బాలయ్యబాబు ఎన్నికలో పోటీకి సిద్ధమేనా ?

Publish Date:Mar 23, 2013

Advertisement

 

ఈ రోజు నందమూరి బాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లా లావుకొత్తూరు మండలానికి చెందిన తునికి సమీపంలోగల తలుపులమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ అదేశిస్తే రాబోయే ఎన్నికలలో రాష్ట్రంలో ఎక్కడి నుంచయినా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. విశాఖ జిల్లాకు చెందిన పాయకరావు పేటలో ఆయన స్వర్గీయ యన్టీఆర్ విగ్రహం ఆవిష్కరించారు.

 

బాలకృష్ణ గత కొంత కాలంగా పార్టీ రాజకీయ వ్యవహారాల పట్ల కొంత ఆసక్తి కనబరుస్తున్నపటికీ, ఇంతవరకు ఆయన పూర్తి స్థాయి పాత్ర నిర్వహించేందుకు మాత్రం చొరవ చూపలేదు. ఆయన కుటుంబానికి ఎంత రాజకీయ నేపద్యం ఉన్నపటికీ, ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి కనబరుస్తునందున, వ్యక్తిగతంగా ఆయన పార్టీ మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల పట్ల అవగాహన పెంచుకోవలసి ఉంది. సాధారణ ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది గనుక, ఆయనకీ నిజంగా రాజకీయాల పట్ల ఆసక్తి గనుక ఉంటే, మరిక జాప్యం చేయకుండా వెంటనే రంగంలోకి దిగి ఈ ఏడాది కాలాన్ని తన ‘రాజకీయ ఎప్రoటిస్’ కాలంగా భావించి తగిన అవగాహన పెంచుకొంటే మంచిది. అది ఆయనకే కాకుండా ఆయన పార్టీకి కూడా మేలు చేయవచ్చును. కానీ, ఆ ప్రయత్నం చేయకుండా ఈ విధంగా ప్రకటనలు చేయడం అసందర్భ ప్రకటనలుగా పరిగణింపబడుతాయి.

 

కేవలం నందమూరి వంశస్తుడవడమే పార్టీ నుండి టికెట్ ఆశించేందుకు, ఎన్నికలలో పోటీ చేసేందుకు ప్రధాన అర్హతలని భావించకుండా, అందుకు తగిన వ్యక్తినని నిరూపించుకొని పోటీ చేయడమే ఆయనకీ హుందాగా ఉంటుంది.

 

ఈ విషయంలోరాహుల్ గాంధీను ఉదాహరణగా చెప్పుకోవచ్చును. ఆయనకు ప్రధాని పీఠం అధిరోహించడానికి ఏ అడ్డంకులు లేనప్పటికీ, గత 9 సం.లుగా ప్రజల మద్య తిరుగుతూ, ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొంటూ, తన అవగాహన పెంచుకొంటూ పార్టీని ప్రజలోకి తీసుకు వెళ్లేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. తద్వారా, ఆయన ఇప్పుడు ప్రధాని పదవిని ఆశించకపోయినా, పార్టీ నేతలు, కార్యకర్తలు, ఉత్తరాది ప్రజలు, ముఖ్యంగా యువత ఆయన ఆ పదవికి అర్హుడేనని ఇప్పుడు భావిస్తున్నారు.

 

అదేవిధంగా, తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికలలో పోటీ చేయాలనీ భావిస్తున్న బాలకృష్ణ తదితరులు కూడా కనీసం ఈ ఏడాది కాలంలో ప్రజలలో తిరుగుతూ వారితో సంబందాలు మెరుగు పరుచుకోవడం అన్ని విధాల వారికే మేలు కలిగిస్తుంది. లేదంటే, అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్న వచ్చే ఎన్నికలలో గెలవడం అంత తేలికయిన పని కాదని ఆఖరి నిమిషంలో అర్ధమయినా అప్పుడు ఇక చేయగలిగేది ఏమి ఉండదు.

 

మారిన సామాజిక పరిస్థితుల్లో సినిమా గ్లామరు రాజకీయాలలో పెద్దగా ఉపయోగపడదని గత ఎన్నికలలో చిరంజీవికి అనుభవపూర్వకంగా అర్ధమయింది. బాలకృష్ణ తానూ కూడా ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోనవసరంలేదు గనుక, ఆయన రాజకీయాలలో ప్రవేశించే ఆలోచన ఉంటే ఇప్పటి నుండే అందుకు సంసిద్ధం అవడం మంచిది.

By
en-us Political News

  
భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు. ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ, రాష్ట్రస్థాయి కమిటీల్లో పల్నాడు జిల్లా నేతలకు సముచిత ప్రాధాన్యత దక్కింది.
దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల పోరాటం ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది.
పేద అమ్మాయిల వివాహాలకు ఎనిమిది గ్రాముల బంగారం, ఓ పట్టుచీర కానుకగా ఇస్తామన్నారు. ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామన్నారు. స్వయం సహాయక బృందాలకు రూ.5 లక్షలు వడ్డీ లేని రుణాలు, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో డ్రాపవుట్‌ లేకుండా చేసేందుకు విద్యార్థుల తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత సులభంగా ఏమీ రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి.
ఆ పార్టీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఈ అంశంపై స్పందిస్తూ.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంపై ప్రశంసలు కురిపించారు. పెరుగుతున్న జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ మరియు లోక్‌సభ స్థానాలను సుమారు 50 శాతం మేర పెంచాలని కేంద్రం భావించడం అభివృద్ధికి సంకేతంగా అభివర్ణించారు. ఈ ప్రక్రియ కోసం ఒక స్పష్టమైన విధివిధానాన్ని అనుసరిస్తుండటం పట్ల వైసీపీకి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వాకృచ్చారు.
మహిళా రిజర్వేషన్ ను డిలిమిటేషన్‌తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రగా అభివర్ణించారు. మహిళా బిల్లు, డిలిమిటేషన్ రెండూ వేర్వేరు అంశాలన్న కల్వకుంట్ల కవిత.. ఈ రెంటినీ లింక్ చేసి.. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డిలిమిటేషన్ అంశాన్ని కాల్చాలని కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు.
తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.
కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు. నారీ శక్తి వందన్ అధినియమ్ ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది.
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.