తుతం ప్రపంచదేశాలను ముంచెత్తుతున్న ప్రధాన సమస్య నగరీకరణ . అభివృద్ధికి మార్గంగా, ఒక పర్యాయపరంగా ఇది మారిపోయింది. అలాగే అవకాశాల మెరుగుదలకు, ఆర్థికాభివృద్ధి నగరాల్లో ఉండాలని ప్రజలు నమ్మే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు నగరాలకు చేరుకుంటున్నారు. వీరి రాకతో నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతుల కొరత తీవ్రమవుతోంది..చివరకు నగర జీవితం అంతుచిక్కని, అర్థంకాని సమస్యల వలయంలోకి ప్రజలను తీసుకువెళుతోంది. ఇవ్వాళ..దేశంలో ప్రధాన నగరాలన్నీ మురికివాడల సమస్యతో సతమతమవుతున్నాయి. ఇరుకు సందులు, ప్రణాళిక లేని కట్టడాలతో గాలి, వెలుతురు కూడా సరిగా ప్రసరించని పరిస్థితుల్లో మురికివాడలన్నీ దుర్భరమైన జీవన పరిస్థితులకు సాక్షి భూతాలుగా నిలుస్తున్నాయి.

 

ఇది పక్కనబెడితే అస్థవ్యస్థమైన డ్రైనేజ్ వ్యవస్థ నగరజీవికి ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఇటీవల చెన్నై, హైదరాబాద్‌లలో వచ్చిన వరదలు దీనికి ఉదాహరణ. నీళ్లమధ్య ద్వీపాలుగా మారిన అసంఖ్యాక అపార్ట్‌మెంట్లు గమనిస్తే చాలు..అంతులేని నిర్లక్ష్యం మాటున కబ్జాలు..కాసుల వేటలు కనిపిస్తాయి. చెరువులు, నాలాలు, నదీతీరాలు కబ్జాలకు గురైన తీరు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది.  ఇదంతా ఒక ఎత్తైతే సగటు మనిషి తాగడానికి కూడా నీరు లభించని స్థితిలో ఉన్నది..గుక్కెడు నీరు కోసం గంటల తరబడి పడిగాపులు కాసే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్రప్రభుత్వం పరిష్కారం దిశగా చర్యలు ప్రారంభించింది. మురుగు సమస్యను తీర్చడంతో పాటు వాటిని రీసైక్లింగ్ చేసి తాగునీరుగా మార్చే ప్రణాళికలో భాగంగా అమృత్ పథకాన్ని తీసుకువచ్చారు ప్రధాని మోడీ. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు.

 

ఎంపిక చేసిన నగరాల్లో మౌలిక సదుపాయాల కల్పన, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి నిధులను కేటాయిస్తారు. కేంద్ర పథకాలను అన్ని రాష్ట్రాల కంటే బాగా వినియోగించుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలోనూ ముందే ఉన్నారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో మురుగునీటి శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు. మురుగు రూపంలో వృథాగా పోతున్న1.08 కోట్ల లీటర్ల నీటిని శుద్ధి చేసి వాడుకుంటే భూగర్భ జలాల రక్షణతో పాటు, వ్యవసాయ అవసరాలకు ప్రతిసారి ఆకాశం వైపు చూడాల్సిన అవసరం ఉండదు.

 

తొలి దశలో రాష్ట్రంలోని 12 నగరాలు, పురపాలక సంఘాల్లో మురుగునీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నారు. అవి శ్రీకాకుళం, రాజమండ్రి, కాకినాడ, ఒంగోలు కార్పోరేషన్లు, తెనాలి, మచిలీపట్నం, చిలకలూరిపేట, కావలి, మదనపల్లి, కడప, ధర్మవరం, గుంతకల్ పురపాలక సంఘాలున్నాయి. ఇప్పటికే ఈ 12 ప్రాంతాల నుంచి సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించడం, వాటికి కేంద్రం నిధులు మంజూరు చేయడం కూడా పూర్తయ్యింది. మిగిలిన సాంకేతికపరమైన పనులు ముగించి, వచ్చే ఏడాదిలోపు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరించిన ఏపీ ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసి నీటి కరువును నివారించాలని చూస్తోంది. ఏదేమైనా నీటిబొట్టును సద్వినియోగం చేసుకుని దిశగా ముందడుగు వేయడం శుభపరిణామం.

By
en-us Political News

  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు.
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్ రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది. 80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది. ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు...
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది...
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో  తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. 
​సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది...
జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు.
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు...
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి...
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  
నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.