మైసూరా కూడా పాయే..జగన్‌కి ఇక పెద్దదిక్కెవరు..?

Publish Date:Apr 27, 2016

Advertisement

టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేధ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీడీపీలోకి లాక్కుంటున్నారంటూ ఢిల్లీ లెవల్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు వైసీపీ అధినేత జగన్. అక్కడ చంద్రబాబుపై పుస్తకం రిలీజ్ చేసి 24 గంటలు గడవకముందే జగన్‌కి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కురువృద్ధుడుగా అభివర్ణించే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎంవీ మైసూరారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీలో తనకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతోనే పార్టీని వీడినట్లు తెలిపారు. ఏకంగా మీడియా సమావేశం పెట్టి జగన్‌ని ఏకీపారేశారు.

 

గతంలో అందరూ చెప్పినట్లుగానే జగన్ ఒక మోనార్క్ అని, ఎవ్వరి మాట వినరన్నారు. ప్రతిపక్షనేతగా ప్రజల పక్షాన పోరాడే ధ్యాస జగన్‌కు లేదని విమర్శించారు. వైసీపీలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీలో ఉండటం అనవసరమని..ప్రజాస్వామ్యంపై జగన్‌కు నమ్మకం లేదని..పార్టీలోని పరిణామాలు స్వార్థ రాజకీయాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు. ఎంతమంది ఎమ్మెల్యేలు వలస వెళ్లినా జగన్‌కి పెద్దగా నష్టం లేదు. కానీ మైసూరా పార్టీని వీడటం పెద్ద లోటే. ఎందుకంటే పార్టీని స్థాపించిన కొద్ది రోజులకే జగన్ జైలుకు వెళితే పార్టీని నడిపింది..బలోపేతం చేసింది మైసూరానే..దానికి తోడు జగన్ సొంత జిల్లా కడపలో వైసీపీని విస్తరించి టీడీపీని ఒక్క స్థానానికే పరిమితం చేసిన ఘనత మైసూరాదే.

 

అలాంటి తనకి పార్టీలో సరైన గౌరవం దక్కలేదని, రాజ్యసభ టికెట్ విషయంలోనూ తనను పరిగణనలోనికి తీసుకోకపోవడం మైసూరాను బాధించింది. అందుకే పార్టీని వీడాలని ఆయన నిర్ణయించుకున్నారు. మిగతా నేతలంతా సైలెంట్‌గా పార్టీని వీడితే మైసూరా మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరి జగన్ ఒంటెత్తు పోకడలను విమర్శించారు. మైసూరాను కోల్పోయిన జగన్ పరిస్థితి చాణుక్యుడు లేని చంద్రగుప్తుడిలా మారింది. మరి ఈ నేపథ్యంలో యువనేత, మైసూరాతో మంతనాలు జరిపి రాజీనామాను ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు ప్రారంభిస్తారా లేక పోతే పోనీ పోరా? అంటారా అనేది వేచి చూడాలి.

By
en-us Political News

  
లోకేష్‌తో పాటు ఇటీవల ప్రకటించిన 252 మందితో కూడిన జాతీయ, రాష్ట్ర స్థాయి నూతన కార్యవర్గం కూడా ఈ కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేసింది. కీలక నేతలందరూ పార్టీ పట్ల తమ విధేయతను ప్రకటిస్తూ బాధ్యతలు స్వీకరించారు.
వైసీపీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరారు. వీరిలో కొందరు తమ సభ్యత్వాలకు రాజీనామాలు చేశారు. అయితే, నిబంధనల ప్రకారం రాజీనామాలు సమర్పించినా.. చైర్మన్ వాటిని ఆమోదించకుండా పెండింగ్‌లో పెడుతున్నారని ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. ఇటీవలే ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ సమర్పించిన రాజీనామాను సరైన ఫార్మాట్‌లో లేదని, సహేతుక కారణాలు చూపలేదని పేర్కొంటూ చైర్మన్ తిరస్కరించడం రాజకీయంగా దుమారం రేపింది.
ఉద్యమ నేత కుమార్తె అన్న ఇమేజ్‌కు తగ్గట్లుగానే తెలంగాణ పాలిటిక్స్‌లో ఆమె ఫైటర్‌లా తన పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ విషయంలో గానీ, ఫ్లెక్సీల విషయంలో గానీ బహిరంగంగా ఘర్షణలకు దిగడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందనీ.. ఏదైనా సమస్య ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకురావాలి తప్ప రోడ్డెక్కడం సరికాదని వర్మను గట్టిగా మందలించారు.అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌ను భవిష్యత్ లోఇలాంటివి పునరావృతం కాకుండా వర్మకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కరరావు (90) కన్నుమూశారు.
నేను చావ‌ను కొ*కా! అని కేసీఆర్ అన్న‌ది బూత‌నుకోవాలా? అయితే ఇప్ప‌టి వ‌ర‌కూ కేసీఆర్, రేవంత్ ఇలాంటి బూతులు ఎన్ని వాడారు?
గతంలో 1976లో ఇందిరా గాంధీ హయాంలో.. ఆ తర్వాత 2001లో వాజ్‌పేయి ప్రభుత్వ సమయంలో ఈ ప్రక్రియను వాయిదా వేస్తూ వచ్చారు. అయితే, 2026 గడువు సమీపిస్తుండటంతో ఈసారి డీలిమిటేషన్ జరగడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిని కేవలం ఉత్తరాది రాష్ట్రాల ప్రయోజనాల కోసమే చేస్తున్న కుట్రగా చూడలేమనీ, ఇది దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రాజ్యాంగ డెడ్ లైన్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చదువుల కల్పవల్లి ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
గత ఎన్నికల ఫలితాలు, జిల్లా వారీగా జనాభా గణాంకాలు, ఓటర్ల జాబితాను నిశితంగా పరిశీలిస్తే, ఈ ముస్లిం వీటో అనే వాదనలో అతిశయోక్తి ఎక్కువగా ఉందనే విషయం విస్పష్టంగా తెలుస్తుంది.
కార్య‌క‌ర్త‌లను, వారి అవ‌స్థ‌ల‌ను ద‌గ్గ‌రి నుంచి ప‌రిశీలించిన లోకేష్.. వారికంటూ ఒక జీతం ఉండాలని మొద‌ట‌ కోరుకున్నారు. అది త‌ర్వాతి రోజుల్లో జ‌న్మ‌భూమి క‌మిటీల‌కు ప్రేర‌ణ‌గా మారింది. అంతే కాదు.. వాలంటీర్ వ్య‌వ‌స్థ‌కూ ఇదే స్ఫూర్తి. క‌నీసం వారికి బీమా సౌక‌ర్యం ఉండాల‌ని కోరుకున్నారాయ‌న‌. దీన్ని వ‌ర్క‌వుట్ చేయ‌గ‌లిగారు. పార్టీ కేడ‌ర్ కి లైఫ్ ఇన్ స్యూరెన్స్ చేసిన తొలి పార్టీ తెలుగుదేశం అయితే, అందుకు కార‌కుడు లోకేష్.
దేశంలో ఎన్నికల ప్రక్రియ అనగానే కేవలం ఓటింగ్, ఫలితాలే గుర్తొస్తాయి.
పార్టీ కార్యకర్తలపై నమోదైన కేసుల విషయంలో ఆయన నేరుగా రంగంలోకి దిగి వారికి భరోసా కల్పించారు. కార్యకర్తల సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం ద్వారా, పార్టీ అంటే కేవలం ఎన్నికల యంత్రాంగం మాత్రమే కాదు, ఒక కుటుంబం అనే భావనను ఆయన పాదుకొల్పారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇవ్వడం సరైన నిర్ణయమని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదిరేందుకు కేవలం అంగుళాల దూరం మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితుల్లో, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగడంతో పరిస్థితులు తలకిందులయ్యాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో నెతన్యాహు జరిపిన టెలిఫోన్ సంభాషణ తర్వాత చర్చల గమనం పూర్తిగా మారిపోయింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.