హనీమూన్ ట్రిప్లో విషాదం...హోటల్ రూమ్లో నగ్నంగా రక్తపు మడుగులో నవవధువు!
Publish Date:Jun 16, 2026
Advertisement
హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది. ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలతో ఆ కొత్త జంట తమ వైవాహిక జీవితాన్ని ప్రారంభించింది. కానీ, విధి ఆడిన వింత నాటకంలో ఆ ఆనందం కేవలం కొన్ని నెలలకే ఆవిరైపోయింది. ఊహించని రీతిలో ఆ నవవధువు ఓ హోటల్ గదిలో శవమై తేలింది. అదీ కూడా బట్టలు లేకుండా, ఒంటి నిండా రక్తపు మడుగులో పడి ఉన్న ఆమె భీభత్స స్థితిని చూసి హోటల్ సిబ్బందితో పాటు స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందమైన పర్యాటక ప్రాంతంలో జరిగిన ఈ ఘోర ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అసలు ఆ రాత్రి ఆ మూసి ఉన్న గదిలో ఏం జరిగిందనే కోణంలో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ దారుణ ఉదంతం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన రిషికేశ్ పరిధిలోని ముస్సోరీలో వెలుగు చూసింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నానికి చెందిన సౌమ్యశ్రీచరణ్, రాధా గాయత్రి అనే యువతీ యువకులకు గత ఏడాది అంటే 2025 నవంబర్ 8వ తేదీన ఎంతో వైభవంగా వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఈ జంట దేశ రాజధాని ఢిల్లీ పరిసరాల్లోని గురుగ్రామ్లో నివాసం ఉంటూ, అక్కడ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. దాదాపు ఏడు నెలల వైవాహిక జీవితం సాఫీగా సాగిన తర్వాత, వారు హనీమూన్ ట్రిప్ ప్లాన్ చేసుకున్నారు. ఇందులో భాగంగానే జూన్ 14వ తేదీ ఆదివారం నాడు ఈ జంట ఢిల్లీ నుంచి రిషికేశ్కు బయలుదేరి వెళ్లింది. ముస్సోరీ చేరుకున్న తర్వాత వారు అక్కడ ఉన్న ఒక హోమ్స్టే (హోటల్ రూమ్) లో బస చేశారు. ఆదివారం రోజంతా ఎంతో సంతోషంగా గడిపిన ఆ దంపతులు రాత్రి తమ గదిలోకి వెళ్లారు. అయితే, సోమవారం తెల్లవారుజామున హోటల్ సిబ్బంది ఏదో పనిమీద ఆ రూమ్ వద్దకు వెళ్లేసరికి అక్కడి దృశ్యం చూసి నివ్వెరపోయారు. నవవధువు రాధా గాయత్రి ఒంటిపై నూలుపోగు లేకుండా, నగ్నంగా రక్తపు మడుగులో పడి ఉంది. గదిలో ఎటు చూసినా రక్తపు మరకలు భయాందోళన కలిగిస్తున్నాయి. వెంటనే అప్రమత్తమైన హోటల్ యాజమాన్యం స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, వైద్యులను పిలిపించి పరీక్షించగా అప్పటికే రాధా గాయత్రి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోలీసులు ఆ హోటల్ గదిని నిశితంగా పరిశీలించగా, అక్కడ రెండు మద్యం సీసాలు లభ్యమయ్యాయి. మృతురాలి శరీరంపై ఉన్న గాయాలు, గదిలోని పరిస్థితులు చూస్తే అక్కడ పెద్ద గొడవ జరిగినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి. ఘటనా సమయంలో గదిలోనే ఉన్న భర్త సౌమ్యశ్రీచరణ్ను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. తాను రాత్రి మద్యం మత్తులో నిద్రపోయానని, ఉదయం లేచి చూసేసరికి భార్య రక్తపు మడుగులో శవమై కనిపించిందని, అసలు ఏం జరిగిందో తనకు ఏమీ తెలియదని అతడు పోలీసులకు తెలిపాడు. అయితే అతడు చెబుతున్న సమాధానాల్లో తీవ్రమైన పొంతన లేకపోవడంతో పోలీసులకు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీలోని కిద్వాయ్నగర్ ప్రాంతానికి చెందిన యువతిగా రాధా గాయత్రిని పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్మార్టమ్ నివేదిక వస్తేనే ఆమె ఎలా చనిపోయింది, ఇది హత్యా లేక మరేదైనా కారణమా అనే విషయాలు స్పష్టమవుతాయని పోలీసులు చెబుతున్నారు. ఒక ఐటీ ఉద్యోగిని, పెళ్లయిన కొన్ని నెలలకే హనీమూన్ స్పాట్లో ఇలా నగ్నంగా, రక్తపు మడుగులో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం ఐటీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు ఈ మిస్టరీ మరణంపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయిలో దర్యాప్తును వేగవంతం చేశారు.
http://www.teluguone.com/news/content/mussoorie-hotel-room-death-36-223127.html





