తెలుపు శాంతికి చిహ్నం.. ఖద్దరు సామాన్య జీవనానికి చిహ్నం.. అందుకే గాంధీగారు రెంటినీ పాటించా లని రాజకీయనాయకులకు బోధించారు. తెలుపు మాట ఎలా ఉన్నా ఖద్దరు మాత్రం కాలంతో పాటు టెర్లీన్ లోకి మారి రాజకీయనాయకులకు అనుకూలమయింది. ఇంకా ఇప్పటికీ ఖద్దరునే వాడే నాయ కులూ ఉన్నారు. కాగా ఇటీవలి కాలంలో రాజకీయ నాయకుల మధ్య విచిత్ర పోటీ జరుగుతోంది. నేనో మొక్క నాటాను అంటే మరో నాయకుడు రెండు మొక్కలు నాటానని వీడియో పెడుతున్నారు. ఇపుడు దుస్తుల విషయం లోనూ పోటీ పెట్టుకున్నారు. నేను చేనేతకు పెద్ద అంబాసిడర్ని అంటూ జనసేన నాయకుడు పవర్స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నాడు. అంతే వెంటనే చాలామంది నువ్వే కాదు చాలామంది అదే బాటలో ఉన్నారని ప్రకటించారు.
వీరికంటే ముందే మై హ్యాండ్లూమ్ మై ఫ్రెండ్ అంటూ నారాయణ పేట్ కలెక్టర్ హరిచందన సోషల్ మీడి యాలో హల్చల్ చేస్తున్నారు. ప్రజలు చేనేతను ఎక్కువ ఉపయోగించాలన్నది ఆమె ప్రచార సారాం శం. ఆ మాట అందుకున్నారు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి స్మితా సబర్వాల్. అం దుకు కొనసా గింపుగా మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను ట్యాగ్ చేశారు.
ఈ తరహా చాలెంజ్లు ఆరోగ్యకరమే. ఇందులో చేనేతకార్మికులను ప్రోత్సహించాలన్న లక్ష్యమే కనపడు తోంది. క్రమేపీ పోలీసు రంగానికీ పాకింది. హైదరాబాద్ సీపీ సీవి ఆనంద్ను పోచంపల్లి దుస్తులు వేసుకు ని ఫోటోను ట్వీట్ చేశారు. ఆ ట్వీట్కు స్పందించారు ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, ప్రస్తుత కామన్ వెల్త్ గేమ్స్లో స్వర్ణం సాధించిన పి.వీ.సింధు. చాలా చిత్రంగా ఉంది.. దుస్తులు ఏవి, ఎలాంటి వేసుకోవాల న్నదీ మోడల్స్లా పోటీపడి మరీ ధరించడం, ప్రచారం చేయడం. ఒక విధంగా చేనేత రంగానికి ఇదో పెద్ద ప్రచారం. ప్రత్యే కించి చేనేత రంగంవారు మీడియాలో ప్రచారం చేసుకోనక్కర్లేదు. ఎవరో ఒక సెలబ్రెటీతో నాలుగు మంచి మాటలు చెప్పించి ఈ దుస్తులు ధరించితే చాలు. అది అలా ఆసేతు హిమాచలం ఫాలో అయిపోతు న్నారు.
గతంలో పచ్చదనం ఆరోగ్యకరం అనే టాగ్తో పర్యావరణ పరిరక్షణకోసం ప్రజలకు మొక్కలు నాటడం, చెట్లను పరిరక్షించడం, చెరువులు, నదులను రక్షించుకోవాలన్నలక్ష్యంతో పర్యావరణ శాఖ భారీ ప్రచా రాలే చేసింది. అందుకు చాలామంది స్పందించారు. అన్ని ప్రాంతాల్లోనూ సెలబ్రిటీలు ముందుకు వచ్చి ఎంతో ప్రోత్సహించారు. ఇదో ఆరోగ్యకర పోటీతత్వాన్ని పెంచింది. ఇది క్రమేపీ అన్ని రంగాలకూ విస్తరిస్తే మరింత బాగుంటుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/my-handloommy-friend-25-141509.html
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత జాతీయ, ప్రాంతీయ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించాయి.
టీవీకే అధినేత విజయ్తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్రబాబు ఫొటోలేదని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో జనసేన నేత, మాజీ ఎమ్మెల్యే దొరబాబు జోక్యం చేసుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వర్మ దురుసు వ్యాఖ్యలపై పార్టీలో అంతర్గతంగా చర్చించిన అధిష్టానం.. వర్మ వ్యవహారాన్ని తప్పుబట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.