నాడీ వైద్యం తో ఆయుష్షు పెరుగుతుంది!

Publish Date:Feb 25, 2022

Advertisement

నాడీ పతి -ప్రపంచం లోనే మొట్ట మొదటి చికిత్స విధానం అని మీకు తేకుసా ?
వేల సంవత్సరాలసాంప్రదాయ చికిత్సలు వాటి వివరాలు ---
అతి ప్రాచీన మైన  సాంప్రదాయ చికిత్సల్లో ముఖ్యంగా భారత దేశం లో  ఒకటి నాడీ తెరఫీ. నాడీ తెరఫీ కి ప్రత్యామ్నాయం ఏ మిటి సంప్రదాయ తెరఫీలకు   వివిధ దేశాలలో ఏమని పిలుస్తారు  వాటి పేర్లు ఈ వ్యాసం లో చూద్దాం.
నాడీ పతి ని వివిధ దేశాలు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాతే వారి వారి పద్దతులలో చిన్న చిన్న మార్పులు చేసుకుని అమలు చేస్తున్నారని ప్రముఖ నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు వివరించారు.నాడీ పతి వైద్యం ప్రాధాన్యతను  చైనా గుర్తించింది.

చైనా తెరఫీ లో కీలక మైన వైద్యం అక్యుపంక్చర్,లేదా అక్యు ప్రెషర్...

అక్యు పంక్చర్,అక్యు ప్రెషర్   అని దీనిని పిలుస్తారు.దీనిని నాడీ పతి ఆధారంగానే రూపొందించారని అంటున్నారు. దీనికి ఆధారంగా మనశరీరంలో అంటే సూక్ష్మ శరీరంలో శక్తి నిచ్చే 14 చానళ్ళు ఉంటాయని వాటిలో ఏ చానల్ లో అయినా అడ్డుకుంటే అంటే ఎక్కడైనా బ్లాక్స్ వస్తే శరీరం లో  అనారోగ్యానికి దారి తీస్తుంది.దీనిని చై నీయులు మెరీడియన్ అని అంటారు. దీనికి అనుబంధం గానే 
నాడీ పద్దతి ని అనుసరిస్తూ ఈ ప్రక్రియ చేస్తారని నాడీ పతి వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు తెలిపారు.

ఇజిప్శియన్ తెరఫీ...

ఇజిప్శియన్స్ కనుగొన్న తెరఫీ శక్తి ని ప్రసరింప చేయడం. ఈ శక్తి పిరమిడ్ నుండి వస్తుందని ఇది పిరమిడ్ ఆకారం లేదా ప్రకృతిలో ఉండే అనిరకాల ఆకారాలు ఉంటాయని వారి నమ్మక ప్రగాడ విశ్వాసం. వీరి నమ్మకం విశ్వాశం ఎంత గొప్పది అంటే పిరమిడ్ ను గిజా అంటారు ఇది ఇక్వేటర్ అని దేమునితో సమానమని పిరమిడ్ ద్వారా శక్తి నిస్తాడని అఆకారం వారి మందిరం యొక్క ఆకారంగా బావిస్తారు. వారివద్ద ఉన్న ఆహార పదార్ధాలు ధాన్యాలు దినుసులు వాటిని గడ్డితో నిర్మిస్తారు కాబట్టి వీటిని పవిత్ర మందిరాలు గా భావిస్తారు. గడ్డి తో నిర్మించిన పిరమిడ్ ఆకారం లో ఉన్న  ఇళ్ళలో ధాన్యం,దినుసులు దాచుకుంటారు దీనికి కారణం అంతా ఆ పిరమిడ్  ఆకారం లోనే ఉందని ఇజిప్శియన్ల నమ్మకం అందుకే చని పోయిన వారి మృత దేహాలను పిరమిడ్ లలో నిల్వుంచు తారు. పిరమిడ్ లకు మరో పేరు మమ్మీలు అందుకే మీ తల్లి తండ్రులను మమ్మీ అని పిలవ వద్దని అంటారు. ఆధునిక కాలం లో బ్రంహర్షి పత్రి గారు ప్రపంచ పిరమిడ్ ఆధ్యాత్మిక సమాజాన్ని నిర్మించడం ద్వారా పిరమిడ్ ప్రాధాన్యతను గుర్తించి నట్లయ్యింది. ప్రాధాన్యత కల్పించినట్లు గా భావించవచ్చు.

మెసపుటో మియా తెరఫీ...

మెసపు టోమియా న్లు ఏమని వర్నించారంటే మన శరీరం గుండానే శక్తి ప్రసరిస్తుందని. ఆ శక్తి లేదా ఎనేర్జీ కొన్ని జోన్లు గా విభజింపబడి ఉంటుందని అంటారు. మన చేతిలోని వేళ్ళలో లేదా కా లివేళ్ళలో ఉన్నట్లు గుర్తించారు. ఈ శక్తి సాధనాలను ఆధారంగా చేసుకుని కొన్ని పరిశోధనల అనంతరం కొన్ని తెరఫీ పద్దతులను ఆయా జోన్ లలో చేయవచ్చని నిర్ధారించారు.దీనికి అనుబంధం గానే వివిధ దేశాలలో శక్తిని గుర్తించారు.దీనిని స్పైడర్ ఎనర్జీ,లేదా డైమండ్ ఎనర్జీ, గా రూపకల్పన చేసారు. ఇవన్ని క్రీస్తు పూర్వం 8౦౦౦ బి సి నాటిదని మందులు లేకుండా చికిత్స చేయడమే దీని విధానం.

భారాతీయ సాంప్రదాయ వైద్యం...

భారత దేశంలో6౦౦౦ సంవత్సరాల కు పూర్వమే ఆయుర్వేద పితామహుడు చరకుడు వివిధ రకాల వ్యాధులకు నాడిని పరిశీలించి వ్యాధి ని నివారించే వారని  చికిత్స  కోసం  ప్రకృతి నుండి లభించే ఔషద మొక్కలు,లేదాహెర్బల్ మూలిక లను వినియోగించి శస్త్ర చికిత్స చేసేవారని తెలుస్తోంది.మన ప్రాచీన వైద్య విధానం లోనే సుశ్రుతుడు సర్జరీలు శస్త్ర చికిత్సలు చేసే వారని తెలుస్తోంది. వాగ్బటుడు ఈ అంశాల పై సమగ్ర పరిశోదనలు చేసారని చిత్సలు కాయ చికిత్సలు శస్త్రచికిత్సలు మన పూర్వీకులు మనకు అందించినవే అని అంటున్నారు నాడీ వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు ఏ డి ఏ మైనా వైద్య విధానానికి తొలి అడుగు మాత్రం భారతీయులే అందం లో ఏ మాత్రం సందేహం లేదు.

చికిత్స పద్దతులలో కొత్త పుంతలు...

సాంప్రదాయ వైద్య విధానాల నుండి మనం కొత్త శస్త్ర చికిత్స పద్ధతులకు శ్రీకారం చుట్టింది భారాత్దేశం లోనేఅన్నది వాస్తవం ఇందుకు నిదర్శనం సుశ్రుతుడు అని మన వేదం గ్రంధాలలో ఉంది. మరి కొందరు మాత్రం ఇక శాస్త్రీయ పద్దతిలో  సూక్ష్మ శరీరానికి హాహ్నేమనన్ చికిత్స చేసే పద్దతిని కనుగొన్నాడు. హిపోక్రాటేస్ అలోపతి ద్వారా శరీర తత్వాన్ని బట్టి అలోపతి వైద్యాన్ని వెలుగులోకి తెచ్చాడు. అప్పుడే సూక్ష్మ శరీరానికి బదులు శరీరానికి చికిత్స చేపట్టారు.శరీర స్థితిని బట్టి శరీరానికి చికిత్స అందించే ప్రయత్నం చేయడం మొదలు పెట్టారు. సూక్ష్మ శరీరం నుండి స్తూల శరీరానికి చికిత్స ప్రారంభ మయ్యిందో మనషి జీవిత ప్రమాణం జీవించే కాలం పెరిగింది అని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే మన పూర్వీకులు 12౦ సంవత్సరాలు ఆరోగ్యంగా జీవించారు కానీ ఆధునిక వైద్యం వల్ల 5౦ సంవత్సరాలకు మించి బతకడం లేదు. అని డబ్ల్యు హెచ్ ఓ పేర్కొంది. ఒక విషయాన్ని మనం తీవ్రంగా ఆలోచిస్తే చూసిన పరిశీలించినా ఆధునిక యుగంలో నూ మందులకు బదులు తెరఫీలు వాడుతున్నారని గ్రహించవచ్చు. ఆధునిక యుగంలో మన ఆహారపు అలవాట్లు వాతావరణం పూర్తిగా కాలుష్యం కావడం వల్ల అనారోగ్యం తీవ్రంగా పెరుగు తొందనేది వాస్తవం. మనం మన సాంప్రదాయ తెరఫీ లను ఒక్కసారి చూసినప్పుడు. వారి జీవిత కాలం జీవన శైలి అద్భుతం కాబట్టే అనారోగ్యం అన్న పదం వారి డిక్షనరీలో లేదు వాటికి అర్ధం కూడా వారికి తెలియదు అనే చెప్పాలి. ఆక్యుపంక్చర్, అక్యు ప్రెషర్ వంటివి మన పూర్వీల మూలాల నుండి వచ్చిందని చెప్పవచ్చు.అయితే మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య మైన అంశం ఏమిటి అంటే తెరఫీ పద్దతులు అన్నీ కేవలం శరీరానికి మాత్రమే అని అంటున్నారు. మనం మన ప్రశాంతత మానసి క  అనారోగ్యానికి యోగా మెడిటేషన్ తప్పని సరిగా చేయాల్సిందే. అని అంటున్నారు డాక్టర్ కృష్ణం రాజు. నాడీ పతి అత్యంత ప్రాచీన భారతీయ చికిత్స ఏ మందులు అవసరం లేని సమగ్ర చికిత్స . 1౦౦ రకాలకు పైగా ప్రాచీన చికిత్సా పద్దతులు -ఎవిధమైన్స మందులూ అవసరం లేదు. నాడీ పతిలో ప్రకృతి సిద్ధమైన చికిత్స,మీ అయుష్టు ను పెంచుతుంది, మీశారీరం లో ఉన్న వ్యర్ధాలను తొలగిస్తుంది.వ్యాక్షి మరికొన్నాళ్ళు శక్తి వంతం గా జీవిస్తాడు.

నాడీ పతి చికిత్సా విధానాలు...

నాడీ పతిలో వ్యాధి మూల కారణాన్ని అదే మన వైద్య పరిభాషలో రూట్ కాజ్ తెలుసుకు చికిత్స చేస్తారు. రోగ నిర్దారణే కీలకం రోగి యొక్క నాడి ని పరీక్షించడం ఇతర మార్గాల ద్వార వ్యాధిని నిర్ధారించి ప్రాచీన ప్రక్రియనే నేడూ అనుసరిస్తున్నారు.సూక్ష్మ శరీరానికి చేసే చికిత్స తో బౌతిక స్థూల శరీరానికి స్వస్థత.చేకూరుతుందనేది నాడీ వైద్యుల విశ్వాసం.

నాడీ పతి ద్వారా వ్యాధి మూలాలు కనుగొనడం ముఖ్యం...

నాడీ పతి వైద్యం లో వ్యాధి కి మూల కారణాన్ని కనుగొనడం ముఖ్యం. శరీరానికి గతం లో వచ్చిన ఇప్పుడు ఉన్న భవిష్యత్తులో రాబోయే వ్యాధులను పసిగట్టి భవిష్యత్తులో వ్యాధులు సంక్రమించ కుండా నివారించడానికి నాడీ పతి దోహదం చేస్తుంది.భావిష్యతులో వ్యాధులను నిలువరించగలమని అంటారు నాడీ వైద్యులు డాక్టర్ కృష్ణం రాజు.

నాడీ వైద్యం తో ఆయుష్టు పెరుగుతుంది...

శరీరం లోకి వచ్చి చేరిన రక రకాల మలినాలు వ్యర్ధాల వల్లే అనారోగ్యం అని అంటారు వైద్యులు. శరీరం లో పేరుకు పోయిన మలినాన్ని ప్రాచీన చికిత్సా పద్దతుల ద్వారా తొలగించ వచ్చనే నమ్మకాని కలిగిస్తూ 18 సంవత్సరాలుగా నాడీ పతి చికిత్స పద్దతిని సాధన చేస్తున్నట్లు నాడీ వైద్యులు స్పష్టం చేసారు.

నాడీ పతి వైద్యలో  దీర్ఘ కాలిక  వ్యాధులకు చెక్...

శరీరంలో కొన్ని సార్లు స్వల్పకాలిక అనారోగ్యం లేదా దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు మనల్ని వేదిస్తూ ఉంటాయి. ముఖ్యంగా థాయ్ రాయిడ్,డయాబెటిస్, పక్ష వాతం, ఆర్తరైటిస్, మూత్రపిండాల సమస్యలు,వెన్నెముక, వెన్ను పూసలో సమస్యలు, జీర్ణ కొస సమస్యలు, కంటి సమస్యలు, గాళ్ బ్లాడర్ లో సమస్యలు, కాలేయ వ్యాధులు, మైగ్రైన్, మానసిక శారీరక సమాస్యలకు నాడీ చికిత్స ఉంటుంది. నాడీ పతి చికిస వ్యాధి తీవ్రత ను బట్టి కొన్ని ఘంటలు లేదా రోజుల్లోనే నివారించ వచ్చు అనుతున్నారు నాడీ నిపుణులు డాక్టర్ కృష్ణం రాజు.

By
en-us Political News

  
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని..
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై..
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.