మంత్రి కొండా సురేఖ‌పై నాగార్జున కేసు.. వాంగ్మూలాల్లో తేడాలున్నాయా?

Publish Date:Oct 8, 2024

Advertisement

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌లు తెలంగాణ రాజ‌కీయాల్లో ర‌చ్చ రేపుతున్నాయి. తాను ఒక‌టి అనుకుంటే దైవం మ‌రొక‌టి త‌ల‌చిద‌న్న‌ట్లుగా.. కొండా సురేఖ బీఆర్ఎస్ నేత కేటీఆర్‌ను టార్గెట్ గా వ్యాఖ్య‌లు చేయ‌బోయి నాగార్జున ఫ్యామిలీని వివాదంలోకి లాగేశారు. అప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలోని హైడ్రా త‌న ఎన్ క‌న్వెన్ష‌న్ హాల్ ను కూల్చేసింద‌ని ర‌గిలిపోతున్న నాగార్జు.. కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్ గా తీసుకున్నారు. నాగార్జునే రిక్వెస్ట్ చేశారో ఏమో కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా  సినీ ఇండ‌స్ట్రీ మొత్తం  ఏక‌మైంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను దాదాపు సినీ ప్ర‌ముఖులు అందరూ ఖండించారు. ప‌నిలో ప‌నిగా కొంద‌రు నాగార్జున హార్డ్ కోర్ ఫ్యాన్స్ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైనా దుమ్మెత్తిపోశారు.  హైడ్రా, రైతు రుణ‌మాఫీ విష‌యంలో వ‌స్తున్న‌ విమ‌ర్శ‌ల‌తో అసలే ఉక్కిరిబిక్కిరి అవుతున్నరేవంత్ ప్ర‌భుత్వానికి కొండా సురేఖ వ్యాఖ్య‌లు పెద్ద తలనొప్పిగా పరిణమించాయి. దీంతో కాంగ్రెస్ అధిష్టానం న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల‌ను  చేప‌ట్టింది. కాంగ్రెస్ పెద్ద‌లు కొండా సురేఖ‌ను మంద‌లించ‌డంతో ఆమె ప‌ది మెట్లు దిగొచ్చి నాగార్జున ఫ్యామిలీకి, స‌మంత‌కు  క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. దీంతో వివాదం స‌మ‌సిపోయింద‌ని అంద‌రూ భావించారు. కానీ, కాంగ్రెస్ ప్ర‌భుత్వంపైన కోప‌మో.. నాగ‌చైత‌న్య‌, స‌మంత వ్య‌వ‌హారంపై ప్ర‌తి ఒక్క‌రూ కామెంట్స్ చేస్తున్నార‌న్న ఆగ్రహమో మొత్తం మీద కొండా సురేఖ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున సీరియ‌స్ గా తీసుకున్నారు. ఎట్టి ప‌రిస్థితుల్లో వ‌దిలేద‌ని లేద‌ని శ‌పధం చేసిన‌ట్లుగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.

 అస‌లేం జ‌రిగింద‌నే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. మంత్రి కొండా సురేఖ‌, బీజేపీ ఎంపీ ర‌ఘునంద‌న్ రావుపై ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. దీంతో వీరిద్ద‌రి ఫొటోల‌తో కేటీఆర్‌, హ‌రీశ్ రావు డీపీలు పెట్టుకున్న వ్య‌క్తులు సోష‌ల్ మీడియాలో వీరి గురించి అస‌భ్య‌క‌ర పోస్టులు పెట్టారు. ఈ పోస్టుల‌పై కొండా సురేఖ తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే, హ‌రీశ్ రావు సురేఖ‌పై పెట్టిన పోస్టుల‌ను తీవ్రంగా ఖండించారు. కానీ, కేటీఆర్ మాత్రం స్పందించ‌లేదు. దీంతో మంత్రి సురేఖ మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు విడిపోవ‌టానికి కేటీఆర్ కార‌ణ‌మంటూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌ల‌ను నాగార్జున, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తోపాటు స‌మంత కూడా తీవ్రంగా ఖండించారు. దీంతో టాలీవుడ్ ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు నాగార్జున‌, స‌మంత వైపు నిలిచి సోష‌ల్ మీడియా వేదిక‌గా మంత్రి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఖండించారు. నాగార్జున మంత్రి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్నారు. దీంతో ఆమెపై నాంప‌ల్లి కోర్టులో క్రిమిన‌ల్‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు.   ఈ పిటిష‌న్‌పై కోర్టులో విచార‌ణ జ‌ర‌గ్గా..  త‌మ ఎదుట హాజ‌రై వాంగ్మూలం  ఇవ్వాల్సిందిగా నాగార్జున‌ను కోర్టు ఆదేశించింది. దీంతో మంగ‌ళ‌వారం నాగార్జున‌, అమ‌ల‌, నాగ‌చైత‌న్య‌తోపాటు సుప్రియ‌ కూడా కోర్టుకు హాజ‌ర‌య్యారు. కోర్టు నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్ ను రికార్డు చేసింది. అలాగే మొద‌టి సాక్షిగా సుప్రియ వాంగ్మూలాన్ని కూడా తీసుకుంది. అక్టోబ‌రు 10న మ‌రో సాక్షికి సంబంధించిన వాంగ్మూలం రికార్డు చేయ‌నున్న‌ట్లు చెప్పి.. త‌దుప‌రి విచార‌ణ వాయిదా వేసింది.

నాగార్జున మంత్రి కొండా సురేఖ‌పై ప‌రువు న‌ష్టం దావా వేయ‌డంతో కొంద‌రు బీసీ వ‌ర్గానికి చెందిన వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. బీసి వ‌ర్గానికి చెందిన మ‌హిళా మంత్రిపై ఇలా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రి కాద‌ని అంటున్నారు. పొర‌పాటు జ‌రిగింద‌ని, త‌న వ్యాఖ్య‌ల‌ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని కొండా సురేఖ చెప్పినా నాగార్జు ఇంత మొండి వైఖ‌రితో వ్య‌వ‌హ‌రించ‌డం ఏమిట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. అదే అగ్ర‌ కులానికి చెందిన మంత్రి అయితే నాగార్జున ఇలానే వ్య‌వ‌హ‌రించేవారా అంటూ బీసీ వ‌ర్గానికి చెందిన కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ విష‌యంపై సోష‌ల్ మీడియాలో పెద్ద చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రోవైపు బీఆర్ఎస్ వెన‌కుండి నాగార్జున‌ను న‌డిపిస్తున్నద‌ని.. బీఆర్ ఎస్ రాజ‌కీయాల్లో నాగార్జున పావుగా మారారని కాంగ్రెస్ నేత‌లు పేర్కొంటున్నారు. అయితే, మంత్రి సురేఖ పై ప‌రువు న‌ష్టం దావా కోర్టులో నిల‌వ‌ద‌ని కొంద‌రు వాదిస్తున్నారు. నాగార్జున ఒకటి చెప్ప‌గా.. సుప్రియ త‌న వాగ్మూలంలో మ‌రొకొటి చెప్పింద‌ని దీంతో కోర్టు నాగార్జున పిటిష‌న్ ను కొట్టేసే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న చ‌ర్చ జ‌రుగుతుంది. ఈ విష‌యంపై మంత్రి కొండా సురేఖ త‌ర‌పున న్యాయ‌వాది మీడియాతో మాట్లాడాడు. 

మంత్రి కొండా సురేఖ‌పై సినీ న‌టుడు నాగార్జున దాఖ‌లు చేసిన కేసు నిల‌బ‌డ‌ద‌ని అనుకుంటున్నామ‌ని ఆమె త‌ర‌పున న్యాయ‌వాది పేర్కొన్నారు. ఈ కేసు విచార‌ణ‌లో ముగ్గురు వ్య‌క్తుల వాంగ్మూలాల్లో తేడాలున్నాయి. నాగార్జున పిటిష‌న్ లో ఒక‌టి చెప్పారు. వాంగ్మూలంలో మ‌రొక‌టి చెప్పారు.  సుప్రియ వాంగ్మూలంలో ఇంకొక‌టి చెప్పారు. సుప్రియను సాక్షిగా కోర్టు ఎంత వ‌ర‌కు ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటుందో చూడాలి. ఈ నెల 10న మ‌రొక సాక్షి వాంగ్మూలం కూడా కోర్టు రికార్డు చేస్తుంది. ఒక‌వేళ సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని న్యాయ‌స్థానం మంత్రికి నోటీసులు జారీ చేస్తే దాన్ని న్యాయ‌ప‌రంగానే ఎదుర్కొంటామ‌ని కొండా సురేఖ త‌ర‌పు లాయ‌ర్ చెప్పారు. అయితే, మంత్రి కొండా సురేఖ‌పై కొంద‌రు సోష‌ల్ మీడియాలో పెడుతున్న పోస్టుల‌పై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు ఆమె అనుచ‌రులు సిద్ధ‌మ‌య్యారు. మొత్తానికి నాగార్జున‌, కొండా సురేఖ ఎపిషోడ్‌కు ఇప్ప‌ట్లో తెర‌ప‌డే ప‌రిస్థితులు క‌నుచూపు మేర క‌నిపించ‌డం లేదు.

By
en-us Political News

  
అమరావతికి సాక్షాత్తూ పార్లమెంటు సాక్షిగా చట్టబద్ధ రాజధానిగా గుర్తింపు లభించిన తరువాత కూడా సజ్జల మౌలిక వసతులు లేని ప్రాంతంలో వేలకోట్టు కుమ్మరిస్తోందంటూ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. ఇప్పుడు కూడా అమరావతి అభివృద్ధి కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నా.. గ్రాఫిక్స్ రాజధాని అంటూ పాత పాటే పాడారు సజ్జల.
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశం అత్యంత ఆత్మీయంగా, భావోద్వేగాల మధ్య సాగింది. చాలా కాలం తర్వాత తన పాత మిత్రుడిని కలిసిన జీవన్ రెడ్డి ఒ ఉద్వేగానికి లోనయ్యారు.
గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.
రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్ ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా? అంటూ ప్రశ్నించారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో తమకు ఉన్న అనుబంధం ఎంతో గొప్పదని చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. వైఎస్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందంటూ అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై బొత్స తీవ్రంగా స్పందించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురైన రోజున జరిగిన పరిణామాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
జీవన్ రెడ్డి, కేటీఆర్ లు సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ సూచన మేరకే సహచరులతో కలిసి జీవన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానిం చేందుకు ఆయన నివాసానికి వచ్చినట్లు చెప్పారు. 2014 ఎన్నికలకు ముందే కేసీఆర్ జీవన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేరాలని ఆహ్వానించారన్నారు.
ల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవిపై ఎన్నికల అక్రమాల ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సంస్థ ద్వారా ఉద్యోగుల ఖాతాల్లో భారీగా నగదు జమ చేసి.. ఆ నగదును ఎన్నికల ఖర్చులకు మళ్లించారనే ఫిర్యాదు ఈసీకి చేరింది. దీనిపై సమగ్ర విచారణకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఇక వేళ ఆ ఆరోపణలు నిజమని రుజువైతే.. ఆమె పదవికి ముప్పు ఉండొచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కడప జిల్లా నేతలలైన పుట్టా సుధాకర్, వరదరాజులు రెడ్డి, మాధవి రెడ్డిపై లోకేష్ ఫైరయ్యారు. ఈ నెల మొదటి వారంలో జరిగిన సమీక్షలో, నారా లోకేష్ కడప జిల్లా నేతలపై బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా ఫిర్యాదుల విన్నపం కార్యక్రమాలకు ఈ నేతలు హాజరుకాకపోవడంపై నిలదీసినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు.
కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు.
మావిగన్ ప్రతిపాదనతో జగన్ నెటిజనులకు ఒక ట్రోల్ మెటీరియల్ గా మారిపోయిన సంగతి తెలిసిందే. ఆ ప్రతిపాదనపై లెక్కలేనన్న మీమ్స్, సెటైర్లు నెట్టింట వెల్లువెత్తాయి. అయినా కూడా జగన్ తాను పట్టిన కుందేటికి మూడేకాళ్లన్న చందంగా మావిగన్ ను మించిన రాజధాని ఉండనే ఉండదన్నట్లు మాట్లాడుతున్నారు. అయితే ఇదే మావిగన్ ను ఆయన అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో ఎందుకు ముందుకు తీసుకురాలేదన్న ప్రశ్నకు మాత్రం జగన్ సమాధానం ఇవ్వడం లేదు.
కేరళలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు, పుదుచ్చేరిలోని 30 స్థానాలకు రేపు ఒకేసారి ఓటింగ్ నిర్వహించనున్నారు. అలాగే అస్సాంలో 126 స్థానాలకూ కూడా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. గతంలో బహుళ విడతల్లో ఎన్నికలు జరిగినప్పటికీ, ఈసారి మాత్రం ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.