వైసీపీలో నాని సీన్ అయిపోయిందా?.. బేలమాటలు అందుకేనా?!

Publish Date:Mar 9, 2024

Advertisement

గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కోడాలి నానికి భవిష్యత్తు దర్శనం బాగానే అయినట్లుంది. అందుకే.. ఇవే తన చివరి ఎన్నికలంటూ... ఆయన.. తన నియోజకవర్గ ప్రజలకు చాలా సాఫ్ట్‌గా.. కాదు కాదు బేలగా చెబుతున్నారు. ఎలాగోలా గెలిపించి పుణ్యం కట్టుకోండంటూ అన్యాపదేశంగా బతిమలాడుకుంటున్నారు.  నిన్న మొన్నటి వరకు అది అసెంబ్లీ అయినా, మీడియా సమావేశమైనా ఎక్కడైనా, ఎప్పుడైనా నాని నోరెత్తారంటే..  ఆడు చెప్పాడా?.. ఈడు చెప్పాడా? ఆ డమ్మా మొగుడు చెప్పాడా? అంటూ బండ బూతులతో చెలరేగిపోయేవారు. అలాంటి నాని నోట సాఫ్ట్ గా ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బేలగా ఇవే నా చివరి ఎన్నికలు వంటి మాటలు రావడం చూస్తుంటే ఆయనకు ఏదైనా బోధివృక్షం కనిపించిందా? దాని కింద కూర్చోవడంతో జ్ణానోదయం అయి తత్వం బోధపడి బొమ్మకనిపించిందా అన్న అనుమానాలు వైసీపీ శ్రేణులలోనే వ్యక్తం అవుతున్నాయి.  

రానున్న ఎన్నికల్లో గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి మండల హనుమంతరావు పేరును పార్టీ అధినేత జగన్ పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే  గుడివాడ నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది.  ఇటీవల గుడివాడ పట్టణంలో... రాత్రికి రాత్రే నియోజకవర్గానికి కాబోయే ఎమ్మెల్యే మండల హనుమంతరావు అంటూ భారీ ఫ్లెక్సీలు   వెలిశాయి. ఈ హాఠాత్  పరిణామంతో కొడాలి నాని వర్గం ఒక రేంజ్‌లో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. అంతే కాదు తీవ్ర నిరాశలో కూరుకుపోయింది.   దాంతో ఈ అంశాన్ని నాని  తాడేపల్లి ప్యాలెస్‌  పెద్దలకు తెలియజేశారు. ఇక వారి నుంచి  వచ్చే సమాధానం కోసం ఆయన, ఆయనతో పాటు ఆయన వర్గం ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే    కొడాలి నాని  నిర్వేదంలో కూరుకుపోయి.. ఇవే తన చివరి ఎన్నికలంటూ మాట్లాడారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

ఇప్పటికే గుడివాడ నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. 2004, 2009లో టీడీపీ నుంచి గెలిచిన కొడాలి నాని ఆ తర్వాత జగన్ పార్టీలో చేరి.. 2014, 2019లో ఆ పార్టీ ఎమ్మెల్యేగా  గెలుపోందారు.  2019లో  జగన్ పార్టీ అధికారంలోకి రావడంతో.. ఆయన కేటినెట్‌లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. మంత్రిగా కొడాలి నాని  ఎలా వ్యవహరించారో.. ఎలా మాట్లాడారో అందరికీ తెలిసిందే. దీంతో   పౌరసరఫరాల శాఖ మంత్రి కాదు.. బూతు సరఫరాల శాఖ మంత్రి అంటూ  కొడాలి నానిపై సోషల్ మీడియాలో  నెటిజనులు విపరీతంగా ట్రోల్ చేశారు.  
అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన కొడాలి నాని ఇప్పుడు ఇలా  చాలా సాఫ్ట్‌గా.. ఇంకా చెప్పాలంటే.. తనకు వయస్సైపోయిందనీ,  53 ఏళ్లతాను ఈ సారి ఎన్నికల్లో గెలిస్తే.. 58 ఏళ్ల వరకు ఎమ్మెల్యేగా ఉంటానని.. ఆ తర్వాత అంటే.. 2029 ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. అదే సమయంలో వ్యూహాత్మకంగా  తన కుమార్తెలు రాజకీయాల్లోకి రారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా.. తన రాజకీయ వారసుడిగా తన తమ్ముడు కొడాలి చిన్ని కుమారుడు వచ్చే అవకాశం ఉందంటూ సంకేతం ఇచ్చారు. మొత్తం మీద కొడాలి నాని బేల మాటలు వైసీపీలో ఆయన సీన్ అయిపోయిందన్న సంకేతాలు ఇస్తున్నాయన్న చర్చ జోరందుకుంది. 

అదీకాక కొడాలి నాని అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారనే ఓ ప్రచారం ఓ వైపు జరుగుతుండగా.. మరోవైపు ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఆసుపత్రికి వచ్చి వెళ్తున్న దృశ్యాలు సైతం ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఆ క్రమంలోనే కొడాలి నాని ఇవి తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారనే ఓ చర్చ సైతం ఊపందుకొంది.   

ఏదీ ఏమైనా మిర్చిలాగా ఎప్పుడు హాట్ హాట్‌ కామెంట్స్ చేసే కొడాలి నాని.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఇవే తనకు చివరి ఎన్నికలనీ.. ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ.. చాలా సాఫ్ట్‌గా మాట్లాడడం చూస్తుంటే.... ఎక్కడో ఏదో తేడా కొడుతుందని.. కానీ అది అంతగా అంతు బట్టకుండా ఉందనే ఓ చర్చ సైతం గుడివాడ నియోజకవర్గంలో వైరల్ అవుతోంది. అదీకాక ఇప్పటికే ఇదే డైలాగ్ ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సైతం వాడారని.. కృష్ణాజిల్లా వాసులు ఈ సందర్బంగా గుర్తు చేస్తున్నారు. 

మరోవైపు తెలంగాణలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగిన పాడి కౌశిక్ రెడ్డి.. కమలాపుర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ..  మీరు ఓటు వేసి దీవిస్తే.. 4వ తేదీన ఎమ్మెల్యేగా జైత్ర యాత్ర చేస్తా.. లేకుంటే శవయాత్ర చేసుకుంటాం... మా కుటుంబ సభ్యులం ముగ్గురు ఆత్మహత్య చేసుకంటామంటూ ఓ సెంట్‌మెంట్ ఆయుధాన్ని ఉపయోగించి.. ఎమ్మెల్యేగా ఆయన గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారని... ఈ తరహా ట్రిక్స్‌ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం ఉపయోగించే అవకావం ఉందనే ఓ చర్చ సైతం వైరల్ అవుతోంది. అదీకాక కొడాలి నాని.. తన రాజకీయ వారసుడిని సైతం ఈ సందర్బంగా చెప్పకనే చెప్పారనే ఓ చర్చ సైతం నియోజకవర్గంలో హల్‌చల్ చేస్తోంది.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.