చావుతో చెట్టా ‘పట్టాల్‌’...

Publish Date:Dec 29, 2013

Advertisement

 

 

 

అనంతపురంలో మరో ఘోరప్రమాదం. రైలు పట్టాలపై మ్రత్యుఘోష. తెల్లవారుజాము సమయంలోనే 26 జీవితాలు తెల్లవారిపోయాయి. ఆ తర్వాత ఏమి జరిగింది? ముఖ్యమంత్రి నుంచి ప్రధానమంత్రి దాకా అందరూ సంతాపం వ్యక్తం చేశారు. రైల్వే మంత్రి కాస్త తీరిక చేసుకుని వచ్చి పోయినోళ్లను ఎలానూ తేలేం కాబట్టి తలా రూ.5లక్షల నష్టపరిహారం, ప్రమాదంపై కమిటీ వేస్తానని ప్రకటించేసి వెళ్లిపోయారు. రోజంతా బుగ్గయిన బోగీ చుట్టూ కెమెరా తిప్పి తిప్పి, వాయిస్‌ ఓవర్‌లు చెప్పిచెప్పి అలసిపోయిన మీడియా ఫ్రెండ్స్‌ కూడా శాంతించారు. పొద్దున్నే ఇంటికి వస్తారని చూస్తున్న తమవారు రారని, ఇక వచ్చే అవకాశమే లేదనే విషయం ఇక ఇప్పుడు సంపూర్ణంగా అర్థం అవుతున్న దశలో... చనిపోయిన వారి కుటుంబాలలో ఎన్ని కళ్లు కన్నీళ్ల సముద్రాలు కడతాయో... ఎన్ని ఇళ్లు అతలాకుతలం అవుతాయో... ఎన్ని జీవితాలు చిందరవందరగా మారతాయో... రైలెక్కడం అనేది ఇంత పెద్ద నేరమా? అని ఎంతమంది భయపడిపోతారో...


గత కొన్నేళ్ళుగా వరుస ప్రమాదాలు జరుగుతున్నా రైల్వేశాఖగాని, కేంద్రప్రభుత్వం గాని తమకు చీమ కుట్టినట్టయినా లేదని తరచు నిరూపించుకుంటూనే ఉంది. ప్రత్యక్షంగా జరిగే నష్టాన్ని మాత్రమే చూస్తున్న ‘పై’ వారికి పరిహారం ఇస్తే సరిపోతుందనిపిస్తుందేమో... కాని ఈ తరహా ప్రమాదాల కారణంగా తలెత్తే అనుబంధ కష్టాలు ప్రభుత్వాలకు అర్థమైతే... ఈపాటికే రైల్వేశాఖ పటిష్టమైన చర్యలు ప్రకటించేంది. కాలయాపన కమిటీలు, పరిహారాలతో ప్రజల్లో పేరుకుపోతున్న అభధ్రతాభావాన్ని పెంచడం మానేసేది.



    తెల్లవారుజామునే జరుగుతున్న ప్రమాదాలు కనురెప్పపాటులో మనిషిని ‘మసి’చేస్తున్న కారణాలను శరవేగంగా అన్వేషించే యత్నం ఇప్పటికీ జరగడం లేదు. గతంలో వేసిన కమిటీల సిఫార్సులు ఏమయ్యాయో తెలీదు. రైల్వేలో సుశిక్షుతులైన సిబ్బంది నియామాకం ఎందుకు చేయరో తెలియదు. అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందితో నెట్టుకు రావడం వల్ల కలుగుతున్న నష్టాలపై విశ్లేషణ లేదు. రైళ్లు ఢీ కొనడం సంఘటనలు తగ్గి, అగ్నిప్రమాదాలు ఎందుకు పెరిగాయో అర్థం చేసుకునే ప్రయత్నం లేదు. అనిల్‌కకోడ్కర్‌ కమిటీ సిఫార్సులు అమలు చేయరు గాని మరిన్ని కమిటీలు వేసి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తూ ఉంటారు. ప్రమాదాలు జరగనే కూడదని, జరగవని ఎవరం అనం... అయితే ఒక ప్రమాదం మరిన్ని ఘోరాలు జరగకుండా అరికట్టేందుకు దోహదపడాలిగా... అది కూడా జరగకపోవడమే రైలు పట్టాలతో చావును చెట్టాపట్టాలేయిస్తోంది. ఓల్వో బస్సుల నుంచి రైలు బోగీల దాకా బుగ్గిగా మారేందుకు కారణమవుతోంది.

 

By
en-us Political News

  
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కున్నారు.
జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.
తెలంగాణ గ్రామ పంచాయితీ ఎన్నికల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి ఘన విజయం సాధించారు.
తాజాగా కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ.
ఇంతకీ రేవంత్ ఢిల్లీ ఎందుకు వెళ్లారంటే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ జన్మదినం గురువారం. తన 85వ జన్మదినాన్ని పురస్కరించుకుని రాజకీయ ప్రముఖులను బుధవారం రాత్రి విందు ఇచ్చారు. ఆ విందుకు తెలంగాణ సీఎం రేవంత్ హాజర్యారు.
బోరుగడ్డ అనిల్ కు కష్టాలు మొదలయ్యాయి. కేసులు చుట్టుముట్టాయి. అరెస్టై జైలుకు వెళ్లి వచ్చాడు కూడా. జైలుకు వెళ్లిన సమయంలోనూ, ఆ తరువాత బయటకు వచ్చి మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలలోనూ కూడా బోరుగడ్డ అనిల్ పదేపదే తనకు జగన్ అండ ఉందని చెప్పుకొచ్చారు.
అమరావతికి నాబార్డు నుంచి రూ.7,380.70 కోట్ల రుణం తీసుకునేందుకు కేబినెట్ ఆమెదం ఇవ్వనుంది. అదే విధంగా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్రవేసే అవకాశం ఉంది.
ల్గొండ జిల్లా కొర్లపహాడ్‌ గ్రామంలో పోలింగ్ సందర్భంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడ్డారు.
ఉదయం ఏడుగంటలకు ప్రారంభమైన పోలింగ్, మధ్యాహ్నం ఒంటి గంట వరకూ జరుగుతుంది. ఇందు కోసం 37 వేల 552 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తొలి విడతలో 56 లక్షల 19 వేల 430 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
తన ఎన్నికల చిహ్నమైన కత్తెర గుర్తు జెండాను పట్టుకుని అల్లు అర్జున్ చేత ప్రచారం చేయిస్తున్నారు. ఆగండాగండి వాస్త
త్రిపురకుండ్రం ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో తొలి క్షేత్రంగా భాసిల్లుతోంది. అయితే ఈ కొండ‌కు ద‌గ్గ‌ర్లో ఒక ద‌ర్గా ఉంటే.. ఆ ద‌ర్గాకి సమీపంలో ఒక రాతి స్తంభం ఉంటుంది. ఆ రాతి స్థంభంపై త‌మిళ కార్తీక దీపం పెట్ట‌డం అనాదిగా వ‌స్తోన్న ఆచారం.
ఈ నెల 11న మొదటి విడత పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో తొలి విడతలో జరిగే పంచయతీల ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.