పట్టువీడలేదు... పదవి దక్కేనా!

Publish Date:Jun 1, 2025

Advertisement

 

 

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం ఆంటే తెలియని వారు లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గా పని చేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు ఎంత మేలు చేసారో నేటికి చాల మంది మరచిపోయి ఉండరు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో పార్టీ ఏర్పాటు చేసి తరువాత అన్నింటినీ పక్కన పెట్టిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ప్రస్తుతం బీజేపీ నుంచి ఓ పెద్ద పదవి వరించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథ్ రెడ్డి వాయల్పాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గా మృతి చెందారు. అమర్నాథ్ రెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు 1978 ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీ ఫారం ఇచ్చారు. ఆయన మరణంతో కిరణ్ కుమార్ రెడ్డి తల్లి ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైంది. 1989లో తొలిసారి ఎమ్మెల్యే.. ఆ తరువాత ఓటమి చవి చూసారు. 

అనంతరం 1999, 2004, 2009 ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో చీఫ్ విప్ గా, స్పీకర్ గా కూడా పదవులు అధిరోహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంచి క్రికెటర్ , అజహరుద్దీన్ తో కలసి వివిధ స్థాయిల్లో క్రికెట్ ఆడారు. తండ్రి అమర్ నాథ్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి అనివార్యంగా ప్రవేశించారు. నిజాం కాలేజీలో నందమూరి బాలకృష్ణ.. కిరణ్ కుమార్ రెడ్డి కలిసి చదువుకున్నారు. రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2010 నుంచి 2014 వరకు ముఖ్యమంత్రి గా పని చేశారు.ఆయన సొంత పార్టీ పెట్టి ఓటమి పాలైన తరువాత గత ఎన్నికల వరకు ఎక్కడ పెద్దగా కనిపించలేదు.2024 ఎన్నికల్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ తరుపున రాజంపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. 

తన ప్రత్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పై పోటీ చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తన వాక్చాతుర్యం తో రాజంపేట పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తూ వైసీపీ నాయకులకు నిద్ర లేకుండా చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పై విమర్శలు చేస్తూ ముందుకు సాగారు. పెద్దిరెడ్డి సైతం కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ పై స్పందించే రీతిలో ప్రసంగించారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తో జిల్లా రాజకీయాల్లో ఢీ అంటే ఢీ అంటూ పైచేయి సాధించారు. 

గత ఎన్నికల్లో రాజంపేట పార్లమెంట్ నుండి కిరణ్ కుమార్ రెడ్డి స్వల్ప మెజారిటీతో ఓటమి పాలైన.. తన తమ్ముడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ని పీలేరు ఎమ్మెల్యే గా గెలిపించారు. పావు నరసింహారావు ఆశీస్సులతో ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలనే కోరిక కిరణ్ కుమార్ రెడ్డి తండ్రికి ఉన్నా అది నెరవేరలేదు... తండ్రిఆశయాన్ని కిరణ్ కుమార్ రెడ్డి నెరవేర్చారు.  తన ఇంట్లో అధికారం ఉన్నా లేకపోయినా నియోజకవర్గంలో అభివృద్ధి, నియోజకవర్గ ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. నేటికి నియోజకవర్గ పర్యటనలు చేస్తున్నారు. తమ ఇంటి గడప వద్దకు వచ్చి ఏమి కావాలనే అడిగితే అది జరుగుతుంది అన్నది నియోజకవర్గ ప్రజల మాట. కిరణ్ కుమార్ రెడ్డి అనుభవం దృష్ట్యా బీజేపీ పార్టీ ఆయనకు అత్యున్నత స్థాయి పదవి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

By
en-us Political News

  
ధనిక రాష్ట్రంగా మొదలైన తెలంగాణ.. లక్షల కోట్లు అప్పుల పాలైందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
వైసీపీ అధినేత జగన్ కారు డ్రైవర్‌ రమణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి నల్లపాడు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
హైదరాబాద్‌‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఆస్పత్రి ఛైర్మన్‌ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ పైలాన్‌ను ఆవిష్కరించారు.
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండపై హైదరాబాద్‌లోని రాయదుర్గం పోలీసు స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గిరిజనులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయనపై గిరిజన సంఘాలు ఫిర్యాదు చేశాయి.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ పురోగతి సాధించింది. టెర్రరిస్టులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు.
మాజీ సీఎం జగన్ ఇటీవల గుంటూరు జిల్లా సత్తెనపల్లి పర్యటనలో రోడ్డు సింగయ్య అనే వ్యక్తి మృతి షాకింగ్ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
కాంగ్రెస్ ని బేసిగ్గా ఖాన్.. గ్రెస్ అని అంటారు. ఎందుకంటే ఈ పార్టీ తొలి  నుంచి ముస్లిం ప్రీతి  పాత్ర‌మైన పార్టీగానే పేరు సాధిస్తూ వ‌చ్చింద‌ని చెబుతారు.
ఈ ప్ర‌పంచానికి ఏదో అయ్యింది. త‌న చేతుల‌కు ఇన్నేసి ర‌క్త‌పు మ‌ర‌క‌ల‌ను అంటించుకుంటోన్న ట్రంప్ ని ఏకంగా నోబుల్ శాంతి బ‌హుమ‌తికి అది కూడా పాకిస్థాన్న లాంటి ఉగ్ర పిశాచ దేశం ప్ర‌తిపాదించ‌డం అంటే. ఈ
ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసీఆర్ అండ్ కోని మ‌రింతగా వెంటాడేలా తెలుస్తోంది. రీసెంట్ గా ప్ర‌ణీత్ రావును విచారించింది సిట్. ఆరు వంద‌ల మంది ప్రొఫైల్స్ ఎలా త‌యారు చేశారు.
కడప ఎంపీ అవినాష్ రెడ్డి మనుషులు తనను వెంబడించారని వివేకా హత్య కేసులోని ఎం -2 నిందితుడు సునీల్ యాదవ్ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నెల్లూరు రూరల్ పరిధి పరిధిలోని కనుపర్తిపాడు గ్రామం 295 సర్వే నెంబర్ 1.80 ఎకరాల స్థలానికి సంబంధించి తమకు 1869 నుంచి హక్కులు ఉన్నాయని అహోబిలం మఠం కార్యదర్శి కేసి వరదరాజన్ పేర్కొన్నారు.
ఇదిగో..అదిగో అంటూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఇక ఇప్పట్లో లేనట్లేనా ? అంటే, అంతే అంటున్నారు, విశ్లేషకులు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.