మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున కేసు.. వాంగ్మూలాల్లో తేడాలున్నాయా?

Publish Date:Oct 8, 2024

Advertisement

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి. తాను ఒక‌టి అనుకుంటే దైవం మ‌రొక‌టి త‌ల‌చిద‌న్న‌ట్లుగా.. కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను టార్గెట్ గా వ్యాఖ్య‌లు చేయ‌బోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగేశారు. అప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని హైడ్రా త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ ను కూల్చేసింద‌ని ర‌గిలిపోతున్న నాగార్జు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగార్జునే రిక్వెస్ట్ చేశారో ఏమో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా  సినీ ఇండ‌స్ట్రీ మొత్తం  ఏక‌మైంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను దాదాపు సినీ ప్ర‌ముఖులు అందరూ ఖండించారు. ప‌నిలో ప‌నిగా కొంద‌రు నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా దుమ్మెత్తిపోశారు.  హైడ్రా, రైతు రుణ‌మాఫీ విష‌యంలో వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌తో అసలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నరేవంత్ ప్ర‌భుత్వానికి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను  చేప‌ట్టింది. కాంగ్రెస్ పెద్ద‌లు కొండా సురేఖ‌ను మంద‌లించ‌డంతో ఆమె ప‌ది మెట్లు దిగొచ్చి నాగార్జున ఫ్యామిలీకి, స‌మంత‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన కోప‌మో.. నాగ‌చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారంపై ప్ర‌తి ఒక్క‌రూ కామెంట్స్ చేస్తున్నార‌న్న ఆగ్రహమో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేద‌ని లేద‌ని శ‌పధం చేసిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుపై ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రి ఫొటోల‌తో కేటీఆర్‌, హ‌రీశ్ రావు డీపీలు పెట్టుకున్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో వీరి గురించి అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, హ‌రీశ్ రావు సురేఖ‌పై పెట్టిన పోస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌మంత కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగార్జున‌, స‌మంత వైపు నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నాగార్జున మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో ఆమెపై నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు.   ఈ పిటిష‌న్‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా..  త‌మ ఎదుట హాజ‌రై వాంగ్మూలం  ఇవ్వాల్సిందిగా నాగార్జున‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం నాగార్జున‌, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌తోపాటు సుప్రియ‌ కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను రికార్డు చేసింది. అలాగే మొద‌టి సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. అక్టోబ‌రు 10న మ‌రో సాక్షికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయ‌నున్న‌ట్లు చెప్పి.. త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసింది.

నాగార్జున మంత్రి కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో కొంద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసి వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రిపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రి కాద‌ని అంటున్నారు. పొర‌పాటు జ‌రిగింద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ చెప్పినా నాగార్జు ఇంత మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే అగ్ర‌ కులానికి చెందిన మంత్రి అయితే నాగార్జున ఇలానే వ్య‌వ‌హ‌రించేవారా అంటూ బీసీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ వెన‌కుండి నాగార్జున‌ను న‌డిపిస్తున్నద‌ని.. బీఆర్ ఎస్ రాజ‌కీయాల్లో నాగార్జున పావుగా మారారని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, మంత్రి సురేఖ పై ప‌రువు న‌ష్టం దావా కోర్టులో నిల‌వ‌ద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. నాగార్జున ఒకటి చెప్ప‌గా.. సుప్రియ త‌న వాగ్మూలంలో మ‌రొకొటి చెప్పింద‌ని దీంతో కోర్టు నాగార్జున పిటిష‌న్ ను కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ విష‌యంపై మంత్రి కొండా సురేఖ త‌ర‌పున న్యాయ‌వాది మీడియాతో మాట్లాడాడు. 

మంత్రి కొండా సురేఖ‌పై సినీ న‌టుడు నాగార్జున దాఖ‌లు చేసిన కేసు నిల‌బ‌డ‌ద‌ని అనుకుంటున్నామ‌ని ఆమె త‌ర‌పున న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో ముగ్గురు వ్య‌క్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. నాగార్జున పిటిష‌న్ లో ఒక‌టి చెప్పారు. వాంగ్మూలంలో మ‌రొక‌టి చెప్పారు.  సుప్రియ వాంగ్మూలంలో ఇంకొక‌టి చెప్పారు. సుప్రియను సాక్షిగా కోర్టు ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 10న మ‌రొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఒక‌వేళ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని న్యాయ‌స్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయ‌ప‌రంగానే ఎదుర్కొంటామ‌ని కొండా సురేఖ త‌ర‌పు లాయ‌ర్ చెప్పారు. అయితే, మంత్రి కొండా సురేఖ‌పై కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె అనుచ‌రులు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి నాగార్జున‌, కొండా సురేఖ ఎపిషోడ్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డే ప‌రిస్థితులు క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు.

By
en-us Political News

  
నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు.
బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది.
2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు.
నారా లోకేష్ గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు చేరువయ్యారు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపడమే కాకుండా, పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కీలక పాత్ర పోషించారు. మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన తర్వాత పార్టీలో ఆయన ప్రాధాన్యత ఒక్కసారిగా పెరిగింది.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె పర్యటనకు హాజరుకాకూడదని స్థానిక మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ నిబంధనను అతిక్రమించి ఎవరైనా జగన్ పర్యటనకు వెడితే.. వారికి ఏకంగా ఒక లక్ష రూపాయల భారీ జరిమానా విధిస్తామని మత్స్యకార సంఘాల ప్రతినిధులు హెచ్చరించారు.
పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని, పార్టీ సిద్ధాంతాలే నాయకత్వానికి బలం అని విద్య, ఐటి శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి
జగన్ ప్రతిపాదిత మావిగన్ ప్రాంతం నుంచే అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాల ప్రజలలో అయితే మావిగన్ పట్ల తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అమరావతికి చట్టబద్ధత వచ్చిందని అంతా పండుగ వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో మావిగన్ ఏమిటి అంటూ ఓ రేంజ్ లో జగన్ ప్రతిపాదనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన నితీశ్‌కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. అలాగే ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు వేర్వేరుగా లేఖలు రాశారు. ఆ లేఖల్లో ఆయన వారి మద్దతు కోరారు. ఆశ్చర్యపోవద్దు చంద్రబాబు వారి మద్దతు కోరతూ లేఖ రాశారు. అయితే ఆ మద్దతు ఏ విషయంలో అంటే మహిళల రాజకీయ సాధికారతకు కీలక మైలురాయిగా నిలిచే మహిళా రిజర్వేషన్ బిల్లుకు. ఆ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరుతూ చంద్రబాబు ఈ లేఖలు రాశారు.
మాజీ మంత్రి, సీనియర్ పొలిటీషియన్ జీవన్ రెడ్డి అధికారికంగా బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకునే వేదికగా ఆ సభ జరగబోతున్నది. ఈ భారీ బహిరంగ సభలో కేసీఆర్ అఫీషియల్ గా జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ లో చేర్చుకుంటారు. ఈ సభను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది.
బెంగాల్ అభివృద్ధి కేవలం రాజధాని కోల్‌కతా, దాని చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమైందన్నారు. ముఖ్యంగా ముస్లిం జనాభా అధికంగా ఉన్న జిల్లాలను ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.
ఈ పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు డీలిమిటేషన్ ఏ విధంగా అవరోధంగా మారుతుందన్నది ఇండియా కూటమి పార్టీలకు వివరించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.